రిషి సునాక్కి టై కట్టిన అక్షతా మూర్తి, సోషల్ మీడియాలో ఫొటో వైరల్
G20 Summit 2023: ఫ్లైట్లో అక్షతా మూర్తి రిషి సునాక్కి టై కడుతున్న ఫొటో వైరల్ అవుతోంది.
Continues below advertisement

ఫ్లైట్లో అక్షతా మూర్తి రిషి సునాక్కి టై కడుతున్న ఫొటో వైరల్ అవుతోంది. (Image Credits: Instagram)
G20 Summit 2023:
Continues below advertisement
పోస్ట్ చేసిన సునాక్..
యూకే ప్రధాని రిషి సునాక్ G20 సదస్సు కోసం సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఇండియాకి వచ్చారు. ప్రధాని హోదాలో తొలిసారి ఇండియాకి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే...పాలం ఎయిర్పోర్ట్లో దిగే ముందు విమానంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఫ్లైట్ దిగే ముందు రిషి సునాక్ తన టై సరి చేసుకోవాలనుకున్నారు. ఆయనకు సరిగ్గా తెలియదు అనుకుందో ఏమో...అక్షతా మూర్తి వెంటనే ఆయన వద్దకు వెళ్లి తానే టై కట్టింది. ఆయన సిబ్బంది ఆ టైమ్లోనే ఫొట్ క్లిక్మనిపించారు. అదే ఫొటోని రిషి సునాక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. అలా షేర్ చేశారో లేదో..వెంటనే వైరల్ అయిపోయింది ఈ క్యాండిడ్ పిక్. అంత పెద్ద హోదాలో ఉన్నా....ఈ జంట సింపుల్గా కనిపిస్తోందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Continues below advertisement