Prema Entha Madhuram  Serial Today Episode:  అజయ్‌ని చూసి నువ్వు వసుంధరాదేవి కొడుకువి కాదు శారదాదేవి మొదటి కొడుకువి.. శారదాదేవి సూర్యవర్ధన్‌ రెండవ భార్య. ఆయనకు మొదటి భార్యకు పుట్టిన కొడుకు ఆర్యవర్ధన్‌, రెండో భార్య అయిన శారదాదేవికి పుట్టిన మొదటి కొడుకువి నువ్వే అని లక్ష్మీ నిజం చెప్పడంతో అజయ్ షాక్ అవుతాడు. అయితే ఆర్యవర్ధన్‌ స్థానంలో నేను ఉండాల్సింది అని బాధపడతాడు. దీంతో నీకు అంత అన్యాయం జరుగుతుంటే శారద ఎందుకు ఊరుకుందో నాకు అర్థం కావడం లేదు. దాని అతి మంచితనమే దానికి శత్రువు. అజయ్‌ నువ్వున్నా నీ హక్కును దక్కించుకో అంటుంది లక్ష్మీ.


జలంధర్‌: దక్కించుకుంటాడండి అజయ్‌ మేడం చెప్పింది అర్థం అయ్యింది కదా వర్ధన్‌ కుటుంబంలో నీ స్థానం ఏంటో తెలిసింది కదా? నీకు దక్కాల్సిన ప్రేమ గౌరవం అధికారం అన్నీ దక్కించుకోవాలి.


అజయ్‌: దక్కించుకుంటా? నా గతాన్ని ప్రశ్నిచిన అందరికీ నేను సమాధానం చెబుతా.. అన్నింటికంటే మించి మా అమ్మ ప్రేమని నేనే దక్కించుకోవాలి. మీరు నాకు చేసిన ఈ హెల్ప్‌ కు ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను.


 అనగానే ఇందులో నేను చేసిందేమీ లేదని నిజం ఎప్పటికైనా ఎవరిద్వారానైనా తెలియాల్సిందే కదా అది ఇవాళ నా ద్వారా తెలిసింది అటుంది లక్ష్మీ. ఇంతలో జలంధర్‌ శారదాదేవిని కూడా ఇక్కడికే తీసుకొస్తాను అని వెళ్ళి శారదాదేవిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుంటాడు. సెక్యూరిటీ వచ్చి పెద్ద మేడం ను  ఎవరో కిడ్నాప్‌ చేశారని చెప్పడంతో అను ఆ కారు వెనకాల పరుగెడుతుంది. ఇంతలో ఆర్య వచ్చి అనును ఏమైందని అడుగుతే అత్తమ్మను జలంధర్‌ కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్నాడని చెప్పడంతో అను, ఆర్య కారును ఫాలో అవుతారు. శాదరాదేవిని గుడిలోకి తీసుకెళ్లిన జలంధర్‌, లక్ష్మీని చూపిస్తాడు. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటారు.


శారదాదేవి: లక్ష్మీ ఎన్ని ఏళ్లయిందే నిన్ను చూసి .. ఎలా ఉన్నావు లక్ష్మీ..


లక్ష్మీ: నేను చాలా బాగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు.


శారద: నేను బాగున్నాను. కానీ నువ్వు ఇండియా ఎప్పుడొచ్చావు.


లక్ష్మీ: రెండు వారాలైంది వచ్చాకా నిన్ను కాంటాక్ట్‌ చేయాలని ట్రై చేశాను. మేడం గారి నెంబర్‌ దొరికితే కదా  లక్కీగా వశిష్ట గారు కలిశారు. తన దగ్గరే నీ నెంబర్‌ తీసుకున్నాను. నిన్ను సర్‌ప్రైజ్‌గా కలవాలనుకునాను. అంతకంటే ముందు నీ కన్నకొడుకును కలిశాను.


శారద: అంటే నువ్వు ఆర్యని కలిశావా?


లక్ష్మీ: నేను నీ కన్నకొడుకు అజయ్‌ వర్ధన్‌ గురించి మాట్లాడుతున్నాను.


  అనగానే శారదాదేవి షాక్‌ అవుతుంది. నేనే తన కన్నతల్లిని అన్న విషయం చెప్పేశావా అని అడుగుతే చెప్పానని ఇది ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అనడంతో లేదు లక్ష్మీ ఇది ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాను. అనడంతో పక్క నుంచి అజయ్‌ ఎందుకు తెలియకూడదు అమ్మా అని అడుగుతాడు. ఇంతలో ఆర్య, అను గుడిలోకి వస్తారు. అజయ్‌, శారదా, లక్ష్మీ మాట్లాడుకోవడం వింటారు. నీ కన్న బిడ్డకంటే పెంచిన బిడ్డే నీకు ఎక్కువయ్యాడా అని అజయ్‌ ప్రశ్నించడంతో శారదాదేవి ఏడుస్తూ ఉంటుంది. ఆర్య,అను షాక్‌ అవుతారు.


లక్ష్మీ: పిల్లలు లేరని చెప్పి భూపతి వర్థన్‌ గారికి అజయ్‌ని దత్తత ఇచ్చినంత మాత్రాన తనకి నీకు పేగు బంధం లేకుండా పోతుందా శారదా.  అసలు నువ్వు అజయ్‌ గురించి పట్టించుకోకుండా ఇన్ని రోజులు ఎలా  ఉండిపోయావు.


అజయ్‌: ఎందుకమ్మ ఇలా చేశావు. నేను పుట్టగానే నీ పొత్తిల్ల నుంచే దూరం చేశావు. పెంచిన అమ్మానాన్నలను పొగొట్టుకుని నేను ఒంటిరవాణ్ని అయినప్పుడన్నా నన్ను తిరిగి దగ్గరకు తీసుకోవాలని నీకు అనిపించలేదా?


అంటూ అజయ్‌ ఏడుస్తూ ప్రశ్నిస్తుంటే... శారదాదేవి ఏడుస్తుంది. దూరం నుంచి చూస్తున్న ఆర్య, అను కూడా ఏడుస్తుంటారు.


శారదాదేవి: నిన్ను దూరం చేసుకోవడం నా తప్పే.. ఏ తల్లైనా కన్నబిడ్డని గొప్ప గుణాలతో  విజేతగా చూడాలనుకుంటుంది. నేను కూడా నిన్ను అలాగే చూడాలనుకున్నాను. కానీ నువ్వు ఆ భూపతి పెంపకంలో అతని లాగే ఆస్థి అధికారం అనే వ్యామోహంతో పెరిగావు. కానీ నువ్వు ఆప్యాయత కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే.. ఈ అమ్మ ఈ చేతులతో నిన్ను ప్రేమగా చేరదీసేది.


అంటూ నువ్వు ఆస్థికోసం ఆర్య మీద కుట్రలు చేశావు అందుకే నేను నిన్ను ఎలా దగ్గరకు తీసుకోగలను అనడంతో అజయ్‌ కూడా ఏడుస్తూ నువ్వే అన్నావు కదా నా పెంపకం సరిగ్గా లేదని మరి దారి తప్పిన కొడుకుని ఇప్పటికైనా క్షమించు అమ్మా అనగానే శారదాదేవి, అజయ్‌ని దగ్గరకు తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read:  'దిల్' రాజు సేఫ్ - ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ బ్యాలన్స్ అంతే!