August 15 or January 26 Flag Ceremony : దేశవ్యాప్తంగా ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) తేదీలలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ రెండు సందర్భాలలోనూ జెండాను ఎగురవేసే నియమాలు భిన్నంగా ఉంటాయి. ఈ వ్యత్యాసమే భారతదేశ స్వాతంత్ర్య, దాని రాజ్యాంగ కథను చెబుతుంది. ఇంతకీ జెండా ఎగురవేసే విధానంలోని నియమాలు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

2026 లో ఇండియా తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రాజధాని ఢిల్లీలోని జాతీయ రహదారి వద్ద జరగనున్న గ్రాండ్ పరేడ్ కోసం సన్నాహాలు చివరి దశకు వచ్చేశాయి. జనవరి 26వ తేదీన దేశ రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ రెండు సందర్భాలలో జెండాను ఎగురవేయడానికి కొన్ని నియమాలు భిన్నంగా ఉంటాయి. అవేంటంటే..

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత

ఆగస్టు 15, జనవరి 26 తేదీలు భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆగస్టు 15, 1947న దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజు. ఈ రోజును భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనుంచి నుంచి స్వాతంత్ర్యం పొందింది. జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. అందువల్ల ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Continues below advertisement

జెండా ఎగురవేడంలో వ్యత్యాసాలు ఇవే

చాలా మంది ఈ రెండు రోజులూ కూడా ఒకే విధంగా జెండా ఎగురవేస్తారని నమ్ముతారు. కానీ అది నిజం కాదు. ఆగస్టు 15న అనుసరించే జెండా ఎగురవేసే ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. దీనిలో త్రివర్ణ పతాకాన్ని జెండా స్తంభం కింది నుంచి తాడుతో పైకి లేపి.. ఆపై హుక్‌ను విప్పుతారు. ఇది బ్రిటిష్ జెండాను కిందకి దించి.. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని సూచిస్తుంది.

గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎలా ఎగురేస్తారంటే..

గణతంత్ర దినోత్సవం నాడు జెండాను ఎగురవేయరు. ఆవిష్కరిస్తారు. దీనిని జెండా ఆవిష్కరణ అంటారు. ఈ రోజున త్రివర్ణ పతాకాన్ని జెండా స్తంభం పైభాగానికి కట్టి ఉంచుతారు. తాడును లాగడం ద్వారా జెండా విచ్చుకుంటుంది. ఇది భారత రాజ్యాంగాన్ని స్వీకరించడాన్ని, కొత్త రాజ్యాంగ యుగం ప్రారంభాన్ని సూచిస్తుంది.

ఆగస్టు 15న దేశ ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎందుకంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చే సమయానికి భారత రాజ్యాంగం అమలు కాలేదు. రాష్ట్రపతి పదవి ఉనికిలో లేదు. ఆ సమయంలో ప్రధానమంత్రి దేశ పరిపాలనా అధిపతి. జనవరి 26వ తేదీన.. దేశ రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎందుకంటే రాష్ట్రపతి భారతదేశ రాజ్యాంగ అధిపతి. ఈ రోజున భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.