టీఎస్‌పీఎస్సీ 783 పోస్టులతో ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-2 ఉద్యోగాల సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్‌-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్‌-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్‌-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్‌-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్‌-2 రెండో సెక్షన్‌లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు.


జాతీయ సమగ్రత, అంతర్గత భద్రత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలు చేర్చారు. మూడో సెక్షన్‌లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం-మహిళలు అనే అంశాన్ని చేర్చారు. పేపర్‌-3లోని ఒకటో సెక్షన్‌లో డెమోగ్రఫీ (జనాభా శాస్త్రం), ప్రాథమిక, ద్వితీయ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం, ప్లానింగ్‌, నీతిఆయోగ్‌-పబ్లిక్‌ ఫైనాన్స్‌ జతచేశారు. రెండో సెక్షన్‌లో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధితోపాటు జనాభా-మానవవనరుల అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాలు, పరిశ్రమలు-సేవా రంగాలు, రాష్ట్ర ఫైనాన్స్‌, బడ్జెట్‌, పాలసీలు చేర్చారు. మూడో సెక్షన్‌లో అభివృద్ధి-అండర్‌ డెవలప్‌మెంట్‌, పేదరికం-నిరుద్యోగిత, పర్యావరణం- సుస్థిర అభివృద్ధిని కొత్తగా కలిపారు.


గ్రూప్-2 పరీక్ష విధానం: 

మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. 


 పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.


 పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.  



ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.01.2023 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.02.2023


➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.


Notification


Website


Also Read:


తెలంగాణలో నోటిఫికేషన్ల జాతర - తాజాగా మరో 4 జాబ్ నోటిఫికేషన్లు విడుదల!
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ నోటిఫికేషన్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశారు. తెలంగాణలో ఇదివరకే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయి. తాజాగా ఇంటర్, సాంకేతిక విద్యలో 71 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. విద్యాశాఖలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టులు, సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...