Rashmi Gautam Boy friend: బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లకు ప్రేక్షకుల్లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వారిలో ఒకరు రష్మీ. అయితే ఒకప్పుడు సుధీర్, రష్మీల ప్రేమకథ బుల్లితెరపై ఎంతో ఫేమస్. కానీ ఇప్పుడు ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా వీరిద్దరూ ప్రేమికులుగా, భార్యభర్తలుగా కూడా పలు షోలలో పాల్గొన్నారు. తాజాగా రష్మీ పెళ్లి అంటూ ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసింది ఈటీవీ. దానికి ఎంతోమంది బుల్లితెర సెలబ్రిటీలను కూడా పిలిచింది. ఇక ‘రష్మీ పెళ్లి పార్టీ’ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇక ఇందులో రష్మీ.. తన రియల్ లైఫ్ బాయ్‌ఫ్రెండ్‌ను అందరికీ పరిచయం చేసినట్టు చూపించారు.


‘యానిమల్’ వర్సెస్ ‘అర్జున్ రెడ్డి’..
ముందుగా చమ్మక్ చంద్ర, శ్రీ సత్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ‘రష్మీ పెళ్లి పార్టీ’ ప్రోగ్రామ్ ప్రోమో ప్రారంభమయ్యింది. ‘శుభలేఖ రాసుకున్న’ పాటకు ఇద్దరూ స్టెప్పులేశారు. దానికి బాబా భాస్కర్ మాస్టర్ ఫన్నీగా కామెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత తాగుబోతు రమేశ్ వచ్చి మరో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో డ్యాన్స్‌తో పాటు కామెడీని కూడా మిక్స్ చేసి అందరినీ నవ్వించారు. సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసిన రెండు సినిమాలు - ‘యానిమల్’, ‘అర్జున్ రెడ్డి’‌లకు స్ఫూఫ్ స్కిట్లు చేయడానికి కామెడియన్స్ ముందుకొచ్చారు. కంటెస్టెంట్స్ అంతా ఈ స్కిట్‌కు పడీపడీ నవ్వుకున్నారు. ‘‘ఒక మెయిన్ ఈవెంట్‌లో ఇలా నవ్వుకొని నాకు తెలిసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది’’ అంటూ హైపర్ ఆది.. వారిని ప్రశంసించారు.


టీవీ రేటింగ్స్ కోసం ఏవేవో చేశావు..
ఆ తర్వాత పండు కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఒక రొమాంటిక్ సాంగ్‌పై ముగ్గురు భామలతో స్టెప్పులేశాడు. వర్షం ఎఫెక్ట్‌తో పండు ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చిన అదిరిపోతుందంటూ ఈ ప్రోమోకు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ పర్ఫార్మెన్స్ చూసిన ఆది.. ‘‘మా అందరికీ జస్ట్ న్యూ ఇయర్. పండుగాడికి ఒక్కడికే ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్’’ అని కామెంట్ చేశాడు. ఆ తర్వాత రష్మీని తన పెళ్లి గురించి ప్రశ్నించాడు. ‘‘ఇన్నిరోజులు నువ్వు టీవీ రేటింగ్స్ కోసం ఏవేవో చేశావు. అవన్నీ ఓకే. నిజంగా నువ్వు ఎవరిని చేసుకుంటున్నావో అతన్ని మేమూ చూడాలనుకుంటున్నాము’’ అని అడిగాడు.


ఎవరు ఆ వ్యక్తి..?
హైపర్ ఆది అడిగిన ప్రశ్నకు రష్మీ మొదటిగా సిగ్గుపడింది. ‘‘ఒక అమ్మాయికి కొన్ని ఊహలు ఉంటాయి. వాడొచ్చి ఇలా ఉండాలి, అలా ఉండాలి. పొడుగ్గా ఉండాలి’’ అని తను చెప్తుండగానే.. ప్రోమోలోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతడెవరో ఇంతకు ముందే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం ఉన్నట్టుగా అనిపించలేదు. ఇంతకు ముందు ఈవెంట్లలో కూడా తానెప్పుడూ పాల్గొనలేదు. తను ఎంటర్ అవ్వగానే ముందుగా ఆదితో పాటు మిగతావారికి తనను పరిచయం చేసింది రష్మీ. కానీ తను ఎవరు అనే విషయం మాత్రం ఈ ప్రోమోలో చూపించలేదు. ఇది కూడా టీఆర్‌పీ కోసం ప్లాన్ ఏమో అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.



Also Read: రష్మిక, విజయ్ పెళ్లి తర్వాత విడిపోతారు, వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు