Bihar Bridge Collapse: కేంద్రమంత్రి గడ్కరీకి IAS షాక్! రూ.1700 కోట్లతో కట్టిన బ్రిడ్జ్ గాలికి కూలిపోయిందట!

ABP Desam Updated at: 10 May 2022 12:37 PM (IST)
Edited By: Murali Krishna

Bihar Bridge Collapse: వందల కోట్లతో నిర్మించిన ఓ బ్రిడ్జి గాలికి కూలిపోయిందని ఓ ఐఏఎస్ చెప్పిన వివరణకు కేంద్రమంత్రి గడ్కరీ షాకయ్యారు.

కేంద్రమంత్రి గడ్కరీకి IAS షాక్! రూ.1700 కోట్లతో కట్టిన బ్రిడ్జ్ గాలికి కూలిపోయిందట!

NEXT PREV

Bihar Bridge Collapse: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ ఐఏఎస్ షాకిచ్చారు. బిహార్‌లోని ఓ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై వివరణ కోరిన గడ్కరీ.. సదరు ఐఏఎస్ చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా గడ్కరీనే సోమవారం వెల్లడించారు.


ఏమైందంటే?


బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో గంగా నదిపై కడుతున్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఏప్రిల్‌ 29న కూలిపోయింది. దీనిపై సంబంధిత ఐఏఎస్‌ అధికారిని నితిన్ గడ్కరీ వివరణ కోరగా పెనుగాలే కారణమని తేలిగ్గా చెప్పేశారట. 


"గాలి మరీ గట్టిగా వచ్చింది. అందుకే బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది" అని ఆ ఐఏఎస్ చెప్పారని గడ్కరీ అన్నారు. ఈ మాటలు విని తాను షాకైనట్లు గడ్కరీ చెప్పారు.







ఎంత గట్టిగా వీచినా గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుందో నాకింత వరకూ అర్థం కాలేదు. ఏకంగా రూ.1,710 కోట్లతో కడుతున్న బ్రిడ్జి కూలిందంటే నిర్మాణంలోనే లోపముందన్నమాటే. కానీ ఆ ఐఏఎస్ చెప్పిన మాట విని షాకయ్యా.                                                             -    నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి 


నితిన్ గడ్కరీ చెప్పిన ఈ మాటలు విని ఆ సమావేశంలో ఉన్నవారంతా గట్టిగా నవ్వారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా గడ్కరీకి మద్దతుగా 'గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుంది ఐఏఎస్ గారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Also Read: Coronavirus Cases India: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- 10 మంది మృతి


Also Read: South Korea's New President: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్- కిమ్‌తో చర్చకు రెడీ

Published at: 10 May 2022 12:31 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.