విశాల్ హీరోగా నటిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'సామాన్యుడు'. తు.ప.శరవణన్‌ దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమాలో డింపుల్‌ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 


ముందుగా ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ తమిళనాడులో ఆదివారం నాడు ఉన్న లాక్ డౌన్ అలానే ఇతర కారణాల వలన ఈ సినిమాను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 4న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మాలిక్ స్టీమ్స్ కోపరేషన్ సంస్థ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 


యోగి బాబు, బాబురాజ్‌ జాకబ్‌, పీఏ తులసి, రవీనా రవి తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. విశాల్‌ నటిస్తున్న 31వ సినిమా ఇది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ హైదరాబాద్ లోనే నిర్వహించారు.