సమంత నటించిన భారీ బడ్జెట్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమా రేపు (ఏప్రిల్ 14వ తేదీ) థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ‘శాకుంతలం’కి విజయ్ దేవరకొండ విషెస్ చెప్పారు.


‘సమంత, నీలో ఎంతో ప్రేమ దాగి ఉంది. సరైన పని చేయాలని, ఆనందాన్ని పంచాలని నువ్వు ఎప్పుడూ కోరుకుంటావు. సినిమాలో ప్రతి షాట్‌కి నువ్వు ఎంతో కష్టపడతావు. నీ కెరీర్ మొత్తం దాని మీదనే ఆధారపడి ఉన్నది అన్నట్లు కష్టపడతావు. గత సంవత్సర కాలంలో నువ్వు ఎంత పోరాడావో ప్రపంచానికి తెలియకపోవచ్చు. నీ శరీరానికి బ్రేక్, రెస్ట్ అవసరమైనప్పటికీ నీ టీమ్ కోసం, నీ సినిమా కోసం ముఖం మీద నవ్వు పులుముకుని ఉండటానికి ప్రయత్నించావు. శాకుంతలం సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నీ గుండె ధైర్యం, కోట్లాది ప్రజల ప్రేమ నిన్ను సురక్షితంగా ఉంచుతుంది.’ అని విజయ్ దేవరకొండ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


దానికి సమంత స్పందిస్తూ ‘ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నిజంగా నాకు ఇది అవసరం. థ్యాంక్యూ మై హీరో.’ అని రిప్లై ఇచ్చారు. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' రిలీజ్ డేట్ దగ్గరికొచ్చేసింది. సమంత ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న సమయానికి మరో 24గంటలే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో.. అంత కన్నా రెట్టింపు కష్టం సమంత పడింది. మెంటల్ గా ఎన్ని ఎమోషన్స్ అడ్డొచ్చినా.. ఫిజికల్ గా ఇటీవలే ఓ వ్యాధి నుంచి బయటపడి మళ్లీ ఫిట్ గా ఉండేందుకు సాయ శక్తులా కృషి చేసింది. అలసటను, విచారాన్ని ఎక్కడా కనిపించకుండా ఇప్పటికీ ఆ చిన్న స్మైల్ తోనే  అందర్నీ ఆకట్టుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసిందంటే మాటలు కాదు.


అంత గొప్ప గౌరవమూ అందరికీ దక్కదు. కొన్ని సినిమాలు చేసే అందరికీ అవకాశం రావు. కానీ సమంతకు ఆ ఛాన్స్ వచ్చింది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది కూడా. అందుకే ఆ గౌరవానికి ప్రతీకగా తాజాగా ఇన్స్ స్టా పోస్ట్ చేసింది.  దాంతో పాటు ఓ ఫొటోను షేర్ చేసిన సమంత... ప్రముఖ హీరోయిన్లు, వాళ్లు నటించిన పాత్రల పక్కన తన ఫొటోను పెట్టడంపై ఆనందం వ్యక్తం చేసింది. నిజంగా గౌరవంగా ఫీలవుతున్నానంటూ రాసుకొచ్చింది. 'శాకుంతలం' రేపట్నుంచి ఇక మీదే నంటూ ఓ ఎమోషనల్ కోట్ ను కూడా సమంత యాడ్ చేసింది.


ఇక సమంత నటించిన 'శాకుంతలం' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ రాజు.. దుష్యంత్ పాత్రను పోషిస్తుండగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ.. ప్రిన్స్ భరత్‌గా నటించింది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధు, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్ 14న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.