Nindu Noorella Saavasam Serial Today Episode:  టీవీలో ఆత్మల ఫ్రోంగ్రాం చూస్తున్న పిల్లల దగ్గరకు వచ్చిన అమర్‌ ఆత్మలు టీవీలోనే కాదు మన చుట్టూరు కూడా తిరుగుతుంటాయి అని చెప్తాడు.

Continues below advertisement

అంజు: అయితే అమ్మ ఆత్మ కూడా ఇక్కడే ఉంటుంది కదా డాడ్

అమర్: అవును ఉంటుంది. (అందరూ షాక్)  మీ అమ్మ ఆత్మ నా ఎదురుగానే నా కళ్ల ముందే ఉంది.

Continues below advertisement

రాథోడ్‌: మిస్సమ్మ నీకు కనిపించినట్టే సారుకు కూడా ఆరుంధతి మేడం ఆత్మ కనిపిస్తుంది అంటావా..?

భాగీ: నాకు తెలియదు రాథోడ్‌

గుప్త: బాలిక మేము నీకు ఇచ్చిన శక్తులను దుర్వినియోగ పరిచావా..? నీ  పతిదేవునికి కూడా నువ్వు కనిపించావు కదూ

ఆరు: అయ్యో ఏంటి గుప్త గారు నేను ఆయనకు కనిపించడం ఏంటి..? నేను నా చెల్లికి మాత్రమే కనిపిస్తాను.

మనోహరి: అరుంధతి నీ ఎదురుగా ఉందా..?

అమర్: అవును నన్ను విడిచి ఆరు ఎక్కడికి వెళ్లలేదు.. నా  కోసం తను ఇక్కడే ఉంది. ఇంటి బయట లాన్‌లో ఆరు ఉన్నట్టు.. నేను బయటకు వెళ్లేటప్పుడు.. నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తను నన్ను చూస్తూ ఉన్నట్టు నా మనసుకు అనిపిస్తుంది. ఆరు నన్ను చూస్తూ నా దగ్గరకు వస్తూ ఉన్నట్టు ఫీల్‌ అవుతాను. తను నా కళ్లకు కనిపించకపోయినా మనసుకు స్పష్టంగా తెలుస్తుంది.

మను: ఓహో అది నీ ఇల్లూషన్‌ అన్నమాట. ఇంకా ఆరు భాగీకి కనిపించినట్టు నీకు కనిపిస్తుందేమోనని భయపడి చచ్చాను.. ( మనసులో అనుకుని)  పిల్లుల మీరు పైకి వెళ్లి చదువుకోండి.. ఇంకెప్పుడు ఇలాంటి ఫ్రోగ్రాం చూడకండి

అని చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. తర్వాత ఆరును చూడాలని మాట్లాడాలని భాగీ ఆత్రుతగా బయటకు వెళ్తుంది. ఆరు కోసం వెతుకుతుంది. ఆరు ఎక్కడా కనిపించదు.. దీంతో భాగీ ఎమోషనల్‌ గా ఎక్కడికి వెళ్లావు అక్కా.. అంటూ చూస్తూ.. గట్టిగా అక్కా అని పిలుస్తుంది. ఇంతలో గుప్తతో కలిసి బయటి నుంచి వస్తున్న ఆరుకు భాగీ పిలుపు వినిపిస్తుంది. వెంటనే భాగీని చూసి ఆనందంగా చెల్లి అంటూ దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తుంది. భాగీ కూడా ఎమోషనల్‌ అవుతూ.. ఆరు కోపం స్పీడుగా వెళ్తుంది. ఇద్దరూ చేతులు పట్టుకుని ఎమోషనల్‌ అవుతారు.

భాగీ: అక్కా.. నిన్ను మళ్లీ చూడటం సంతోషంగా ఉంది అక్కా

ఆరు: నాకు కూడా చాలా సంతోసంగా ఉంది చెల్లి

ఇంతలో రాథోడ్‌ వస్తాడు. ఆరుతో మాట్లాడుతున్నావా..? అని సైగ చేస్తాడు. అవునన్నట్టు భాగీ సైగ చేస్తుంది. దీంతో రాథోడ్‌ వింటూ ఉంటాడు. అప్పుడే అంజలి కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి లాన్‌లో భాగీ మాట్లాడటం చూస్తుంది. మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ దగ్గరకు వెళ్తుంది.

అంజు: మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు..

భాగీ: అది అంజు..

అంజు: నాకు నిజం చెప్పండి.. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు

భాగీ: అది కాదు అంజు

అంజు: మిస్సమ్మ మీరు నిజం చెప్పకపోయినా నాకు తెలుస్తుంది.. మీరు మా అమ్మతో మాట్లాడుతున్నారు కదా..?

అనగానే.. భాగీ, ఆరు షాక్‌ అవుతారు.

భాగీ: అంజు నేను చెప్పేది ఒకసారి విను అంజు

అంజు: అమ్మ ఇక్కడే ఉంది కదా..? చెప్పు మిస్సమ్మ నువ్వు మాట్లాడేది అమ్మతో కదా..?

అంజుకు ఏం చెప్పాలో అర్థం కాక భాగీ మౌనంగా ఉంటుంది.

అంజు: అమ్మా.. అమ్మా.. ఒక్కసారి కనిపించమ్మా.. నాతో మాట్లాడమ్మా… ఫ్లీజ్‌ అమ్మా.. నాకు ఒక్కసారి కనిపించు అమ్మ.. మిస్సమ్మకు ఎందుకు కనిపిస్తున్నావు నాకు ఎందుకు కనిపించడం లేదు అమ్మ.. నేను అంటే నీకు ఇష్టం లేదా అమ్మా… చెప్పమ్మా.. కనీసం నాతో మాట్లాడనైనా మాట్లాడమ్మా.. ఫ్లీజ్‌ అమ్మా

అని అంజు బాధపడుతుంటే అందరూ ఎమోషనల్‌ అవుతారు. ఆరు, భాగీ మాత్రం ఏడుస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!