Krishnamma kalipindi iddarini July 7th: ఈశ్వర్ ఫోన్ కలవక పోయేసరికి భవాని గౌరీని ఈశ్వర్ దగ్గరికి వెళ్ళమని పంపిస్తుంది. దాంతో గౌరీ ఈశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా.. ఈశ్వర్ ను డబ్బులు ఎలా అడగాలి.. ఏమని చెప్పాలి అంటూ టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది. ఇక వెళ్ళగానే ఈశ్వర్ చెల్లెలు గౌరీ వదిన వచ్చింది అంటూ తెగ సంబర పడిపోతుంది.


మెహేంది ఫంక్షన్ కు ఏర్పాటు చేస్తున్నారు అని చెబుతోంది. అని గౌరీ ఈశ్వర్ గురించి చూస్తూ ఉండటంతో వెంటనే తను అన్నయ్య గురించి చూస్తున్నావా అని అంటుంది. అప్పుడే అక్కడికి సునంద వచ్చి అమ్మ వాళ్ళు రాలేదా అనటంతో.. వాళ్లు కాసేపయ్యాక వస్తారు అని చెబుతుంది. కానీ ఈశ్వర్ గురించే చూస్తూ ఉంటుంది. ఇక వదిన అన్నయ్య కోసం చూస్తుంది అని అనటంతో అలా అనకూడదు అని సునంద అంటుంది.


 గౌరీ తన మనసులో అక్కడ తన చెల్లి వాళ్ళు టెన్షన్ పడుతున్నారేమో అని బాధపడుతూ ఉంటుంది. సునంద ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. జలజ గౌరీ కోసం జ్యూస్ తీసుకురావడానికి వెళ్తుంది. మరో వైపు పోలీస్ స్టేషన్లో తల్లి కూతుర్లు టెన్షన్ పడుతూ ఉంటారు. మీడియా ముందు పడితే తన పరువు పోతుంది.. పెళ్లి కాదు అని బాధపడుతూ ఉంటుంది.


ఇక తన ఫోన్ పోయినందుకు అప్పుడే ఈశ్వర్ కూడా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఈశ్వర్ ని చూసి ఇద్దరు భయపడతారు. ఈయన ఇక్కడ ఎందుకు వచ్చాడు అని అనుకుంటాడు. ఇక సైలెంట్ గా ఉండి ఈశ్వర్ పోలీస్ తో ఏం మాట్లాడుతున్నారో వినడానికి పక్కకు వెళ్తారు. ఇక ఈశ్వర్ తన ఫోన్ పోయిందని అందులో ఉన్న డేటా తనకు చాలా ఇంపార్టెంట్ అని అనడంతో మీరేం టెన్షన్ పడకండి మీ ఫోన్ మీ దగ్గరికి వస్తుంది మీ ఇంటికి మేము పంపిస్తాము అని అంటాడు ఇన్స్పెక్టర్.


దాంతో ఈశ్వర్ పర్లేదు ఫోన్ వచ్చేవరకు ఇక్కడే ఎదురు చూస్తాను అని అంటారు. దాంతో అఖిల వాళ్లు భయపడతారు. మీడియా వస్తే ఈశ్వర్ ముందు దొరికిపోతాము అని అనుకుంటారు. అక్కడ గౌరీ ఈశ్వర్ కోసం వెళ్తే ఈశ్వర్ ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటారు. మరోవైపు గౌరీ ఈశ్వర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జలజ జ్యూస్ తీసుకొని రాగా అది తాగకుండా పక్కకు పెట్టేస్తుంది.


ఒకసారి సునందతో మాట్లాడాలి అని సునంద దగ్గరికి వెళ్తుంది. సునంద తన భర్తతో గౌరీ వాళ్ళు వచ్చేశారు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేయించారా అని హడావుడిగా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గౌరీ అక్కడికి రావటంతో ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తాడు. గౌరీ ఒకసారి ఈశ్వర్ గారికి ఫోన్ చేయండి అని అంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి బిజీగా ఉన్నాడేమో అని అంటుంది సునంద.


దాంతో గౌరీ ఈశ్వరి విషయంలో టెన్షన్ పడుతున్నట్లు గమనిస్తుంది. ఇక నేను నీ తల్లి లాంటిదాన్ని నీకేం జరిగినా నాకు చెప్పాలి ఏదైనా సమస్య ఉన్న చెప్పాలి అని ప్రేమగా సునంద అడగటంతో.. గౌరీ కాస్త ఇబ్బంది పడుతూ తనకు పాతిక లక్షలు కావాలి అని మళ్లీ తల తాకట్టు పెట్టి అయినా ఇస్తాను అని అంటుంది. దాంతో సునంద మరో మాట అడగకుండా డబ్బులు మళ్లీ ఇవ్వకున్నా పర్వాలేదు అనటంతో తన కాళ్ళను దండం పెట్టుకుంటూ థాంక్స్ చెప్పుకుంటుంది.


ఆ తర్వాత గౌరీ డబ్బులు తీసుకొని అక్కడినుంచి వెళ్తుంది. మరో వైపు పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ ఫోన్ దొరకటంతో వెంటనే ఈశ్వర్ గౌరీ ఫోన్ కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ భవాని దగ్గర ఉండటంతో వెంటనే కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇక గౌరీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అక్కడి నుంచి వెళ్తాడు ఈశ్వర్. ఇక ఇన్స్పెక్టర్ భవాని వాళ్ళ దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు వచ్చారు ఇంకా మీ కూతురు రాలేదు.. మీ పేరు మీడియా వాళ్లకు చెప్పేస్తాను అని అంటాడు. ఇక గౌరీ డబ్బులు తీసుకొని అదే సమయానికి పోలీస్ స్టేషన్ కి రావటంతో అఖిల వాళ్లు ఊపిరి పీల్చుకుంటారు.


Also Read: Trinayani July 7th: ‘త్రినయని’ సీరియల్: మరింత వయసు తగ్గించుకున్న తిలోత్తమా, సంతకంతో షాక్ ఇచ్చిన గాయత్రి పాప?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial