Lakshmi Raave Maa Intiki: మ్యాడీ, లక్ష్మిల ప్రేమలో ట్విస్ట్! త్రిష బాధ, సీనియర్ల ర్యాగింగ్.. ఏమవుతుంది?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 24 th: మ్యాడీ, శ్రీలక్ష్మీకి ఫస్ట్నైట్ ముహూర్తం పెట్టించిన పెద్దాయన...16రోజుల పండుగకు సింధూ, గోపిని పిలిచిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: శ్రీలక్ష్మీని కూడా బైక్పై కాలేజీకి తీసుకెళ్లాలని తాతయ్య ఆదేశించడంతో చేసేదిలేక మ్యాడీ లక్ష్మీని తన బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్తాడు. బస్టాండ్ వరకు వెళ్లిన తర్వాత అక్కడ కిందకు దింపి డబ్బులిచ్చి ఆటోలో కాలేజీకి వెళ్లమని అంటాడు.ఈ విషయం ఇంట్లో చెబితే బాగుండదని హెచ్చరిస్తాడు. నువ్వు నా వెనక కూర్చుని బైక్పై రావడం నాకు అసలు ఇష్టం లేదని చెబుతాడు. గుడిలోనే వదిలేసి వచ్చిన వాడు కాలేజీకి తీసుకెళ్తానంటే ఎట్లా నమ్మానబ్బా అని శ్రీలక్ష్మీ ఆలోచిస్తుంటుంది. దీంతో మ్యాడీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో లక్ష్మీ బస్సులో కాలేజీకి చేరుకుంటుంది.
పెళ్లయిన తర్వాత గోపి, సింధూని ఇంటికి పిలవలేదని....వాళ్ల అమ్మ ఫోన్ చేస్తే సింధూ అసలు ఫోన్ కూడా లిప్ట్ చేయడంలేదని ఇందిర పెద్దాయనకు చెబుతుంది. మీరు ఫోన్ చేసి వాళ్లిద్దరినీ రప్పించి 16రోజుల పండుగ చేయిస్తే బాగుంటుందని చెప్పడంతో సూర్యనారాయణ సరేనంటాడు. వాళ్లతోపాటు మన మ్యాడీ, శ్రీలక్ష్మీకి కూడా 16 రోజుల పండుగ జరిపిద్దామని భార్య అనగా...చాలా మంచిమాట చెప్పావని అంటాడు. వెంటనే గోపీకి ఫోన్ చేసి విషయం చెబుతాడు. తానే అన్ని ఏర్పాట్లు చేస్తానని సింధూని తీసుకుని మీ అమ్మ,చెల్లెలను కూడా తీసుకుని రమ్మని చెబుతాడు. ఇప్పుడు కాదులే అని చెప్పినా వినకుండా మీరు రావాల్సిందేనని...పెళ్లయిన తర్వాత మీరు తొలిసారి మా ఇంటికి వస్తున్నారని చెప్పడంతో గోపీ సరేనంటాడు. కాకపోతే మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని నేనే వస్తానని చెప్పడంతో సూర్యనారాయణ ఓకే చెబుతాడు. పెళ్లయి చాలారోజులవుతుందని...కానీ మన మధుబాబు,శ్రీలక్ష్మీల ఫస్ట్నైట్ మాత్రం ఏర్పాటు చేయలేదని సూర్యనారాయణతో భార్య ఇందిర అనగా...నేను ఆ విషయంపై ఎప్పటికప్పుడు పంతులుగారితో మాట్లాడుతున్నానని అంటాడు. ఈ 16రోజుల పండుగ అయిపోయిన వెంటనే కార్యం పెట్టుకోమని చెప్పాడని చెబుతాడు.అప్పుడు ప్రియంవద కలుగజేసుకుని వాడికి అసలు ఆ అమ్మాయి అంటేనే ఇష్టం లేదని...మీరు బలంవంతంగా వాడితో ఆమె మెడలో తాళి కట్టించారని ఇప్పుడు వాడి ఇష్టాయిస్టాలు తెలుసుకోకుండా ఫస్ట్నైట్ ఏర్పాట్లు చేస్తున్నారని మండిపడుతుంది. ఆమె మాటలకు ఇందిర అడ్డుచెప్పి...వారి మధ్య ఆ దూరం తగ్గడానికే కదా ఈ తొలిరాత్రి ఏర్పాట్లు చేసేది అని అంటుంది. కూతురుపై కోప్పడిన సూర్యనారాయణ దానికి ఈ విషయాలన్నీ తెలిస్తే దాని జీవితం అలా పాడుచేసుకోదని చెప్పి వెళ్లిపోతాడు.
కాలేజీకి తొలిరోజు వెళ్లిన మ్యాడీని సీనియర్లు ర్యాగింగ్ చేస్తారు. లంగా,ఓణీ వేసుకుని వస్తున్న శ్రీలక్ష్మీకి ప్రపోజ్ చేసి ఆమె రిప్లై తీసుకుని రమ్మని చెప్పడంతో....మ్యాడీ లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఐలయూ చెబుతాడు. అప్పుడు అక్కడే ఉన్న త్రిష ఇది చూసి చాలా బాధపడుతుంది. వచ్చి మ్యాడీపై కోప్పడుతుంది. మ్యాడీ ఐలయూ చెప్పగానే రిప్లై ఇస్తున్న లక్ష్మీపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన సీనియర్లు ఇదంతా ర్యాగింగ్లో భాగమని చెప్పడంతో...లక్ష్మీ చాలా బాధపడుతుంది. మ్యాడీ నిజంగానే ఐలయూ చెప్పాడనుకున్నానని అనుకుంటుంది. లక్ష్మీ బాధపోగొట్టేందుకు ఆమెను బైక్పై ఎక్కించుకుని తిప్పాలని సీనియర్లు ఆదేశించడంతో మ్యాడీ చేసేదిలేక శ్రీలక్ష్మీని బైక్పై ఎక్కించుకుకని మూడు రౌండ్లు కొడుతుంటడంతో త్రిష ఏడుస్తూ చూస్తుంటుంది.























