Central Armed Police Forces (ACs) Examination, 2025: కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్ (BSF), సీఆర్పీఎఫ్ (CRPF), సీఐఎస్ఎఫ్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB) దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి 'సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2025' నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 5న విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 357 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2025
ఖాళీల సంఖ్య: 357.
➥ బీఎస్ఎఫ్: 24 పోస్టులు
➥ సీఆర్పీఎఫ్: 204 పోస్టులు
➥ సీఐఎస్ఎఫ్: 92 పోస్టులు
➥ ఐటీబీపీ: 04 పోస్టులు
➥ సశస్త్ర సీమాబల్: 33 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01.08.2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.2000 - 01.08.2005. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
పేపర్-1 పరీక్ష విధానం: మొత్తం 250 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియా & వరల్డ్ జియోగ్రఫీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
పేపర్-2 పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ అంశాలు ఉంటాయి. ఇందులో రెండు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎకి 80 మార్కులు కేటాయించారు. పార్ట్-ఎలో వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు. స్వాతంత్య్రపోరాటం, జియోగ్రఫీ, పాలిటీ & ఎకానమీ, మానవ హక్కులు, అనలిటికల్ ఎబిలిటీ ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక పార్ట్-బికి 120 మార్కులు కేటాయించారు. ఇందులో కాంప్రహెన్షన్, ప్రిసైజ్ రైటింగ్, సింపుల్ గ్రామర్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
ఫిజికల్ ఈవెంట్లు..
➥ అభ్యర్థులు 100 మీటర్లు పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో పరుగు పూర్తిచేయాలి.
➥ అదేవిధంగా 800 మీటర్ల పరుగుపందెం కూడా నిర్వహిస్తారు. పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది.
➥ లాంగ్ జంప్లో మూడు అవకాశాలలో పురుషులు 3.5 మీటర్లు, మహిళలు 3.0 మీటర్లు జంప్ చేయాల్సి ఉంటుంది.
]➥ ఇక పురుషులకు మాత్రమే షార్ట్పుట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడు అవకాశాల్లో 7.26 కిలోల బరువుండే గుండును 4.5 మీటర్ల వరకు విసరాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 25.03.2025.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 26.03.2025 నుంచి 01.04.2025 వరకు.
➥ రాతపరీక్ష తేదీ: 03.08.2025.
➥ పరీక్ష సమయం: పేపర్-1 ఉదయం.10:00 - 12:00 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:00- 5:00 గంటల వరకు.