Petrol Diesel Price Hike: భారత్‌లో ప్రస్తుతానికి చమురు సంక్షోభం తీవ్రంగా లేదు. కానీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందుకే ప్రజలకు ప్రయాణాలు తగ్గించాలని సూచిస్తోంది. అంతే కాకుండా చమురు ధర కూడా మూడు రూపాయలు పెంచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇలా ధరలు పెంచారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నమై, ధరలు మండిపోతున్న వేళ పెంచక తప్ప లేదు. ఇలా పెంచడం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు కూడా చమురు ధరలను పెంచాయి. అయితే వాటితో పోల్చుకుంటే మనకు పెంచింది చాలా తక్కువే. 

Continues below advertisement

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 82 దేశాలు చమురు సంక్షోభం కారణంగా ఎమర్జెన్సీ ఆంక్షలు, రేషనింగ్‌ లేదా భారీ ధరల పెంపును అమలు చేస్తున్నాయి. అయితే భారత్ అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా కేవలం మూడు రూపాయలు మాత్రమే పెంచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చమురు ధరలు ఏ స్థాయిలో పెంచారో చూద్దాం. 

  • యూఏఈలో ఇంధన ధరలు ఏకంగా 52 శాతం పెంచారు.
  • అగ్రరాజ్యం అమెరికాలో 44శాతం మేర ధరలు హైక్ చేశారు. 
  • మయన్మార్‌లో పెట్రోల్‌పై 89.7 శాతం, డీజిల్‌పై 112.7 శాతం పెరిగింది. 
  • మలేసియాలో పెట్రోల్‌పై 56.9 శాతం, డీజిల్‌పై 71.2శాతం పెరిగింది. 
  • పాకిస్తాన్‌లో పెట్రోల్‌పై 54.9శాతం, డీజిల్‌పై 44.9శాతం పెరిగింది. 
  • యూఏఈలో పెట్రోల్‌పై 52.4 శాతం, డీజిల్‌పై 86.1 శాతం పెరిగింది. 
  • అమెరికాలో పెట్రోల్‌పై 44.5శాతం, డీజిల్‌పై 48.1 శాతం పెరిగింది. 
  • శ్రీలంకలో పెట్రోల్‌పై 38.2శాతం, డీజిల్‌పై 41.8శాతం పెరిగింది. 
  • కెనడాలో పెట్రోల్‌పై 31.9శాతం, డీజిల్‌పై 32.8శాతం పెరిగింది. 
  • యూకేలో పెట్రోల్‌పై 19.2శాతం, డీజిల్‌పై 34.2శాతం పెరిగింది. 
  • ఫ్రాన్స్‌లో పెట్రోల్‌పై 20.9శాతం, డీజిల్‌పై 31శాతం పెరిగింది. 
  • జపాన్‌లో పెట్రోల్‌పై 9.7శాతం, డీజిల్‌పై 11.2శాతం పెరిగింది. 

భారత్‌లో పెట్రోల్‌పై 3.2శాతం, డీజిల్‌పై 3.4శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లు దాటినప్పటికీ, భారత్‌ ప్రభుత్వం గత 76 రోజులుగా ధరలను స్థిరంగా ఉంచి వినియోగదారులకు ఊరటనిచ్చింది. 

Continues below advertisement

లీటర్‌కు 26 రూపాయల భారం ప్రభుత్వంపై 

ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలే. అమెరికా- ఇరాన్ మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం స్ట్రైట్ ఆఫ్‌ హార్మూజ్‌ మూసివేయడంతో రవాణాకు ఆటంకం కలిగింది. దీంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతే కాకుండా నౌకల ప్రయాణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో భారత్‌లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరగాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం కనికరించింది. సామాన్యులపై భారం వేయకుండా కేవలం 3 రూపాయలతో సరిపెట్టింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం పెట్రోల్‌పై లీటర్‌కు 26 రూపాయలు, డీజిల్‌పై 82 రూపాయలు చొప్పున నష్టాన్ని భరించాల్సి వస్తోంది. 

అంతర్జాతీయ సంక్షోభం వేళ ఇతర దేశాలు చేతులెత్తేసినా, భారత్ మాత్రం మూడు రూపాయలను మాత్రమే పెంచింది. అసలైన భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. అయితే భవిష్యత్‌లో పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.