Odisha Train Accident LIVE: రైలు ప్రమాదంలో 288 మంది మృతి, మరో 56 మంది పరిస్థితి విషమం
Odisha Train Accident LIVE Updates: షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ కు సమీపంలో బహనాగా స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొన్న అనంతరం పట్టాలు తప్పింది.
LIVE
Background
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహనాగా స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొన్న అనంతరం పట్టాలు తప్పింది. 7 బోగీలు పట్టాలు తప్పిన ఈ ప్రమాదంలో 150 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. కోల్కతా నుంచి చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. 132 మందిని సోరో సీహెచ్సీకి, గోపాల్ పూర్ సీహెచ్సీ, ఖాంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలించినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ మీడియాకు వెల్లడించారు.
Coromandel Express derails near Bahanaga station in Balasore, Odisha. Several coaches are reported to have derailed: CPRO Southern Railway https://t.co/T38tcZojVd
— ANI (@ANI) June 2, 2023
సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి 7 గంటల తరువాత ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంబులెన్సులలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీలైతే ప్రమాదం జరిగిన చోట కొందరికి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. అధికారులో బాలేశ్వర్ లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 044- 2535 4771, 06782 262286 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
హౌరా హెల్ప్ లైన్ నెంబర్: 03326382217
ఖరగ్ పూర్ హెల్ప్ లైన్ నెంబర్: 8972073925, 9332392339
బాలాసోర్ హెల్ప్ లైన్ నెంబర్: 8249591559, 7978418322
కోరమండల్ రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్ ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నా ఆలోచనలు బాధితుల గురించి. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Distressed by the train accident in Odisha. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Spoke to Railway Minister @AshwiniVaishnaw and took stock of the situation. Rescue ops are underway at the site of the mishap and all…
— Narendra Modi (@narendramodi) June 2, 2023
ओडिशा के बालासोर में हुए कोरोमंडल एक्सप्रेस ट्रेन हादसे की खबर बेहद चिंताजनक है।
— Sandeep kishore 🇮🇳 (@sandeepkishore_) June 2, 2023
मैं ईश्वर से घायलों के शीघ्र स्वास्थ्य लाभ की प्रार्थना करता हूँ। 🙏#CoromandelExpress #Odisha #IndianRailways #TrainAccident pic.twitter.com/tRfhhh6dtw
తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి ప్రమీలా మల్లిక్, స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్సీ)ని ఒడిశా సీఎం ఆదేశించారు. ఒడిశా ప్రత్యేక రిలీఫ్ కమీషనర్ (SRC), సీనియర్ అధికారులు హేమంత్ శర్మ, బల్వంత్ సింగ్, అరవింద్ అగర్వాల్, అగ్నిమాపక సేవల డీజీతో పాటు సహాయక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజా రైలు ప్రమాదంతో బాలాసోర్ జిల్లా, చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను అలర్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతానికి మూడు ఎన్టీఆర్ఎఫ్ టీమ్ లు, నాలుగు ODRAF టీమ్స్ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడు సీఎం ఎంఎకే స్టాలిన్ ఒడిశా సీఎంకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
Coromandel express train accident | 132 injured shifted to Soro CHC, Gopalpur CHC, and Khantapada PHC: Chief Secretary, Odisha pic.twitter.com/wlnN1YJjjw
— ANI (@ANI) June 2, 2023
#OdishaTrainTragedy : 288కు పెరిగిన మృతుల సంఖ్య
#OdishaTrainTragedy శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కు చేరుకుంది. 56 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, మరో 747 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
As of 2pm today, the death toll in #OdishaTrainTragedy has risen to 288 while 747 people have been injured along with 56 grievously injured: Indian Railways#BalasoreTrainAccident pic.twitter.com/vAZ25o5q6o
— ANI (@ANI) June 3, 2023
నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - ప్రధాని మోదీ
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత మంది చనిపోవడం కలచివేసిందన్నారు. బాలాసోర్ మెడికల్ కాలేజీకి వెళ్లిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుకున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తాం, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం అన్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైలు పట్టాలను మరమ్మతులు చేపట్టి, రైలు సర్వీసులను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తోందన్నారు. రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిని, బాధితులను కలిశాను.. ప్రమాదంపై మాట్లాడేందుకు తనకు నోట మాట రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
#WATCH | "It's a painful incident. Govt will leave no stone unturned for the treatment of those injured. It's a serious incident, instructions issued for probe from every angle. Those found guilty will be punished stringently. Railway is working towards track restoration. I met… pic.twitter.com/ZhyjxXrYkw
— ANI (@ANI) June 3, 2023
రైలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న ప్రధాని మోదీ
ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన స్థలానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రాథమిక రిపోర్టును ప్రధానికి వివరిస్తున్నారు. అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the site of #BalasoreTrainAccident to take stock of the situation. #OdishaTrainAccident pic.twitter.com/mxwehPzsZZ
— ANI (@ANI) June 3, 2023
261 మంది మృతి
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 261కి పెరిగింది.
రైలులో యాంటీ కొలిషన్ డివైజ్ ఉంటే ప్రమాదాలు జరిగేవి కావు: మమతా బెనర్జీ
ఒడిశాలోని బాలాసోర్ లో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనే 1981లో జరిగింది. ఈ రైలులో ఎలాంటి యాంటీ కొలిషన్ పరికరం లేదని, అది ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తాం. సహాయ, పునరావాస చర్యల్లో ఒడిశా ప్రభుత్వానికి, రైల్వేకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
Odisha Train Accident: బాలాసోర్లో ముగిసిన సహాయక చర్యలు
ఒడిశాలోని బాలాసోర్ లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ప్రధాని స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శిస్తారని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి.
Odisha Train Accident: మృతదేహాల తరలించేందుకు వాయుసేన సాయం- రంగంలోకి ఎంఐ -17
ఒడిశా రైలు ప్రమాదంలో గుట్టగుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాల తరలింపు సమస్యగా మారుతున్న వేళ వాయిసేన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. మృతదేహాల తరలింపు కోసం ఎంఐ -17ని రంగంలోకి దింపింది.
ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. తొలుత బాలాసోర్ లో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, అనంతరం కటక్ లోని ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
ఒడిశా ఘోర ప్రమాదంలో 120 మంది తెలుగువారు మృతి- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్లు ఏర్పాటు
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 238 మంది మృతి చెందితే... అందులో తెలుగువాళ్లే వంద మందికిపైగా ఉన్నారని సమాచారం అందుతోంది.
ఒడిశాలో ప్రమాద బాధితుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
ఒడిశా రైలు ప్రమాదంపై వివరాలకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు విజయవాడ,రాజమండ్రి లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.
విజయవాడకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
Rly -67055
BSNL- 0866 2576924
రాజమండ్రికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
BSNL: 08832420541
RLY: 65395
దక్షిణ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్, సికింద్రాబాద్: 040 - 27788516
విజయవాడ : 0866-2576924
రాజమండ్రి : 0883-2420541
సామర్లకోట: 7780741268
ఏలూరు: 08812-232267
తాడేపల్లిగూడెం: 08818-226212
బాపట్ల: 08643-222178
తెనాలి: 08644-227
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets