బరుయిపూర్లో 12 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్. అతడు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
బెంగాల్లోని బరుయిపూర్లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు ప్రభాస్ మండల్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. క్రైమ్ సీన్ రీక్రియేషన్ సమయంలో వెపన్ లాక్కొని కాల్పులు జరపడంతో కాల్పులు జరిపారు.

- పశ్చిమ బెంగాల్లో బాలిక హత్య, అత్యాచారం తీవ్ర కలకలం సృష్టించింది.
- ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ నేరస్థలానికి తీసుకెళ్లారు.
- మండల్ తుపాకీ లాగి కాల్పులు జరపగా, పోలీసులు ఎదురు కాల్చారు.
- ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలై, ప్రభాస్ మండల్ మృతిచెందాడు.
Baruipur Rape Murder Case | కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. బరుయిపూర్లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ ను క్రైమ్ సీన్ రీక్రియేషన్ (నేర స్థలాన్ని పరిశీలించే)కు తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితుడు పోలీసుల నుంచి వెపన్ లాక్కొని కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మండల్ మరణించాడు.
జూలై 5న దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్లో ఒక చెరువులో ఈ బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘోర ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. జూలై 4 సాయంత్రం 6 గంటల సమయంలో నివాసం నుంచి కనిపించకుండా పోయిన బాలిక ఆ మరుసటి మరుసటి రోజు శవమై తేలింది.
బరుయిపూర్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పన్నెండేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన ప్రభాస్ మండల్ను దర్యాప్తులో భాగంగా జూలై 7 అర్ధరాత్రి తర్వాత సుమారు 12:45 గంటలకు పోలీసులు సూర్యాపూర్లోని నేర స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి ముందే, నిందితుడు ప్రభాస్ ఒక్కసారిగా ఒక పోలీసు అధికారి వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరిపి, వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
Also Read: Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
నిందితుడు జరిపిన కాల్పులకు వెంటనే స్పందించిన పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసం నిందితుడిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రభాస్ మండల్ను పోలీసులు తక్షణమే బరుయిపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడ్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేశారు. బాధిత బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెపై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులకు కొన్ని కీలక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనను నిందితులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. బరుయిపూర్ జిల్లా పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్లు జూలై 4వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య ఒకే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. నేరం జరిగినట్లు భావిస్తున్న టైంతో వీరు ఉన్న ఏరియా మ్యాచ్ అయింది.
Frequently Asked Questions
బరుయిపూర్ అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు?
ప్రభాస్ మండల్ ఎలా మరణించాడు?
క్రైమ్ సీన్ రీక్రియేషన్ సమయంలో నిందితుడు పోలీసుల నుండి ఆయుధాన్ని లాక్కొని కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రభాస్ మండల్ మరణించాడు.
ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏమి ఏర్పాటు చేసింది?
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘోర ఘటనపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
కేసులో ఏమైనా ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యాయా?
సిట్ అధికారులకు కొన్ని కీలక డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి, ఇది ముందస్తు ప్రణాళికను సూచిస్తుంది. నిందితుల మొబైల్ టవర్ లొకేషన్లు కూడా నేరం జరిగిన సమయానికి సరిపోయాయి.
ట్రెండింగ్ వార్తలు























