Kavitha Saree Trends: కేసీఆర్ కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కల్వకుంట్ల కవిత సరికొత్త ప్రయాణం ప్రారంభించారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పరీక్షలు సిద్ధమయ్యారు. దీని కోసం గత ఏడాది నుంచి ఆమె గ్రౌండ్ వర్క్ చేశారు. పార్టీలో తనకు సరైన గౌరవం లేదని గ్రహించినప్పటి నుంచి తన స్టైల్ మొత్తం మార్చేశారు. పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత తన ఆహార్యాన్నే పూర్తిగా మార్చేశారు. సామాన్యురాలి మాదిరిగా కనిపించేందుకు ప్రజల్లో ఒకరిగా గుర్తింపు పొందేందుకు మేకవోవర్ అయ్యారు. 

Continues below advertisement

స్టైల్ మార్చిన కవిత 

భారత్ రాజకీయాల్లో ఒక లీడర్‌ వేషధారణ కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు అది ప్రజలకు పంపే బలమైన సందేశం. మహాత్మాగాంధీ నుంచి నేటి తరం నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ వస్త్రధారణ ద్వారా ఒక నిర్దిష్టమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కవిత కూడా తన స్టైల్ మార్క్ సృష్టించే పనిలో ఉన్నారు. 

Continues below advertisement

ప్రజలకు చేరువయ్యేందుకు సామాన్యురాలిలా...

గతంలో ఖరీదైన పట్టు చీరలు, విదేశీ బ్రాండెడ్ వారీలు, స్టైలీష్ హెయిర్ స్టైల్స్‌తో కనిపించిన కవిత ఇప్పుడు తన లుక్‌ను లోకల్‌గా మార్చుకున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రజలకు మరింత చేరువ కావడమే. తాను ధరించే చీరకట్టు వల్ల సామాన్య ప్రజలు తనను తమలో ఒకరిగా భావిస్తారని ఎవరైనా ధైర్యంగా వచ్చి తనతో మాట్లాడగలుగుతారని ఆమె భావన. 

Also Read: కవిత పార్టీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ - సెంటిమెంట్లు లేని రాజకీయాలే - కేటీఆర్ తట్టుకోగలరా?

పూర్తిగా మేకవోర్ మార్చేసిన కవిత 

కవిత తన రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో డిజైనర్ శారీలు, ఖరీదైన వాచ్‌లు ధరించేవారు. ఒక సందర్భంలో ఆమె తాను కట్టుకున్న వాచ్‌ ఖరీదు 25 లక్షల వరకు ఉంటుందని చెప్పడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. విదేశాల నుంచి తెప్పించిన కాస్మోటిక్స్, ఖరీదైన పట్టు చీరలు లేటెస్ట్ చెప్పులు ఆమె ఆహార్యంలో అంతర్భాగంగా ఉండేవి. రోజుకు రెండు మూడు కార్యక్రమాలు ఉన్నా, సందర్భాన్ని బట్టి ఆమె తన మేకోవర్ మార్చుకునే వారు. 

చేనేత చీర- మట్టి గాజులు 

అయితే బీఆర్‌ఎస్‌లో విభేదాల వల్ల జనం బాట పేరుతో జిల్లాల పర్యటనలు చేపటినప్పటి నుంచి ఆమె శైలిలో స్పష్టమైన మార్పు వచ్చింది. విలాసవంతమైన వస్తువుల స్థానంలో సింప్లిసిటీకి ఆమె పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేతులకు ఖరీదైన వాచీలు కనిపించడం లేదు. వాటి స్థానంలో సాధారణ మట్టి గాజులు వచ్చాయి. ఈ మార్పు కేవలం బాహ్య రూపానికే పరిమితం కాలేదు. ప్రజలతో ఆమె సంభాషించే విధానంలో మార్పు కనిపిస్తోంది. 

కొప్పునకు ప్రాధాన్యత 

కవిత తన హెయిర్‌స్టైల్‌ విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. గతంలో  జుట్టును లూజ్‌గా వదిలేసి లేకా రకరకాలైన హెయిర్ స్టైల్‌లో కనిపించేవారు. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే కొప్పు పెట్టుకుంటున్నారు. పల్లెటూరి మహిళల జీవనశైలిలో కొప్పునకు ప్రాధాన్యత ఇచ్చే దృష్టితో ఆమె తన స్టైల్ మార్చేశారు. ఇది ప్రజల్లో ఆమె పట్ల ఒక ఆత్మీయ భావన కలిగిస్తోందని ఆశిస్తున్నారు. 

Also Read: ఏప్రిల్ 25 సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?

ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు 

కవిత కేవలం రాజకీయ నాయకురాలిగానే కాకుండా చేనేత రంగానికి అండగా నిలబడ్డారు. జాగృతి సంస్థ ద్వారా చేనే కార్మికుల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టారు. చేనేత చీరలు ధరించడం ఆనేది కేవలం వస్త్రధారణ మాత్రమే కాదు, పది మంది ఫాలో అయితే చేనేత వస్త్రాలకు గిరాకీ పెరుగుతుందని ఆమె భావన. ఆమె వార్డ్‌రోబ్‌లో కాటన్,సిల్క్ , షిఫాన్ చీరలు కూడా ఉంటాయి. రాజకీయ పర్యటనల్లో మాత్రం ఆమె ఎక్కువ చేనేత వస్త్రాలకే ప్రాధాన్యత ఇస్తారు. జయలలిత, మమతా బెనర్జీ మాదిరిగానే తనకూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. అ దిశగానే మేకవోర్ అయ్యారు. 

సోషల్ మీడియాలో ట్రోల్స్‌

ఇటీవల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థానికి కవిత హాజరైనప్పుడు ధరించిన చీర రంగులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఆమె ధరించిన చీర రంగులు కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను పోలి ఉండటంతో ఆమె త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఆమె ప్రత్యర్థులు ట్రోల్ చేశారు. 

సందర్భానికి తగ్గుట్టు కట్టూబొట్టు 

కవిత వివిధ సందర్భాల్లో ధరించిన చీరలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఆయుత చండీ మహాయాగం చేసిన తొలి రోజు పసుపు రంగు ఇక్కత్ సిల్క్ చీర, రెండో రోజు గులాబీ రంగు సిల్క్ చీర, మూడో రోజు తెలుపు రంగు సిల్క్ చీరతో ఆమె ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. తన తండ్రి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు జట్టు వెనక్కి ముడివేసి చేనేత చీరలో ఒక గంభీరమైన లుక్‌తో కనిపించారు.