MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Tamil Nadu Assembly Elections 2026: స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో అధికార పార్టీ 2 వేలు, ల్యాప్టాప్స్ సహా కీలక వాగ్దానాలు చేసింది.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 కు అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఒకవైపు అభ్యర్థుల జాబితా విడుదలవుతుండగా, మరోవైపు డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదివారం (మార్చి 29) నాడు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో పలు కీలక హామీలు ఇచ్చారు. మహిళలు, వృద్ధులకు నెలకు 2 వేల రూపాయలు ఇవ్వడం, ఉచిత విద్యుత్, 35 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని డీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో డీఎంకే మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. డీఎంకకే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిందని అన్నారు. ఒకవేళ తమిళనాడులో మళ్లీ డిఎంకె ప్రభుత్వం ఏర్పడితే, ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామని.. కొత్త పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు అల్పాహార పథకాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థినులకు ఆర్థిక సాయం రూ.1500లకు పెంపు, మహిళలకు రూ.8000 విలువైన కూపన్ వంటి హామీలను ప్రకటించారు.
మహిళలకు నెలకు 2 వేలు
స్టాలిన్ చేసిన ప్రధాన ప్రకటనల్లో కుటుంబంలో మహిళా పెద్దలకు ప్రస్తుతం ఇస్తున్న నెలకు వెయ్యి రూపాయలను 2000 రూపాయలకు పెంచనున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 1.37 కోట్లకు పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ను కూడా 2 వేల రూపాయలకు పెంచే హామీ ఇచ్చారు. ప్రస్తుతం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
5 లక్షల వరకు వడ్డీ లేని రుణాల ప్రకటన
మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిఎంకె అధినేత స్టాలిన్ హామీ ఇచ్చారు. దీనితో పాటు ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద లభించే ప్రయోజనాలను 1 లక్ష రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడితే వచ్చే ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్లను నిర్మిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సౌకర్యాలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.
ఉచిత విద్యుత్- ల్యాప్టాప్ల హామీ
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 35 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామన్నారు. అలాగే 20 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ సహాయాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మీటర్లు లేని పంప్ సెట్లను కూడా అందిస్తామని స్టాలిన్ తెలిపారు. ఉపాధి అవకాశాలను పెంచడానికి ఐటీ పార్క్లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని స్టాలిన్ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















