బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం సినిమాలే కాకుండా ఐటెమ్ సాంగ్స్ లు కూడా చేసి తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఊర్వశి. అయితే ఊర్వశి తన అందంతోనే కాకుండా కాంట్రవర్సీ లతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఆమె గురించి నిత్యం ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆమె రూ. 190 కోట్ల విలువైన విలాశవంతమైన బంగ్లాను కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ లో బడా స్టార్ లు ఉండే ఏరియాలోనే పెద్ద బంగ్లాను కొనుగోలు చేసినట్టు ఆ వార్తల సారాంశం. అయితే తాజాగా ఊర్వశి తల్లి మీరా రౌతేలా స్పందించారు. 


ఆ వార్తలు అబద్దం: మీరా రౌతేలా


ఊర్వశి రౌతేలా రూ.190 కోట్లతో విలాశవంతమైన బంగ్లాను కొనుగోలు చేసిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని మీరా రౌతేలా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఊర్వశి రౌతేలా కొత్త బంగ్లాను కొనుగోలు చేసింది అని వచ్చిన వార్తకు సంబంధించిన ఓ స్కీన్ షాట్ పై ఫేక్ అని రాసి దాన్ని పోస్ట్ చేశారు. అంతే కాదు దానికి ఓ నోట్ ను కూడా రాసుకొచ్చారు. ‘‘దేవుడా.. త్వరలోనే అలాంటి రోజు రావాలి. ఈ వార్త రాసిన అన్ని ఛానల్స్ ప్రార్థనలు నిజం అవుతాయి’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఊర్వశి రౌతేలా విలాశవంతమైన బంగ్లాను కొనుగోలు చేసింది అని వచ్చే వార్తలకు చెక్ పడినట్లు అయింది. 


వరుస ఐటెమ్ సాంగ్స్ తో దుమ్ములేపుతోన్న ఊర్వశీ


ఊర్వశి రౌతేలా అటు సినిమాలే కాకుండా ఇటు ఐటెమ్ సాంగ్స్ తోనూ దుమ్మురేపుతోంది. ఆ భాష ఈ భాష అని లేకుండా తన గ్లామర్ షో తో కుర్రకారును ఊపేస్తోంది. ప్రస్తుతం అమ్మడు ఫోకస్ అంతా ఐటెమ్స్ సాంగ్స్ పైనే ఉంది. ముఖ్యంగా సౌత్ లో ఎక్కువగా ఐటెమ్ సాంగ్స్ కు ఓకే చెబుతోంది.  గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ సాంగ్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత రామ్-బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఓ ఐటెమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవే కాకుండా సౌత్ మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 


సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్..


ఊర్వశి రౌతేలాకు సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అటు సినిమాలు చేస్తూనే ఇటు సోషల్ మీడియాలో తన అందంతోనే కాకుండా అప్పుడప్పుడూ కాంట్రవర్సీ పోస్ట్ లతో నెటిజన్స్ దృష్టిని ఆకట్టుకుంటుంది. అందుకే ఆమెను సోషల్ మీడియాలో లక్షలాది మంది అనుసరిస్తారు. ఒక్కోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకి కూడా ఎక్కిన విషయం కూడా తెలిసిందే.