Pahalgam Terror Attack Updates: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశ చర్యలకు పాకిస్తాన్ భయపడుతోంది. ఇంతలో ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉగ్రవాదం, ఉగ్రవాదుల నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎవరైనా ఒక కుట్ర దాడి చేసి అది వారి విజయం అని అనుకుంటే పొరపాటు అవుతుంది.  ఒక్కొక్కరిని వెతికి మరీ శిక్షిస్తామని అన్నారు.

'ఉగ్రవాదం అంతం వరకు పోరాటం కొనసాగుతుంది'

కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రి మన్సుఖ్ మండావియా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. కేంద్ర హోంమంత్రి ఉగ్రవాదం అంతమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారికి శిక్ష పడుతుందని అన్నారు.

ఎవరినీ వదిలిపెట్టరు - అమిత్ షా

హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో, ఈశాన్యంల అలజడి అయినా, వామపక్ష ఉగ్రవాద ప్రాంతమైనా లేదా కశ్మీర్‌పై ఉగ్రవాద దాడి  అయినా, ప్రతిదానికీ  ధైర్యంగా సమాధానం చెప్పాము. ఎవరైనా ఇలాంటి దాడులు చేసి  అది వారి  విజయం అని అనుకుంటే పొరపాటే అవుతుంది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం , ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు. ఈ దేశం నుంచి  ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే  మన సంకల్పం , అది కచ్చితంగా నెరవేరుతుంది.

అమిత్ షా ఉగ్రవాదులను హెచ్చరించారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 90వ దశకం నుంచి కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నడిపిస్తున్న వారికి వ్యతిరేకంగా మనం సహనంతో  ధైర్యంగా పోరాడుతున్నామని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానని అన్నారు. మన పౌరుల ప్రాణాలను తీసుకోవడం ద్వారా వారు ఈ యుద్ధాన్ని గెలుస్తామని వారు అనుకోకూడదు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఈ పోరాటంతో ముగింపు పలకాలి. ప్రతి ఒక్కరినీ ఎంచుకుని ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.