Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఫోటో చూపించి ఇతనేనా మీ భర్త అని అడుగుతాడు ఆర్య.


అను: కాదు అని చెప్పడంతో ఆర్య షాక్ అవుతాడు.


సుగుణ: అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేను మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని చూస్తుంటే రాధేమో దీక్షలు చేస్తుంది నువ్వేమో తన భర్తని వెతికే పనిలో పడ్డావు నాకు ఇచ్చిన మాటకి విలువ లేదా అని కోప్పడుతుంది.


ఆర్య: నీ మాటని నేను కాదనలేదమ్మా కానీ తన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా అంటాడు.


సుగుణ: ఈ మాటలు విని విని అలసిపోయాను ఇకమీదట వినే ఓపిక లేదు. ఇద్దరికీ పెళ్లి జరిగితే మీ భయాలు అన్ని పెళ్లి పీటలు ఎక్కేవరకే ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది అని చెప్పి రాధని తీసుకుని వెళ్ళిపోతుంది.


అప్పుడు సూర్య దగ్గరికి జెండే వస్తాడు. కెనడీ గీసిన చిత్రాలు ఇప్పటివరకు తప్పు అవలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అంటాడు.


ఆర్య: నాక్కూడా  అదే అనిపిస్తుంది ఒకసారి కెనడి దగ్గరికి వెళ్లి అసలు విషయం కనుక్కో అని చెప్పి పంపిస్తాడు.


మరోవైపు అను దీక్ష పూర్తి చేసినందుకు కోపంతో రగలిపోతూ ఉంటుంది మాన్సీ.


ఛాయాదేవి: అదృష్టం తనవైపు ఉంది అందుకే దీక్ష పూర్తి చేయగలిగింది ఆఫీసులో అతనికి ఫోన్ చేసి నువ్వు చెప్పిన పని ఎంతవరకు వచ్చిందో అడుగు అని మాన్సీ కి చెప్తుంది.


జలంధర్: అప్పుడే అక్కడికి వచ్చిన జలంధర్ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఆర్య ని ఫాలో అయిన నా మనిషి చెప్పాడు. ఎలాంటి పరిస్థితులలోనూ ఈ పెళ్లి ఆగకూడదు అని ఆ సుగుణమ్మ స్ట్రాంగ్  వార్నింగ్ ఇచ్చిందంట ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి కావాలంటే నీ పోస్ట్ మెన్ ఫోన్ చేసి కనుక్కో అంటాడు.


మాన్సీ: హరీష్ కి ఫోన్ చేసి మీ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయా అని అడుగుతుంది.


హరీష్: జరుగుతున్నాయి మేడం ఆగితే మా పెళ్ళి అయినా ఆగలేమో కానీ వాళ్ళ పెళ్లి ఆగేటట్లుగా లేదు అంటాడు.


మాన్సీ:  కోపంతో వాడి మీద అరిచి ఫోన్ పెట్టేస్తుంది.


హరీష్: వీళ్ళు బీపీలు తెచ్చుకొని కేకలు వేయడం తప్పితే ఏమీ చేయలేరు వీళ్ళని నమ్ముకుని నేను బక్రా అయిపోయాను అనుకుంటాడు.


ఆ తర్వాత పెళ్లి పనుల హడావిడి జరుగుతూ ఉంటుంది అప్పుడే పద్దు, సుగుణ వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది.


పద్దు: పిల్లలు ఏదో సర్ప్రైజ్ అన్నారు. సుబ్బు చూస్తే రాలేదు ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు అని ఇల్లు వెతుక్కుంటూ ఉంటుంది. దారిలో ఒక వ్యక్తిని అడిగి సుగుణ ఇల్లు కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది.


పిల్లలు పరుగు పరుగున పద్దు దగ్గరికి వచ్చి  మా అమ్మకి పెళ్లి అని చెప్తారు. ఆశ్చర్య పోతుంది పద్దు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉష తో  పిల్లలు చెప్తుంది నిజమేనా అని అడుగుతుంది.


ఉష: అవునండి పెళ్ళికొడుకు మా అన్నయ్య అంటూ రండి వాళ్ళని ఆశీర్వదించుదురుగాని అని ఆర్య వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తుంది.


అక్కడ ఆర్య ని చూసి ఆశ్చర్య పోతుంది పద్దు. ఆర్య కూడా పద్దుని చూసి షాక్ అవుతాడు.


పద్దు: ఆర్య సార్ ఏమిటి ఇక్కడ ఉన్నారు  అసలు ఏం జరుగుతుందో సార్ ని నిలదీయాలి అనుకుంటుంది. పిల్లలు ఆమె దగ్గరికి వచ్చి మా అమ్మకి,ఫ్రెండ్ కి పెళ్ళి జరుగుతుంది ఇకమీదట మిమ్మల్ని ఎవరు ఏడిపించరు అంటుంది.


అప్పుడు ఆర్య యాదగిరి ని పిలిచి చెవిలో ఏదో చెప్తాడు. అప్పుడు యాదగిరి సుగుణని పక్కకు తీసుకెళ్లి ఆర్య అక్కడ ఎందుకు ఉన్నాడో, ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాడో  చెప్తాడు.


పద్దు: ఆర్య సార్ మంచితనం గురించి నాకు బాగా తెలుసు బాబు కానీ నా కూతురు గురించే ఆలోచిస్తున్నాను అంటుంది.


యాదగిరి: మీరేమీ ఆలోచించకండి ఈ పెళ్లి జరిగితే అంతా మంచే జరుగుతుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తారు అని చెప్పి పద్దు ని ఆర్య వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ సుగుణ పెళ్లి కొడుకులకి పెళ్లికూతుర్లకి పసుపు రాస్తూ ఉంటుంది. అక్కడితో  ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read: తమ్ముడి రెండో పెళ్లిపై సల్మాన్‌ఖాన్‌ సెటైర్లు - అందరి ముందు పరువు తీసేశాడుగా!