Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున కింద పడిపోయి ఉండటం చూసి విహారి ఎమోషనల్ అవుతాడు. అమ్మా లే అమ్మా అని ఏడుస్తాడు. యమునని తీసుకొని ఎత్తుకెళ్లి హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని తాతయ్యతో చెప్పి తాతని పిలుస్తాడు. భక్తవత్సలం కూడా వెళ్తుంటే పద్మాక్షి ఆపుతుంది. ఇదంతా యమున నాటకం అని అంటుంది. 


భక్తవత్సలం: ఏం మాట్లాడుతున్నావ్ పద్మాక్షి ఇలాంటి సమయంలో ఎవరైనా నాటకాలు ఆడుతారా. యమున ఆరోగ్యం గురించి నాకు బాగా తెలుసు అందుకే విహారి కంగారు పడుతున్నాడు. నిశ్చితార్థం గురించి తర్వాత మాట్లాడుకుందాం నేను హాస్పిటల్‌కి వెళ్తున్నా.
సహస్ర: తాతయ్య నేను వస్తా.
అంబిక: ఏంటి అక్క మనం ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.
పద్మాక్షి: మనం గురి పెట్టాం కానీ అది ఆకాశానికి అని అర్థం చేసుకోలేకపోయాం. అలా గురి చూసి వదిలిన బాణం మనకే గుచ్చుకుంటుందని ఊహించలేకపోయాం.
లక్ష్మీ: కిచెన్ ఒంటరిగా ఏడుస్తూ.. పాపం యమునమ్మ గారు ఎవరినీ బాధ పెట్టరు. అలాంటిది ఆవిడకే ఎందుకు ఇలా అవుతుంది. విహారి గారి నిశ్చితార్థం కళ్లారా చూసుకోవాలి అనుకున్నారు. మురిసి పోవాలి అనుకున్నారు. కానీ నిశ్చితార్థం జరిగే సమయానికి అమ్మగారికి ఎందుకు ఇలా అయింది. అమ్మగారికి ఏం కాకుండా చూడు తండ్రీ.


యమునని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. అందరూ హాస్పిటల్‌కి చేరుకుంటారు. అమ్మకి ఏమవుతుందో అని కంగారుగా ఉందని విహారి అంటాడు. ఇంతలో యమున కళ్లు తెరుస్తుంది. డాక్టర్ విహారి వాళ్లని పిలుస్తుంది. అందరూ యమున దగ్గరకు వెళ్తారు. లక్ష్మీ కూడా హాస్పిటల్‌కి వస్తుంది కానీ విహారికి ఎదురు పడకూడదని బయటే ఉండిపోతుంది. విహారి ఏమైందని ఎందుకు తన తల్లి పడిపోయిందని డాక్టర్‌ని అడుగుతాడు. దానికి డాక్టర్ ఆమె తిన్న ఫుడ్‌లో కానీ తాగిన వాటర్‌కానీ నిద్ర మాత్రలు కలిశాయని ఓవర్ డోస్ అవ్వడంతో కళ్లు తిరిగి పడిపోయారని చెప్తుంది. విహారి షాక్ అయిపోతాడు.  


విహారి: అమ్మా నువ్వు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? రాత్రి అంటే ఓకే కానీ నిశ్చితార్థంలో తీసుకోవాల్సిన పని ఏంటి. 
పద్మాక్షి: వీడేంటి ఇంత ఆరా తీస్తున్నాడు కొంప తీసి మన పేర్లు బయట పడతాయా ఏంటి.
అంబిక: అదే నాకు అర్థం కావడం లేదు.
యమున: ( తనకు అంబిక ట్యాబ్లెట్స్ ఇచ్చిందని యమున గుర్తిస్తుంది.) అంబిక తనకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చిందని చెప్తే గొడవ అవుతుందని కవర్ చేస్తుంది. అనుకోకుండా జరిగిపోయింది.
అంబిక: అనవసరం గొడవ ఎందుకని అలా చెప్పినట్లుంది.


ఇక పండు యమునతో లక్ష్మీనే నిన్ను గుర్తించిందని మేం ఎంత వెతికినా మీరు దొరకలేదని అంటాడు. దానికి యమున రోజు రోజుకీ నేను లక్ష్మీకి రుణపడిపోతున్నానని అంటుంది. ఇక డాక్టర్ మాట్లాడాలని భక్తవత్సలాన్ని పిలుస్తుంది. విహారి కూడా వెళ్తాడు. ఇక పద్మాక్షి యమునని నిశ్చితార్థం ఆపాలనే నువ్వు ఇలా చేశావు కదా అని అంటుంది. ఇది ఎవరి వల్ల జరిగిందో ఎందుకు జరిగిందో నాకు తెలీకపోయిన ఆ పై వాడు చూస్తాడని ఆయన చేయాల్సింది చేస్తాడంటుంది. దానికి అంబిక దేవుడి మీద తోసేస్తున్నావని నిశ్చితార్థం నీవల్ల ఆగిపోయినందుకు ఏం సమాధానం చెప్తావని అడుగుతుంది. ఇక కాదాంబరి సహస్రని చూపించి కోరుకున్నవాడిని చేసుకుంటాననుకున్న దీని బాధ చూడు అని అందర్ని బాధ పెట్టావని అంటుంది. 


ఇక కోపంగా పద్మాక్షి, అంబిక బయటకు వస్తారు. నిశ్చితార్థంలో యమున లేకుండా చేయాలి అనుకుంటే నిశ్చితార్థం ఆగిపోయిందని అక్కా చెల్లెళ్లు మాట్లాడుకుంటే లక్ష్మీ వినేస్తుంది. తన వాళ్లే యమునను ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటుంది. విహారి మన వైపునకు వచ్చేయాలని పద్మాక్షి అంటే అంబిక మనసులో విహారి అడ్డు తొలగించేసి ఆస్తి దక్కించుకుంటానని అనుకుంటుంది. ఇక లక్ష్మీ దేవుడికి దండం పెట్టుకొని యమునమ్మకి తానే రక్షణగా నిలబడాలని తన వాళ్లే తనకు శత్రువులు అయ్యారని అంటుంది. ఇక విహారి కూడా అటువైపు వస్తుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతకి సపోర్ట్ చేస్తూ పిన్నికి షాక్ ఇచ్చిన రామ్.. ప్రీతికి బ్లాక్ మెయిల్ చేసిన విక్కీ!