అన్వేషించండి

Punjab Crime News: క్లాస్ రూంలోనే అమ్మాయిని కాల్చి చంపి, ఆపై తాను కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. పంజాబ్ లా కాలేజీలో దారుణం

పంజాబ్ లోని లా కాలేజీలో విద్యార్థిని కాల్చి చంపిన అనంతరం ఆ యువకుడు తనను తాను కాల్చుకని ఆత్మహత్య చేసుకున్నాడు.

Punjab Crime News: పంజాబ్‌లోని తరణ్‌ తారన్‌ లా కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. విద్యార్థినిని కాల్చి చంపిన తోటి విద్యార్థి ఆపై తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. క్లాస్ రూంలో ఒకరి హత్య, మరొకరు ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయడంతో కాల్చి చంపాడని ప్రచారం జరుగుతోంది. హత్యకు ముందు వారిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు అనేది తెలియాల్సి ఉంది. కాలేజీలోకి ఆయుదాలు తీసుకురావడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

సందీప కౌర్ (20) అనే విద్యార్థిని Tarn Taran లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిందితుడు అభిరాజ్ సింగ్ (ప్రిన్స్ రాజ్ సింగ్‌) సైతం అదే క్లాస్ విద్యార్థి. అప్పటివరకూ క్లాస్ రూం చాలా ప్రశాంతంగా ఉంది. విద్యార్థులు అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతలో  నిందితుడు అభిరాజ్ సింగ్ తుపాకీతో క్లాం రూంలోకి వచ్చాడు. సందీప్ కౌర్ తన స్నేహితురాలితో కలిసి బెంచ్‌పై కూర్చుంది. నిందితుడు ఆమెతో కొంతసేపు ఏదో విషయంపై వాగ్వాదానికి దిగాడు. ఒక్కసారిగా తుపాకీ తీసి తన క్లాస్ మేట్ తలపై కాల్చాడు. ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. జరిగిన విషయానికి మరో విద్యార్థిని షాకైంది. అంతలోనే నిందితుడు అభిరాజ్ సింగ్ సైతం అదే తుపాకీతో తన తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

తుపాకీ పేలుడు శబ్ధాలు విన్న తోటి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. తలకు గురిపెట్టి కాల్చడంతో ఆమె మెదడు చిట్లిపోయి, క్షణాల్లోనే అక్కడికక్కడే మరణించింది. వెంటనే బాలిక ఫ్రెండ్ బయటకు పరుగులు తీసి కాలేజీ మేనేజ్‌మెంట్ కు విషయం చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

కాలేజీలో పిల్లలకు రక్షణ లేదు

ఘటన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీలో పిల్లలకు రక్షణ లేదని ఆరోపించారు.  విద్యార్థి తుపాకీతో వెళుతున్నా కూడా ఎవరూ చూడలేదు. ఆమె కుమార్తె తోటి విద్యార్థితో గొడవ పడిందని, ఆమెకు గాయాలయ్యాయని చెప్పారు. వారు కాలేజీకి వెళ్లి చూడగా బుల్లెట్ తగిలి కూతురు దారుణస్థితిలో చనిపోయి ఉందని గుర్తించిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన కూతురు తుపాకీ తూటాకు బలైపోతుందని వారు ఊహించలేకపోయారు. 

కాలేజీలోకి తుపాకీ ఎలా వచ్చింది, పోలీసుల విచారణ 

ఏసీపీ జగ్‌బీర్ మీడియాతో మాట్లాడారు. అప్పటికి క్లాస్ ఇంకా ప్రారంభం కాలేదు. బాలిక తన స్నేహితురాలితో కలిసి బెంచ్ మీద కూర్చుని ఉంది. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరగడంతో సందీప కౌర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయింది. వెంటనే ఆ యువకుడు తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఒకరు హత్యకు గురికాగా, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కాలేజీలోకి తుపాకీ ఎలాం వచ్చింది, విద్యార్థికి తండ్రికి లైసెన్స్ ఉన్న తుపాకీ ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget