అన్వేషించండి

ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా

ABP Network India@2047 Summit: అమెరికా, ఇరాన్ సంక్షోభం ముగిసినా చమురు ధరలు కొన్ని నెలలపాటు దిగిరాకపోవచ్చని, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, రూపాయికి నష్టం కలిగిస్తుందని మాంటెక్ సింగ్ అహ్లువాలియా అన్నారు.

India at 2047 Conclave Live: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లూవాలియా (Montek Singh Ahluwalia ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడే తగ్గుముఖం పట్టినా, చమురు ధరల పెరుగుదల మరికొన్ని నెలల పాటు ఇలాగే కొనసాగవచ్చని అహ్లూవాలియా హెచ్చరించారు. ఏబీపీ నెట్‌వర్క్ న్యూఢిల్లీలో నిర్వహించిన 'ఇండియా@2047 సదస్సు'లో పాల్గొన్న అహ్లూవాలియా కీలక అంశాలను షేర్ చేసుకున్నారు. భారత్‌పై ఈ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపనుందో వివరించారు. అటు ప్రభుత్వంతో పాటు, ఇటు వ్యాపార వర్గాలకు అనిశ్చితి అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. 

చమురు ధరలు ఇంకా పెరుగుతాయా.. 
అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం రావడానికి టైమ్ పడుతుందని అహ్లూవాలియా పేర్కొన్నారు. ‘అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చినా, పరిస్థితులు ఇంకో 6 నెలల సమయం పడుతుంది. ఈ ఏడాది చివరి వరకు చమురు ధరలు ఇదే స్థాయిలోనే ఉంటాయి. ఒకవేళ సంక్షోభం మరింత ముదిరితే, మన చేసేది ఏం ఉండదు. రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించలేం.  పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ మార్కెట్లు గమనిస్తున్నాయి. చమురు సరఫరా, రవాణా మార్గాలకు ఆటంకం కలుగుతుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ప్రపంచంలోనే అత్యధికంగా ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటై భారత్‌కు, ఇంధన ధరల్లో వచ్చే మార్పులు అత్యంత కీలకం కానున్నాయని’ తెలిపారు. 

ఆర్థిక నష్టాలను పెంచుతున్న ప్రపంచ అనిశ్చితి
పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం కేవలం చమురు మార్కెట్లకే పరిమితం కాలేదని, అంతకంటే ఎక్కువే ప్రభావం చూపుతుందని అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ప్రస్తావించారు. ‘అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ. అనిశ్చితి కూడా చాలా ఎక్కువ. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల రూపాయితో పోల్చితే సాధారణంగా డాలర్ బలపడుతుంది. దీనివల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కరెన్సీపై, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD - కరెంట్ ఖాతా లోటు) తగ్గితే.. రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు’ అన్నారు. 

Also Read: ABP India At 2047 Conclave: సవాళ్లను అధిగమించి మహాశక్తిగా ఎదిగేందుకు భారత్ అడుగులు- స్వయంసమృద్ధి, సుసంపన్నతే లక్ష్యం: ఏబీపీ నెట్‌వర్క్ సీఈఓ సుమంత దత్తా

దిగుమతులను నిషేధిస్తే నష్టమే 
విదేశీ మారక నిల్వలను వాడుకుంటూ కరెన్సీ పతనాన్ని ఎన్నాళ్లని అడ్డుకోగలమని ప్రశ్నించారు. రూపాయి విలువ క్షీణించకుండా మీరు ఎలా ఆపుతారు? మీ దగ్గరున్న నిల్వలన్నింటినీ విసిరేస్తారా? కానీ, భారీగా నిల్వలను వాడుకోవడాన్ని మాత్రం సమర్థించనని అహ్లూవాలియా స్పష్టం చేశారు. ముడిచమురు లాంటి వస్తువుల దిగుమతి ఖర్చులు పెరిగినప్పుడు, ఆ ప్రభావాన్ని తట్టుకోవడానికి స్థూల ఆర్థిక సర్దుబాట్లు అవసరమని తెలిపారు.

"స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రకారం మనం మొత్తం డిమాండ్‌ను తగ్గించుకోవాలి. అంతే తప్పా, దిగుమతులను పూర్తిగా నిషేధించడమో లేదా ఆపేయడమో చేస్తే అనుకున్నది మాత్రం జరగదు, పైగా అది మరింత నష్టదాయకం. రూపాయి విలువను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై పూర్తిగా ఆధారపడకుండా, దిగుమతి చేసుకునే వస్తువుల అసలు ఖర్చును వినియోగదారులు, వ్యాపారాలే భరించాలని’ సూచించారు.

Also Read: ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్

"ప్రస్తుత పరిస్థితుల్లో భారత రూపాయి విలువ తగ్గకుండా చూడటం చాలా అవసరం. మీరు ఏదైనా దిగుమతి చేసుకుంటున్నారంటే.. మీరు పేదవారు కానంత వరకు ఆ వస్తువు ధరను మీరే చెల్లించాలి. అందరికీ కాకుండా, కేవలం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీలు లేదా సహాయం అందించాలని’ అహ్లూవాలియా ఈ వ్యాఖ్యలు చేశారు.

Frequently Asked Questions

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చమురు ధరలను ఎంతకాలం ప్రభావితం చేస్తాయి?

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగినా, చమురు ధరల స్థిరత్వం రావడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. ఈ ఏడాది చివరి వరకు చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది.

ప్రపంచ ఆర్థిక అనిశ్చితి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

అమెరికాలో అధిక వడ్డీ రేట్లు, అనిశ్చితి కారణంగా డాలర్ బలపడి, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది కరెన్సీ, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతుంది.

భారత రూపాయి విలువ క్షీణించకుండా నివారించడానికి ఏమి చేయాలి?

కరెంట్ ఖాతా లోటును తగ్గించుకుంటే రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా, దిగుమతి చేసుకునే వస్తువుల అసలు ఖర్చును వినియోగదారులు, వ్యాపారాలు భరించాలి.

దిగుమతులను నిషేధించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

దిగుమతులను పూర్తిగా నిషేధించడం లేదా ఆపేయడం వల్ల అనుకున్న ప్రయోజనం నెరవేరదు, పైగా అది మరింత నష్టదాయకం. స్థూల ఆర్థిక సర్దుబాట్లు అవసరం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget