సంక్రాంతి బరిలో, బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) విశ్వరూపం చూపించారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. బాలకృష్ణ కెరీర్ చూస్తే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిగర్స్ చూపించింది.


'వీర సింహా రెడ్డి' @ 54 కోట్లు!
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'వీర సింహా రెడ్డి' సినిమా 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. షేర్ చూస్తే... 30 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 






ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్
బాలకృష్ణ కెరీర్ చూస్తే... 'వీర సింహా రెడ్డి'కి భారీ రిలీజ్ దక్కిందని చెప్పాలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 థియేటర్లలో విడుదలైంది. నైజాంలో 265, సీడెడ్ ఏరియాలో 200, ఏపీలో 410, ఓవర్సీస్ చూస్తే 500, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 100కు పైగా స్క్రీన్లలో సినిమా విడుదలైంది. 


అమెరికాలో షో ఆపేసిన థియేటర్ యాజమాన్యం
అమెరికాలోని డల్లాస్ సిటీలో ఒక థియేటర్ యాజమాన్యానికి మాత్రం బాలకృష్ణ అభిమానులు చేసిన సందడి నచ్చలేదు. సెక్యూరిటీ అధికారులు వచ్చి థియేటర్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అందుకు కారణం ఏంటో తెలుసా? ప్రేక్షకులు చూపించిన అభిమానమే. స్క్రీన్ మీద పేపర్లు విసురుతూ, గోల గోల చేసే సరికి షో మధ్యలో ఆపేశారు. 'అఖండ' సినిమా విడుదలైన సమయంలో కూడా అమెరికాలో థియేటర్‌లో సౌండ్ విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 'వీర సింహా రెడ్డి'కి ఇలా జరిగింది. 


Also Read : పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా? 


బాలకృష్ణ క్రేజ్ అమెరికాలో పెరిగిందని చెప్పడానికి 'వీర సింహా రెడ్డి' సినిమాకు వస్తున్న వసూళ్ళు కారణమని చెప్పాలి. ఆల్రెడీ అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్స్ వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ బట్టి కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. అక్కడ షోస్ తగ్గుతాయో? లేదంటే స్టడీగా ఉంటాయో?



Also Read : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ : మెగాభిమానులకు పూనకాలు గ్యారెంటీనా? మెగాస్టార్ మాస్ మూవీ ఎలా ఉందంటే? 



'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రమిది. 'అఖండ' విడుదల తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చిన సినిమా కూడా ఇదే. ఇందులో ఫైట్స్ బావున్నాయని, 'వీర సింహా రెడ్డి'గా బాలకృష్ణ యాక్టింగ్ అద్భుతమని రివ్యూ రైటర్లతో పాటు ప్రేక్షకులు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయిందని టాక్ వచ్చింది. 


శ్రుతీ హాసన్ కథానాయికగా... హానీ రోజ్ మరో నాయికగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలో, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.