Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించగా, 900 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మోదీ మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.


ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చాలా రైళ్లను దారి మళ్లించింది. ఆ పరిస్థితి లేని ట్రైన్స్‌ రద్దు చేసింది. అలాంటి రైళ్లా జాబితాను విడుదల చేసింది.


దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇలా ఉంది.


రైలు నెంబర్ 22807 టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.


రైలు నెంబర్ 22873 కూడా టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.


రైలు నెంబర్ 18409ను టాటా జంషెడ్ పూర్ వైపు మళ్లించారు.


రైలు నెంబర్ 22817ను కూడా టాటా వైపు మళ్లించారు.


రైలు నెంబర్ 15929ను తిరిగి భద్రక్ కు పిలిపించారు.


12840 చెన్నై సెంట్రల్-హౌరా ప్రస్తుతం ఖరగ్ పూర్ డివిజన్ లోని జరోలి గుండా నడుస్తుంది.


18048 వాస్కోడిగామా - షాలిమార్ కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా దారి మళ్లించబడింది.


సికింద్రాబాద్-షాలిమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా మళ్లిస్తారు.


రద్దయిన రైళ్ల జాబితా ఇలా ఉంది.


రైలు నెంబర్ 12837 హౌరాపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. అలాగే రైలు నెంబర్ 12863 హౌరా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు. రైలు నెంబర్ 12839 హౌరా-చెన్నై సెంట్రల్ మెయిల్, 12895, 20831, 02837 రైళ్లను కూడా రద్దు చేశారు.


ఎవరు ఏం చెప్పారు?


రైలు నెంబర్ 12841 చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ వెళ్తోంది. ఈ రైలు జూన్ 2న మధ్యాహ్నం 3.30 గంటలకు షాలిమార్ కు బయలుదేరింది. రాత్రి 8.30 గంటలకు ఖరగ్ పూర్ డివిజన్ పరిధిలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.


కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేసి హెల్ప్‌లైన్‌ నంబర్, సహాయక చర్యల గురించి తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న షాలిమార్-కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఈ సాయంత్రం బాలాసోర్ సమీపంలో ప్రమాదానికి గురికావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు.


సంతాప దినాలు


ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం జరిగిన భారీ రైలు ప్రమాదంలో 233 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం (జూన్ 3) ఉదయం వరకు సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, రైలు బోగీల నుండి మృతదేహాన్ని తొలగించడానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ఒక రోజు సంతాప దినాలు ప్రకటించారు.


బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక రోజు సంతాప దినాలు పాటించాలని ఆదేశించారని, అందువల్ల జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.


మోదీ కార్యక్రమాలు రద్దు


ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రధాని కార్యక్రమాలను కూడా మార్చేశారు. ముంబై-గోవాకు తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అది వాయిదా పడింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడారు.