ఎయిరిండియా బోయింగ్​ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. అమృత్​సర్​ నుంచి ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​కు వెళ్లిన బోయింగ్​ 787–8 డ్రీమ్​ లైనర్​ విమానం ల్యాండింగ్​కు సిద్ధమవుతున్న వేళ.. ఎమర్జెన్సీలో వాడే ర్యామ్​ ఎయిర్​ టర్బైన్​ (RAT) అకస్మాతుగా బయటకు వచ్చింది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురైనా.. విమానం సురక్షితంగా ల్యాండ్​ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.

Continues below advertisement

బర్మింగ్‌హామ్– న్యూఢిల్లీ విమానం రద్దువిమానం ల్యాండింగ్ తర్వాత తనిఖీల కోసం దాన్ని నిలిపివేశారు. దీని ఫలితంగా బర్మింగ్‌హామ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన తదుపరి విమానం రద్దయ్యింది. ర్యాట్​ అనేది విమానంలోని చిన్న పరికరం. సాధారణంగా ముడుచుకుపోయి ఉండే ఇది.. ఇంజిన్​ వైఫల్యం, విద్యుత్​ ఉత్పత్తి చిలిచిపోవడం లాంటి అత్యవసర స్థితిలో తెరుచుకుంటుంది.

స్పందించిన ఏయిరిండియాఈ ఘటనపై ఎయిర్​ఇండియా స్పందించింది. ‘అక్టోబర్ 04న అమృత్‌సర్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన AI117 విమానం ల్యాండింగ్​ సమయంలో  రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) పనిచేయడాన్ని సిబ్బంది గుర్తించారు. విమానంలోని అన్ని విద్యుత్, హైడ్రాలిక్ పారామీటర్లు సాధారణ స్థితిలోనే ఉన్నాయి.  విమానం బర్మింగ్‌హామ్‌లో సురక్షితంగా ల్యాండ్​ చేశారు. తదుపరి తనిఖీల కోసం విమానం నిలిపివేశాం. ఢిల్లీకి వెళ్లే AI114 విమానాన్ని రద్దు చేశాం.  అతిథులకు వసతి కల్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

Continues below advertisement

ఇటీవల అహ్మదాబాద్​లో బోయింగ్​ 787–8 డ్రీమ్​లైనర్​ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది మృతిచెందారు. ఈ ఘటనకు కొన్ని క్షణాల ముందు విమానానికి ఉండే ర్యాట్​ బయటకు వచ్చి పనిచేసినట్లు గుర్తించారు. అయితే విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.