Podharillu Serial Today Episode: మహాలక్ష్మీ సర్టిఫికేట్ల కోసం ఆమెను తీసుకుని చక్రి యూనివర్సిటీకి వెళ్తాడు.అక్కడ అమ్మాయిలు చక్రిని చూస్తుండటం చూసి మహా కొంచెం జల్సీగా ఫీలవుతుంది. అమ్మాయిలంతా ఎందుకు అలా చూస్తున్నారని  నిలదీస్తుంది. వాళ్లు చూస్తే నేనేం చేయాలండీ అని చక్రి అంటాడు.ఇలా రౌడీలా చొక్కా గుండీలు విప్పుకుని తిరిగితే అలా చూస్తారని క్లాస్‌ పీకుతుంది. యూనివర్సిటీకి వచ్చేప్పుడు కాస్త డీసెంట్‌గా రావాలని తెలియదా అని  అడుగుతుంది. లోపలికి వెళ్లి ప్రొఫెసర్‌ను కలవగా...ఆమె చక్రితో మాట్లాడి ఈవిడానే నువ్వు ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య అని అడుగుతుంది.ఆ మాటలకు మహా కొంచెం ఇబ్బందిపడుతుంది.

Continues below advertisement

ఆవిడ అప్లికేషన్‌ తీసుకురావడానికి వెళ్లగానే చక్రిపై మండిపడుతుంది.నేను నిన్న ప్రేమించానా అని అడుగుతుంది. లేదని చెప్పగా మరి ఆవిడకు ఎందుకు అలా చెప్పావని నిలదీస్తుంది.మన పెళ్లి ఎలా జరిగిందని అడిగితే మొత్తం చెప్పానని  నిజం చెబితే కొంచెం మనకు హెల్ఫ్‌ చేస్తుందని అలా చేశానని అంటుంది. ఇంతలో ఆవిడ వచ్చి మహాకు అప్లికేషన్ ఇచ్చి పూర్తిచేయమని చెబుతుంది.మహా పక్కకు వెళ్లి అప్లికేషన్ నింపుతుండగా....ఆవిడ చక్రితో నవ్వుతూ మాట్లాడటం చూసి మరింత మండిపడుతుంది.అది చూసిన చక్రి ఇవాళ నాకు ఇంటికి వెళ్లిన తర్వాత ఉన్నట్లేనని అనుకుంటాడు. అప్లికేషన్ పూర్తి చేసి ఆవిడకు ఇవ్వగానే రెండు వారాల్లో మీ సర్టిఫికేట్లు మీచేతుల్లో ఉంటాయని చెప్పడంతో మహాలక్ష్మీ ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నిజంగా  రెండువారాల్లో వస్తాయా అని అడగ్గా....అంతకన్నా ముందే ఇచ్చేలా చూస్తానని అంటుంది. తన సర్టిఫికేట్లు రావడానికి హెల్ఫ్‌ చేసిన చక్రికి మహా థ్యాంక్స్‌చెబుతుంది.                

మాధవ్‌, కేశవ్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ గాయత్రివాళ్ల ఇంటి ముందు ఆగుతారు. అక్కడ పురుషోత్తం పెళ్లి హడావుడి చేస్తుంటాడు. పెళ్లికిఎన్నోరోజులు లేదని....తెల్లారితే పెళ్లి పెట్టుకుని నత్తనడక పనులేంటని కూలీలను అరుస్తుంటాడు.మాధవ్‌, చక్రిని చూసి మరింత రెచ్చిపోతాడు. పెళ్లికోసం వేయించిన ఫ్లెక్సీని కావాలనే బయటపెట్టిస్తాడు.

Continues below advertisement

వేరేవాళ్లను పెళ్లికి పిలుస్తున్న వంకతో మాధవ్‌ను తీవ్రంగా విమర్శిస్తాడు. మా అమ్మాయికి దుబాయ్ సంబంధం కుదిరిందని....అడ్డమైన వాళ్లకు నా కూతురుని ఇవ్వనని మాధవ్‌ను తేలిక చేసి మాట్లాడుతుంటాడు.ఇదంతా గాయత్రి లోపల నుంచి చూస్తుంటుంది. కేశవ్‌ కోపంతో రగిలిపోతుంటాడు. వెళ్లి వాళ్ల మామయ్యను తన్ని వాడినోరు మూపిస్తానని అంటాడు. తమ్ముడిని ఆపిన మాధవ్‌.....అది మనల్ని ఎప్పుడైతే వద్దనుకుందో అప్పుడే ఈ ఇంటి గురించి మనం మర్చిపోయామని....వాళ్లు ఏం అనుకుంటే  మనకు ఎందుకురా  అని తీసుకుని వెళ్లిపోతాడు. సర్టిఫికేట్లు వస్తున్నాయన్న ఆనందంతో మహా చక్రికి ఐస్‌క్రీమ్‌ ట్రీట్ ఇప్పించి ఈవిషయం వెంటనే పెద్దికి చెప్పాలని సంతోషంగా ఇంటికి వస్తుంది.తన సర్టిఫికేట్లు చేతికి రానున్నాయని మాధవ్‌కు చెప్పగా మంచిదని అనడంతో ఏమైందని మహా అడుగుతుంది.ఏం లేదని మాధవ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రేపే గాయత్రికి పెళ్లని కేశవ్ చెప్పడంతో ఇంట్లో అందరూ చాలా భాదపడిపోతుంటారు.                         

మాధవ్‌ కోసం అక్కడ గాయత్రి కూడా ఏడుస్తూ అన్నం తినకుండా అలిగి కూర్చుంటుంది.వాళ్ల అమ్మ వచ్చి ఎంత చెప్పినా వినదు. మళ్లీ ఆ మాధవ్‌గాడి గురించి ఆలోచిస్తే ఈసారి నేను నిజంగానే చస్తానని బెదిరిస్తుంది.అయితే చచ్చిపొమ్మని గాయత్రి అంటుంది.ఆమె మాటలు విన్న తాయర్‌ షాక్‌కు గురవుతుంది. చచ్చిపోతానని బెదిరించడం లేదా చంపుతానని భయపెట్టడం తప్ప నా మనసుతో నీకు పనిలేదని గాయత్రి మండిపడుతుంది. ఇంట్లో బాధపడుతున్న మాధవ్‌ను ఒంటరిగా వదిలేయమని మహాలక్ష్మీ చెబుతుంది.

ఇంటి తలుపులు వేస్తుండగా....చీకటిలో వచ్చిన మనిషిని చూసి మహా ఎవరని అడుగుతుంది.గాయత్రి వచ్చి లోపలికి రావొచ్చా అని అడిగి వస్తుంది. గాయత్రిని చూడగానే చక్రి,కేశవ్‌, కన్నా మండిపడతారు. మా అన్నయ్య అంటే  ఇష్టం లేదని బాధపెట్టి మళ్లీ ఏం ముఖంపెట్టుకుని వచ్చావని అంటారు. బావ లేకుండా నేను ఉండలనేనని చెప్పి ఏడుస్తుంది.అయితే ఈ క్షణమే  ఇక్కడే పెళ్లిచేసుకోమని చెప్పడంతో సరేనంటుంది. మాధవ్‌ పెళ్లి బట్టలు కట్టుకుని గాయత్రి మెడలో తాళి కట్టేందుకు రెడీ అవ్వగా.....అప్పుడే తాయరు,పురుషోత్తం అక్కడికి వస్తారు.