Karnataka: కర్నాకటలోని విజయపురలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 50 వ నెంబర్ జాతీయ రహదారికి అనుకొని ఉన్న కార్ సర్వీస్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దాదాపు 20 కార్లు దగ్ధమయ్యాయి. భారీగా ఎగసి పడిన అగ్ని కీలలకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపు చేయడంతో సమీపంలోని భవనాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Continues below advertisement

సిటీ గుండా వెళ్లే కీలకమైన రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. సర్వీస్ సెంటర్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రమాదం ధాటికి భయపడిపోయిన వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే వరకు వారంతా దూరంగానే ఉన్నారు.  

మరో ఘటనలో విజయపుర జిల్లా చడ్చన్ తాలూకాలోని హవినాల్ గ్రామంలోని చక్కెర కర్మాగారంలో నిన్న సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.