Trinayani June 17th: బువ్వమ్మ వాళ్ళు భోజనం చాలు అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. తృప్తిగా తిన్నాము అనడంతో ఊపిరి పీల్చుకుంటారు. వెంటనే గాయత్రి అమ్మగారు చెప్పినట్టు మంచితనం ఉన్న ఒక్కోసారి అహంతో ప్రవర్తించి ఇబ్బందులు తెచ్చుకుంటాం అని మనసులో అనుకుంటుంది నయని. ఆ తర్వాత ఆ ముగ్గురు ముత్తైదులకు బొట్టు పెట్టి చీరెసార పెడుతుంది. ఇక వారి ఆశీర్వచనం తీసుకోగా వాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే సమయంలో వాళ్ళు ఎంత తిన్నారో అని విశాల్ అత్త అనటంతో వెంటనే విశాల్ తింటే తినని మాకు తృప్తిగా ఉంది అని సంతోషపడతాడు.


ఆ తర్వాత నయనిని శ్రీవిద్య వెనుకాల వచ్చి గట్టిగా పట్టుకొని ఆటపట్టించడంతో వెంటనే నయని గుర్తు పడుతుంది. ఇక శ్రీవిద్య తమ గణపతి సర్ తో రావటంతో వారిద్దరు దంపతులని అనుకోగా కాదు అని అంటారు. తర్వాత వారిద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నారని తెలుసుకొని వారిని ఒకటి చేసే విధంగా మాట్లాడుతుంటారు. ఇక తాము అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా శ్రీవిద్య మా వారు మాస్టారు అంటూ చెప్పి సిగ్గుపడుతూ వెళ్తుంది.


మరోవైపు వల్లభ తిలోత్తమాతో వచ్చిన ముత్తైదులు తిన్న ఆహారం గురించి అలసిపోతూ మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటాడు. తిలోత్తమా కూడా అంతే నీరసంగా కనిపిస్తుంది. అప్పుడే హాసిని వచ్చి తన మాటలతో వారిని చిరాకు తెప్పించే లాగా చేసి అక్కడ నుంచి వెళ్తుంది. ఎద్దులయ్య హాసినితో తన భర్త గాయం నయమవుతుందని చెప్పి ఒక సలహా ఇస్తాడు.


ఆ పని ఎలాగైనా చేయమని అంటాడు. ఎలాగైనా అతడు బోర్లా పడాలి చేతులు తూర్పు వైపు మల్లాలి అని అంటాడు. దాంతో హాసిని వాళ్ళ పిన్ని వల్లభను తీసుకురావడానికి వెళ్తుండగా వెంటనే హాసిని అలా రాడు అని ఒక ప్లాన్ చెబుతుంది. ఆయనను ఆ హడావిడిగా రప్పించి కింద పడేలా చేద్దామని అంటుంది. దాంతో అందరూ ఓకే అంటారు.


ఆ తర్వాత ప్లాన్ వర్క్ అవుట్ చేయడానికి సిద్ధమౌతుంది హాసిని. వెంటనే హాసిని గట్టిగా అరవడంతో అక్కడ ఆ సమయంలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన నయని మీద విశాల్ పడతాడు. ఇక వల్లభ పరిగెత్తుకొని రావటంతో వల్లభతోపాటు తిలోత్తమా కూడా పడుతుంది. ఇక ఆ సమయంలో హాసిని వల్లభ పై పడి ప్లాన్ వర్కౌట్ చేస్తుంది. ఆ తర్వాత హాసిని తన భర్త చేతికి ఉన్న గాయం నయం చేయటానికి ఇలా చేశామని అంటుంది.


ఇక తిలోత్తమా పావనమూర్తిని గట్టిగా నిలదీస్తుంది. ఇక వల్లభ నొప్పితో బాధపడుతూ ఉండగా విశాల్ దెబ్బ తగిలిందేమో అని మళ్లీ కట్టు విప్పి చూస్తాడు. అక్కడ ఏమి గాయం లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఎద్దులయ్య వల్ల మంచి జరిగిందని నయని అంటుంది. ఇక వల్లభ చేతిలో బాగా అయ్యాయి చిన్నపిల్లడి లాగా ప్రవర్తిస్తాడు.


ఆ తర్వాత పావనమూర్తిపై తన భార్య బాగా పంచులు వేస్తూ ఉంటుంది. మధ్యలో హాసిని కూడా వెటకారం చేస్తూ మాట్లాడుతుండటంతో తిలోత్తమా ఫైర్ అవుతుంది. ఇక సుమన కూడా తన భర్త దేనికి పనికిరాడు అన్నట్లుగా కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. వల్లభ చిన్నపిల్ల గురించి కాస్త వెటకారంగా మాట్లాడటంతో వెంటనే నయని అతనిపై ఫైర్ అవుతుంది. ఇక విశాల్ ఇంట్లో అందరం ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్నాము అని అలా అయితే అందరము అనాధలమే అని తన తల్లితో అంటాడు. అదే సమయంలో ఆ పాప అంతేకదా నాన్న అంటూ లోపలికి వస్తుంది.


Read Also: Prema Entha Madhuram June 17th: ఆర్యను టార్గెట్ చేసిన మాన్సీ-జోగమ్మ మాటలకు షాకైన కుటుంబ సభ్యులు?