India Launches First E85 Fuel Station In Delhi With Lower Prices: దేశ రాజధాని ఢిల్లీలో ఇండియాలోనే మొట్టమొదటి ఈ85 (E85) ఫ్యూయల్ డిస్పెన్సర్‌ను ప్రారంభించారు. ఈ కొత్త ఇంధనం లీటర్ ధర రూ.82.12 గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సాధారణ ఈ20 పెట్రోల్ ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.20 తక్కువ. రన్నింగ్ కాస్ట్స్ పరంగా చూస్తే ఇది వాహనదారులకు పెద్ద గుడ్ న్యూస్ లా అనిపించినా, దీని వెనుక ఉన్న మైలేజ్ ట్విస్ట్‌ను కూడా కచ్చితంగా అర్థం చేసుకోవాలి. లేదంటే ఆశించిన స్థాయిలో లాభం ఉండకపోవచ్చు.

Continues below advertisement

మైలేజ్ తగ్గే ఛాన్స్..ఈ85 ఇంధనం అనేది 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారవుతుంది. చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్‌ను తయారు చేస్తారు. ఈ ఇంధనం పెట్రోల్ కంటే చాలా చౌకగా దొరికినప్పటికీ, వాహనాల మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇథనాల్ ఎనర్జీ కంటెంట్ పెట్రోల్ కంటే తక్కువగా ఉండటమే దీనికి కారణం. పెట్రోల్ క్లీన్‌గా బర్న్ అవుతుంది, మంచి ఆక్టేన్ రేటింగ్ ఇస్తుంది, కానీ కేలరిఫిక్ వాల్యూ తక్కువగా ఉంటుంది. దీనివల్ల నార్మల్ పెట్రోల్ ఇచ్చేంత పవర్ జనరేట్ చేయడానికి ఇంజిన్ ఎక్కువ ఇథనాల్‌ను బర్న్ చేయాల్సి వస్తుంది.  గ్లోబల్ మార్కెట్ అంచనాల ప్రకారం, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణ పెట్రోల్ కార్ల కంటే 20 నుంచి 30 శాతం తక్కువ మైలేజ్ ఇస్తాయి. ఉదాహరణకు ఒక బైక్ లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, ఈ85 ఇంధనంతో అది 40 నుంచి 42 కిలోమీటర్లకు పడిపోవచ్చు.

Read Also: Best Mileage CNG Cars India 2026:లీటరుకు 25 కిలోమీటర్లకుపైగా మైలేజ్ ఇచ్చే టాప్ 5 బెస్ట్ సిఎన్‌జి కార్లు ! ధర,ఫీచర్ల పూర్తి వివరాలు ఇవే!

Continues below advertisement

వెహికల్ కంపాటబిలిటీ సమస్యలు..ప్రస్తుతం ఇండియాలో ఈ85 ఇంధనంతో నడిచే వాహనాలు చాలా తక్కువగా ఉన్నాయి. హీరో మోటోకార్ప్ రీసెంట్‌గా స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులను లాంచ్ చేసింది. సుజుకి కంపెనీ జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఎఫ్ఎఫ్వి మోడల్‌ను అమ్ముతోంది. మారుతి సుజుకి కూడా వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను ప్రదర్శించింది, కానీ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే అధికారిక డేట్ ను ప్రకటించే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Car Insurance Hydrostatic Lock Claim Telugu: వర్షపు నీటిలో కారు ఇంజిన్ ఆగిపోతే ఇన్సూరెన్స్ వస్తుందా? క్లెయిమ్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సవాళ్లు..ప్రస్తుతానికి ఈ85 ఇంధనం లభ్యత చాలా పరిమితంగా ఉంది. ప్రభుత్వం ఈ ఇథనాల్ ఫ్యూయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారీగా పెంచాలని ప్లాన్ చేస్తోంది. 2026 చివరి నాటికి 500 ఇథనాల్ బంకులను, 2027 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 5,000 అవుట్‌లెట్లను తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఫ్యూయల్ ధరల గ్యాప్ ఇలాగే కొనసాగితే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే టూ వీలర్ రైడర్లకు మంత్లీ బిల్స్ తగ్గే అవకాశం ఉంది.