Podharillu Serial Today Episode: తల్లిదండ్రుల వద్ద తీవ్ర అవమానానికి గురైన మహాలక్ష్మీ...ఏడుస్తూ తిరిగి చక్రి వాళ్ల ఇంటికి వస్తుంది. మాధవ్‌ సహా మిగిలిన వాళ్లంతా  ఏం జరిగిందని మహాను అడుగుతారు. తనను మోసం చేసి ఇంటికి రప్పించారని ఆమె ఏడుస్తూ చెబుతుంది. తనను తిరిగి మళ్లీ పంపిచడానికి కాకుండా అక్కడే ఉండిపోయేలా వాళ్లంతా కలిసి ప్లాన్ చేశారని అంటుంది. ఇన్నాళ్లు  వాళ్లకు ఎలాంటి అవకాశం దొరకలేదని...ఇప్పుడు  తనంతట తానే సర్టిఫికేట్లు అడగడంతో  దీన్ని ఆసరాగా చేసుకుని నన్నుశాశ్వతంగా అక్కడే ఉంచాలని చూశారని చెబుతుంది. మళ్లీ ఆ భూషణ్‌కు ఇచ్చి పెళ్లే చేసేందుకు కుట్రపన్నారని అంటుంది.

ఆ మాటలు విన్న అందరికీ చాలా కోపం వస్తుంది. మీవాళ్లు మరీ ఇంత దిగజారి ప్రవర్తిస్తారని అనుకోలేదని చక్రి అంటాడు. నేను ససేమీరా అనండంతో ఇంట్లో పెట్టి బంధించేందుకు కూడా ప్రయత్నించారని చెప్పడంతో కేశవ్‌కు కోపం వస్తుంది. అసలు మనకు బుద్ధిలేదని...ఇంతమంది ఉండి కూడా కన్నాగాడిని పంపించామని అంటాడు.అదే మనం వెళ్లి ఉంటే వేరేలా ఉండేదని అనడంతో మాధవ్‌ వాడిని వారిస్తాడు. నేను కూడా ఏం ఊరుకోలేదనివాళ్లకు  గట్టిగానే ఎదురించానని చెబుతుంది. నేను అక్కడ ఉండటానికి ఒప్పుకోలేదని వాళ్లు  నా సర్టిఫికేట్లన్నీ కాల్చిపడేశారని చెప్పడంతో  చక్రి ఇంట్లో వాళ్లంతా  షాక్‌కు గరువుతారు. పగలు, రాత్రి కష్టపడి చదివిన చదువుంతా  బూడిద చేశారా అని అంటారు.

మరి మీ అమ్మగారు ఊరుకోలేదా అంటే ఆవిడే కూడా వాళ్లకే సపోర్ట్‌ చేసిందని చెబుతుంది. మా వదని అడ్డుకోవాలని ప్రయత్నించినా....మా అమ్మ ఆవిడను పట్టుకుందని చెబుతుంది. ఇక నేను కూడా వాళ్లకు అదే రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చి వచ్చానని చెబుతుంది. ఇకపై వాళ్లతో నా బంధం తెగిపోయినట్లేనని అంటుంది. నేను సర్టిఫికేట్లు  లేకున్నా మంచి స్థాయిలో ఉండి నిరూపించుకుంటానని శపథం చేసి వచ్చానని చెబుతుంది. దీంతో మాధవ్‌ ఆమెను ఓదార్చి వెళ్లిపోతాడు. తన గదిలో కూర్చుని బాధపడుతున్న మహాను చక్రి వచ్చి పలకరిస్తాడు. సర్టిఫికేట్లు పోయినందుకు ఏం బాధపడొద్దని...కావాలంటే మనం డూప్లికేట్లు  తీసుకోవచ్చని రెండు నెలల్లోఅన్ని సర్టిఫికేట్లు వస్తాయని చెప్పి వెళ్లిపోతాడు. బాధగా కూర్చున్న  మహా వద్దకు గాయత్రి వచ్చి కొంచెం ఆటపట్టించి నవ్విస్తుంది.                   ఉదయం యథాతథంగా  అందరూ బారెడు పొద్దెక్కినా కూడా నిద్రలేవకపోవడంతో మహాకు కోపం వచ్చి అందరినీ నిద్రలేపుతుంది. రేపటి నుంచి మళ్లీ మళ్లీ చెప్పనని 7 గంటల కల్లా అందరూ నిద్రలేచి రెడీ అవ్వాలని చెప్పి హెచ్చరిస్తుంది. ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గులు వేసి వస్తుంది. ఈరోజు నా చేతులతోనే మీకు టీ ఇస్తానని చెప్పడంతో అందరూ మరోసారి భయపడిపోతారు. మేం తాగమంటే తాగమని గోల చేస్తారు. దీంతో మాధవ్‌ వారందిరనీ వారించి  మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మీ  ప్రేమగా టీ పెడతానంటే వద్దంటారా అంటూ మండిపడతాడు.

తనను తీసుకుని వంటగదిలోకి వెళ్లి టీ ఎలా పెట్టాలో నేర్పించి వాళ్లందరికీ టీ పెట్టించి ఇచ్చేలా చేస్తాడు. ఈలోగా  బయట ఆదినారాయణ బీడీలు తాగి ఆబీడీ ముక్క ముగ్గపై వేస్తాడు. కోడలు చూస్తుందేమోనని కాలుతో పక్కకు జరిపే ప్రయత్నం చేయగా....ముగ్గు మొత్తం  చెరిగిపోతుంది. దీంతో భయపడిపోయిన ఆదినారాయమ....శుభ్రం ఊడ్చి మళ్లీ ముగ్గువేస్తుండగా  కన్నా చూసి అందిరనీ పిలిచి చూపిస్తాడు. నారాయణ తనకు ముగ్గువేయడం రాకపోవడంతో లారీ బొమ్మ వేయగా....మహాలక్ష్మీ ఎంతో ఆనందంతో నవ్వుతుంది. ఇన్నిరోజులకు మా నాన్న వల్ల అయినా ఈ మహాలక్ష్మీ నవ్విందని చక్రి కూడా ఆనందపడిపోతాడు.                          

మహా చక్రిని తనకు ఉద్యోగం చూసిపెట్టాలని...ఇంట్లోఒంటరిగా ఉండలేకపోతున్నానని చెప్పడంతో ...చక్రి వాళ్ల ఆవిడకు ఉద్యోగం చూసిపెట్టడానికి బయలుదేరతాడు. తనకు తెలిసిన ఓ ప్రెండ్‌ను కోరతాడు.ఇప్పుడు ఎలాంటి ఉద్యోగాలు  లేవని చెప్పినా వినకుండా కాళ్లావేళ్లాపడతాడు. అప్పటికి ఒప్పుకోకపోయేసరికి  అతడిని బ్లాక్‌మెయిల్‌ చేసి  కనీసం ఇంటర్వూ ఏర్పాట్లు అయినా చేయమని చెప్పి ఒప్పిస్తాడు.