GDS Application Details Correction: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 1,215; తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు సంబంధించి మార్చి 3తో గడువు ముగిసింది. దీంతో అభ్యర్థులకు తమ వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
అభ్యర్థులు మార్చి 6 నుంచి 8 వరకు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు. పదో తరగతి మార్కులతో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు.
దరఖాస్తుల సవరణ కోసం క్లిక్ చేయండి..
ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
వివరాలు..
* గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు
➥ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
➥ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
➥ డాక్ సేవక్
మొత్తం పోస్టుల సంఖ్య: 21,413.
తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు: ఏపీ-1,215, తెలంగాణ-519.
పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-9735; ఓబీసీ-4164; ఎస్సీ-2867; ఎస్టీ-2086; ఈడబ్ల్యూఎస్-1952; పీడబ్ల్యూడీ(ఎ)-178; పీడబ్ల్యూడీ(బి)-195; పీడబ్ల్యూడీ(సి)-191; పీడబ్ల్యూడీ(డిఇ)-45.
సర్కిళ్లవారీగా ఖాళీలు..
ఆంధ్రప్రదేశ్: 1215 పోస్టులు
అస్సాం: 655 పోస్టులు
బిహార్: 783 పోస్టులు
ఛత్తీస్గఢ్: 638 పోస్టులు
ఢిల్లీ: 30 పోస్టులు
గుజరాత్: 1203 పోస్టులు
హర్యానా: 82 పోస్టులు
హిమాచల్ ప్రదేశ్: 331 పోస్టులు
జమ్మూకశ్మీర్: 255 పోస్టులు
జార్ఖండ్: 822 పోస్టులు
కర్ణాటక: 1135 పోస్టులు
కేరళ: 1385 పోస్టులు
మధ్యప్రదేశ్: 1314 పోస్టులు
మహారాష్ట్ర: 1,498 పోస్టులు
నార్త్-ఈస్ట్రర్న్: 1260 పోస్టులు
ఒడిశా: 1101 పోస్టులు
పంజాబ్: 400 పోస్టులు
తమిళనాడు: 2292 పోస్టులు
ఉత్తర్ ప్రదేశ్: 3004 పోస్టులు
ఉత్తరాఖండ్: 568 పోస్టులు
వెస్ట్ బెంగాల్: 923 పోస్టులు
తెలంగాణ: 519 పోస్టులు
ఎంపిక విధానం: అభ్యర్థుల పదోతరగతిలో సాధించిన మెరిట్లిస్ట్ మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.
జీతభత్యాలు: నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్బ్రాంచ్పోస్టు మాస్టర్/ డాక్ సేవక్ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.
ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు..
➥ మార్కుల సర్టిఫికేట్లు
➥ ఫొటో గుర్తింపు కార్డు
➥ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ PWD సర్టిఫికేట్ (దివ్యాంగులైతే)
➥ EWS సర్టిఫికేట్
➥ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్
➥ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం
➥ మెడికల్ సర్టిఫికేట్
➥ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2025.
✦ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 03.03.2025.
✦ దరఖాస్తుల సవరణ: 06.03.2025 - 08.03.2025.