Lanka to India: శ్రీలంక నుంచి ఈదుకుంటూ ఇండియాకొచ్చేశారు - బెంగళూరు జంట రికార్డ్
swims from Sri Lanka to India: బెంగళూరుకు చెందిన ఒక దంపతులు సముద్ర గర్భంలో అద్భుతం సృష్టించారు. శ్రీలంక నుంచి భారత్ వరకు ఉన్న పాక్ జలసంధిని ఈదుకుంటూ వచ్చారు.

couple swims from Sri Lanka to India: బెంగళూరుకు చెందిన ఒక దంపతులు సముద్ర గర్భంలో అద్భుతం సృష్టించారు. శ్రీలంక నుంచి భారత్ వరకు ఉన్న పాక్ జలసంధిని ఈదుకుంటూ దాటి సరికొత్త చరిత్ర లిఖించారు. సరిహద్దులు కేవలం భూమి మీదనే కాదు, సముద్రం పైన కూడా ఉంటాయి. కానీ ఆ సముద్రపు అలలను చీల్చుకుంటూ, అసాధారణ పట్టుదలతో బెంగళూరుకు చెందిన ఒక ఐటీ దంపతులు అరుదైన రికార్డు సృష్టించారు. డానిష్ అబ్దీ , వృషాలి ప్రసాద్ అనే దంపతులు శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత తీరంలోని ధనుష్కోడి వరకు సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటూ దాటారు. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని వారు కేవలం 10 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేసి మేము సాధించాం అంటూ గర్వంగా ప్రకటించారు.
రామ్ సేతు మార్గంలో సాహస యాత్ర
చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన రామ్ సేతు మార్గంలో ఈ ఈత సాహసం కొనసాగింది. బుధవారం తెల్లవారుజామున శ్రీలంక తీరంలో ప్రారంభమైన వీరి ప్రయాణం, హిందూ మహాసముద్రంలోని బలమైన అలలు, ఎదురుగాలి , సముద్రపు జీవుల సవాళ్లను అధిగమిస్తూ సాగింది. మణిపాల్ హాస్పిటల్స్ మద్దతుతో జరిగిన ఈ ఓపెన్ వాటర్ స్విమ్ లో వీరిద్దరూ ఏకధాటిగా ఈదుతూ భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. ఒక జంటగా ఈ మార్గాన్ని దాటిన మొదటి దంపతులుగా వీరు రికార్డు పుటల్లోకి ఎక్కారు.
నాలుగేళ్ల క్రితమే ఈత నేర్చుకుని..
ఈ విజయం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఈ దంపతులు కేవలం నాలుగేళ్ల క్రితమే ఈత నేర్చుకున్నారు. . ఒకసారి మాల్దీవుల పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడ చిన్న పిల్లలు సముద్రంలో స్వేచ్ఛగా ఈదుతుంటే తాము మాత్రం లైఫ్ జాకెట్లతో ఉండటం చూసి వారు ఈత నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలే నేడు వారిని అంతర్జాతీయ సరిహద్దులను దాటేలా చేసింది. స్కిల్ నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించడమే మా లక్ష్యం అని వారు మీడియాకు తెలిపారు.
సాంస్కృతిక వారధిగా సాహసం
ఈ సాహసయాత్ర కేవలం రికార్డుల కోసం మాత్రమే కాకుండా, భారత్ , శ్రీలంక దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు. సముద్రంలో జెల్లీ ఫిష్లు, వాతావరణ మార్పులు ఇబ్బంది పెట్టినప్పటికీ, పక్కనే ఉన్న సపోర్ట్ బోట్లు , కోస్ట్ గార్డ్ సిబ్బంది పర్యవేక్షణలో వీరు లక్ష్యాన్ని చేరుకున్నారు. సోషల్ మీడియాలో తమ విజయాన్ని పంచుకున్న ఈ జంటకు నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే ఏడేళ్ల బాలుడు ఇషాంక్ ఇదే మార్గాన్ని 9 గంటల 50 నిమిషాల్లో దాటగా, ఇప్పుడు ఈ బెంగళూరు దంపతులు జంటగా ఈ రికార్డు సాధించారు. సాహస క్రీడల్లో భారతీయులు ప్రపంచస్థాయిలో దూసుకుపోతున్నారనడానికి ఈ విజయాలే నిదర్శనం.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















