Raghav Chadha: నేటి ఆధునిక యుగంలో మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో, ఇంటర్నెట్ కూడా అంతే అవసరం. అయితే వినియోగదారులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన మొబైల్‌ డేటా, నిర్ణీత గడువులోగా వాడకపోతే వృథాగా పోతుంది. దీనిపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతూ టెలికాం కంపెనీల ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఆయన పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. 

Continues below advertisement

డబ్బు కడుతున్నాం కానీ డేటా మాయమవుతోంది!

ప్రస్తుతం టెలికాం రంగంలో ఉన్న అతి పెద్ద లోపాన్ని రాఘవ్ చద్దా సభ దృష్టికి తీసుకొచ్చారు. వినియోగదారులు ప్రతిరోజూ నిర్దిష్ట డేటా పరిమితి కోసం ముందుగానే డబ్బులు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారు రోజుకు 2జీబీ డేటా ప్లాన్ తీసుకుంటే,, అందులో కేవలం 1.5 జీడీ మాత్రమే వాడితే, మిగిలిన 0.5జీ డేటా అర్థరాత్రి దాటగానే ఎక్స్‌పైర్ అయిపోతుంది. వినియోగదారుడు ఇప్పటికే ఆ జేటా కోసం డబ్బు చెల్లించాడు. అలాంటప్పుడు అది వృథా కావడం లేదా వెనక్కి తీసుకోవడం బాగా లేదు అని చద్దా స్పష్టం చేశారు. 

ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న పొరపాటు కాదని, టెలికాం కంపెనీలు కావాలనే అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానమని ఆయన మండిపడ్డారు. దీని వల్ల వినియోగదారులు తాము పూర్తిగా వాడుకోలేని సామర్థ్యం కోసం పదే పదే డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Continues below advertisement

రాఘవ్ చద్దా ప్రతిపాదించిన మూడు కీలక సంస్కరణలు 

టెలికాం వినియోగదారుల హక్కులను కాపాడేందుకు రాఘవ చద్దా ప్రధానంగా మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 

డేటా క్వారీ- ఫార్వర్డ్‌ విధానం: ప్రస్తుత పద్ధతిలో మిగిలిపోయిన డేటా మరుసటి రోజుకు కలవదు. అలా కాకుండా ఒక రోజు మిగిలిపోయన డేటాను మరుసటి రోజు కోటాకు జోడించలా అన్ని టెలికాం సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీని వల్ల వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ప్రతి డేటాను సద్వినియోగం చేసుకోనే వీలు ఉంటుంది. 

తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు :  కొంతమంది వినియోగదారులు నిరంతరం తమ డేటా పూర్తిగా వాడలేపోతుంటారు. అటువంటి వారి విషంలో, నెల చివరన మిగిలిపోయిన డేటాను లెక్కించి, దాని విలువను బట్టి తదుపరి నెల రీఛార్జ్ మొత్తం తగ్గింపు ఇవ్వాలని చద్దా ప్రతిపాదించారు. ఇది వినియోగదారుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అన్నారు. 

డేటా బదిలీ అవకాశం: డేటాను వినియోగదారుడి డిజిటల్‌ ఆస్తిగా భావించాలని రాఘవ్ చద్దా ఒక వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. మనం బ్యాంకు నుంచి డబ్బులను ఇతరులకు పంపినట్టుగానే మన దగ్గర మిగిలిపోయిన డేటాను స్నేహితులకు, లేదా బంధువులకు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉండాలని కోరారు. 

డిజిట్ ఇండియా దిశగా మరో అడుగు 

భారత్‌ డిజిటల్ ఇండియా దిశగా వేగంగా అడుగులు వేస్తున్న టైంలో డిజిటల్‌ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని అదే సమయంలో అవి పారదర్శకంగా ఉండాలని చద్దా పేర్కొన్నారు. మీరు ఒక వస్తువు కోసం డబ్బు చెల్లిస్తే అది మీ ఆస్తి అవుతుంది. అది వాడినా వాడకపోయినా మీకే చెందాలి. డేటా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తించాలి అన్నారు. 

కేవలం డేటా మాయమైపోవడం వల్ల టెలికాం కంపెనీలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయని, ఇది వినియోగదారులను వంచించడమేనని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని, వినియోగదారులకు అనుకూలమైన టెలికాం విధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభలో పేర్కొన్నారు.