ఢిల్లీలోని భారత ప్రభుత్వ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 163 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మార్చి 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీల ఎంపికలు చేపడతారు.


పోస్టుల వివరాలు...


* మొత్తం ఖాళీలు: 163 


పోస్టులు..


➥ సైంటిస్ట్-బి: 62 పోస్టులు


➥ అసిస్టెంట్ లా ఆఫీసర్: 06 పోస్టులు


➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 01 పోస్టు


➥ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్: 16 పోస్టులు


➥ టెక్నికల్ సూపర్‌వైజర్: 01 పోస్టు


➥ అసిస్టెంట్: 03 పోస్టులు


➥ అకౌంట్స్ అసిస్టెంట్: 02 పోస్టులు


➥ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: 15 పోస్టులు


➥ అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ): 16 పోస్టులు


➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 03 పోస్టులు


➥ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: 15 పోస్టులు


➥ లోయర్ అప్పర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ): 05 పోస్టులు


➥ ఫీల్డ్ అటెండెంట్: 08 పోస్టులు


➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 04 పోస్టులు   


అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ ఇంటర్/ డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయసు: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.


వయోపరిమితి: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.500 (ఒక గంట పరీక్షకు), రూ.1000 (2 గంటల పరీక్షకు).


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.18,000-రూ.1,77,500 ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023.


➥ దరఖాస్తు చివరి తేది: 31.03.2023.


Notification


Online Application


Website



Also Read:


హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...