అన్వేషించండి

PM Modi slams Congress: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా మారింది.. మళ్లీ అవసరమా ! AI సమ్మిట్లో నిరసనపై ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న నిరసనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వారు నగ్నంగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు.

మీరట్: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చేసిన షర్ట్‌లెస్ (చొక్కాలు విప్పి) నిరసనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీలోని మీరట్‌లో నిర్వహించిన బహరంగ సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ ఒక ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని తన మురికి, చెత్త రాజకీయాలకు కేంద్రంగా మార్చేసింది. మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారని దేశ ప్రజలకు తెలుసు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ ఏమన్నారు
ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 'దేశంలోనే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవి దేశ విజయాలను జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద AI సదస్సు భారత్‌లో జరగడాన్ని మీరు చూశారు. మీరట్ ప్రజలను నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ AI సమ్మిట్ జరిగినందుకు మీరు గర్వపడ్డారా లేదా?. దేశమంతా గర్వపడుతుంటే కాంగ్రెస్, దాని మద్దతుదారులు ఏం చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన మురికి, దిగజారుడు రాజకీయాలకు అడ్డాగా మార్చింది. కార్యక్రమ వేదిక వద్ద విదేశీ అతిథుల ముందు కాంగ్రెస్ నాయకులు బట్టలు విప్పి వెళ్లారు. నేను కాంగ్రెస్ నేతల్ని ఒకటి అడుగుతున్నాను. మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారని, ప్రజలు ఎన్నికల్లో మీ బట్టలు విప్పి నగ్నంగా నిల్చోబెట్టారు. మరి ఇప్పుడు బట్టలు విప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?' అని ప్రశ్నించారు.

 దేశాన్ని బద్నా చేయడంలో కాంగ్రెస్ బిజీ - ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ 'కాంగ్రెస్ నాయకులు చేసిన పని, దేశంలోని పురాతన పార్టీ ఎంత దరిద్రంగా మారిపోయిందో చూపిస్తుంది. ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేరు. మనమైతే గ్రామంలో ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా, అతిథులు వెళ్లేటప్పుడు గ్రామం గురించి మంచి అభిప్రాయంతో వెళ్లాలని చూస్తాం. ఆ పెళ్లి వేడుక సక్సెస్ చేయడానికి ప్రాణం పెట్టి పని చేస్తాం, కానీ కాంగ్రెస్ మాత్రం విదేశీ అథిదుల ఎదుట తన దేశాన్ని బద్నాం చేయడంలో బిజీగా ఉంది' అని అన్నారు.

నన్ను సమాధి చేయాలని చూస్తున్నారు..
'కాంగ్రెస్ నాయకులకు మోదీ అంటే ద్వేషం. అందుకే వారు నా సమాధి తవ్వాలనుకుంటున్నారు. నా తల్లిని దూషించడానికి కూడా వెనకాడటం లేదు. వారికి బిజెపి-ఎన్డిఏ అంటే వ్యతిరేకత ఉంది. మీ రాజకీయాల్లో ఇది చేయడం అవసరమే కావచ్చు. మేం ఇది కూడా సహిస్తాం. AI సమ్మిట్ అనేది బీజేపీ వేడుక కాదని, అక్కడ బీజేపీ నాయకులు ఎవరూ లేరని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది దేశ కార్యక్రమం. కాంగ్రెస్ మొన్న అన్ని మర్యాదలను ఉల్లంఘించింది. దేశమంతా ఈ కాంగ్రెస్ రీతి, నీతిపై థూ థూ అంటోంది. ఇంత పెద్ద పార్టీ నాయకులు సిగ్గుపడాల్సింది పోయి అరుస్తున్నారు. దేశాన్ని అవమానించే వారికి జై కొడుతున్నారు.'

అసలు విషయం ఏమిటి?
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా శుక్రవారం (ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వేదిక మీదకు వచ్చి నిరసన తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది నిరసనకారులు ఈ సమయంలో తమ షర్టులను విప్పి, ఇండియా AI సమ్మిట్ డిస్ప్లే బోర్డుల ముందు నిలబడి నినాదాలు చేస్తూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget