Himachal CM Sukhwinder Singh Sukhu:


ప్రతిభా సింగ్‌ను కాదని..


హిమాచల్  సీఎం పీఠంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. సుఖ్వీందర్ సింగ్ సుకుని ముఖ్యమంత్రిగా ప్రకటించింది అధిష్ఠానం. దాదాపు రెండ్రోజుల పాటు ఈ విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి. షిమ్లా వేదికగా కాంగ్రెస్ లీడర్లంతా సమావేశమయ్యారు. ప్రతిభా సింగ్‌ను సీఎం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఆఫీస్ ఎదుట కాస్త హడావుడి చేశారు. కానీ...అధిష్ఠానం మాత్రం ఆమె పేరుని పక్కన పెట్టేసింది. సుఖ్వీందర్ సింగ్ సుకు, రాజేందర్ రాణే, ముకేశ్ అగ్నిహోత్రి ఈ రేసులో మిగిలారు. అయితే..వీరిలో సుఖ్వీందర్ సుకుకి ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉండటం సహా...అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపింది. ఫలితంగా...రెండ్రోజుల సస్పెన్స్ తరవాత ఉత్కంఠకు తెర దించింది. ఇక ముకేశ్ అగ్నిహోత్రి, రాజేందర్ రాణాలకు డిప్యుటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే..ఈ నిర్ణయంపై ప్రతిభా సింగ్ మద్దతుదారులు అసంతృప్తిగా ఉన్నారు. షిమ్లాలోని పార్టీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున గుమి గూడారు. ప్రతిభా సింగ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.