RRB RPF Constable Answer Key 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్పీఎఫ్) పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేపింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా పొందుపరిచింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మార్చి 24 నుంచి 29 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్లైన్ లింక్ ద్వారా అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు, అభ్యంతరాల నమోదుచేయవచ్చు. అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి కీ పై అభ్యంతరాలను తెలపవచ్చని, సరైనదని తేలీతే తిరిగి రీఫండ్ చేయబడతుందని రైల్వే శాఖ తెలిపింది.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మొత్తం 4,660 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 452 సబ్ ఇన్స్పెక్టర్(SI), 4208 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మార్చి 2 నుంచి 18 వరకు ఆర్పీఎఫ్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
ఆర్పీఎఫ్ ప్రాథమిక కీ, అభ్యంతరాల కోసం క్లిక్ చేయండి..
రాతపరీక్ష విధానం..
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, అరిథ్మెటిక్ 35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
ఆర్పీఎఫ్ పీఈటీ (ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్): రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణ కింది విధంగా ఉంటుంది.
విభాగం | 1600 మీటర్ల పరుగు | 800 మీటర్ల పరుగు | లాంగ్ జంప్ | హైజంప్ |
ఎస్ఐ (మెన్) | 6.30 నిమిషాలు | - | 12 ఫీట్లు | 3 ఫీట్ల 9 అంగుళాలు |
ఎస్ఐ (ఉమెన్) | - | 4 నిమిషాలు | 9 ఫీట్లు | 3 ఫీట్లు |
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT):
ఆర్పీఎఫ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) | ||||
విభాగం | ఎత్తు (సెం.మీ.లలో ) | ఛాతీ (సెం.మీ.లలో ){పురుషులకు మాత్రమే} | ||
జనరల్/ఓబీసీ | 165 | 157 | 80 | 85 |
ఎస్సీ/ఎస్టీ | 160 | 152 | 76.2 | 81.2 |
గర్వాలీలు, గూర్ఖాలు, మరాఠాలు, డోగ్రాలు, కుమాయోనీస్ మరియు ప్రభుత్వం పేర్కొన్న ఇతర కేటగిరీలకు చెందినవారికి | 163 | 155 | 80 | 85 |
డాక్యుమెంట్ వెరిఫికేషన్:
అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరికి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా సరైన అర్హతలు, ధ్రువపత్రాలు ఉన్నవారికి ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ - NOC) తీసుకోవాల్సి ఉంటుంది.