Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తనని కాపాడింది లక్ష్మీనే అని విహారికి తెలిసిపోయిందా! లక్ష్మీ డెలివరీకి ఏర్పాట్లు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 20th: విహారి కండీషన్ సీరియస్ నుంచి నార్మల్కి రావడం విహారి లక్ష్మీనే తనని కాపాడిందని గుర్తించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode | అంబిక హాస్పిటల్కి వచ్చి యమున వాళ్లని చూసి ఆ విహారి గాడిని చంపేశాను.. ఇక సహస్రకి మగ బిడ్డ పుడితే వాడిని చంపేస్తే నాకు ఏ అడ్డు ఉండదు అని అనుకుంటుంది. యమున వాళ్లు ఏడ్వడం చూసి విహారి గాడు చచ్చిపోయి ఉంటాడా.. వీళ్ల ఏడుపులు హడావుడి చూస్తుంటే చచ్చిపోయినట్లే ఉన్నాడు.. విహారి చనిపోతే వాడిని తీసుకెళ్లాల్సింది మార్చురీకి కదా.. ఇక్కడ ఉన్నారేంటి చూద్దాం అని యమున దగ్గరకు వెళ్తుంది.
అంబిక అని యమున ఏడుస్తుంది. ఏమైంది వదినా అని అంబిక అడిగితే విహారిని ఎవరో కత్తితో పొడిచేశారు అంట అంబిక అని చారుకేశవ చెప్తాడు. అంబిక ఫ్లాష్బ్యాక్కి వెళ్లి ఆ లేడీ విహారిని పొడిచేసి అంబికకు కాల్ చేసి విహారికి నాలుగు కత్తిపోట్లు పడ్డాయ్,, అని చెప్పిన విషయం గుర్తు చేసుకొని పైకి మాత్రం అలాగా ఇప్పుడు విహారికి ఏం కాలేదు కదా అని అడుగుతుంది. దానికి చారుకేశవ దేవుడి దయ వల్ల ఎవరో అమ్మాయి విహారిని కాపాడి హాస్పిటల్లో చేర్పించింది.. విహారి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని చెప్తాడు. అంబిక చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. విహారి కండీషన్ క్రిటికల్గానే ఉంది.. చిన్న సర్జరీ చేయాలంట అని చారుకేశవ అంటాడు. ఏ దుర్మార్గులు నా కొడుకు మీద ఇలా చేశారో వాళ్లకి పుట్టగతులు ఉండకూడదు అని యమున అనడంతో నేను సహస్రని చూసి వస్తా వదినా అని అంబిక బయటకు వెళ్తుంది. సుభాష్కి కాల్ చేసి విహారిని చంపడానికి మనుషుల్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చావ్.. నీకు వాళ్లకి కలిపి సన్మానం చేస్తా అని అంటుంది. ఏమైంది అని సుభాష్ అడిగితే వాళ్లు సగం పొడిచి వదిలేసి చంపేశాం అని చెప్పారు.. వాడు ఐసీయూలో ఉన్నాడు అని చెప్తుంది. సుభాష్ని ఫుల్లుగా తిడుతుంది. సుభాష్ని హాస్పిటల్కి రమ్మని అంటుంది.
బామ్మ యమున దగ్గరకు వెళ్లి ఎలా ఉందమ్మా మీ బాబుకి అని అడుగుతుంది. ఇంకా సీరియస్గానే ఉందని యమున ఏడుస్తుంది. అక్కడ నా మనవరాలి పరిస్థితి అలాగే ఉంది.. ఏంటో దేవుడు మంచి వాళ్లకే ఇలాంటి పరిస్థితి ఇస్తాడు అని అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి విహారి కండీషన్ క్రిటికల్గా ఉందని చెప్పడంతో అంబిక చాలా సంతోషపడుతుంది. తన కొడుకుని కాపాడమని యమున ఏడుస్తుంది. బామ్మ యమునకు ధైర్యం చెప్తుంది. ఇక డాక్టర్ లక్ష్మీని పరీక్షించి తనకి వెంటనే డెలివరీ చేయాలి ఒంటి మీద ఏం ఉండకూడదు మొత్తం తీసేయ్ అని చెప్తుంది. దాంతో నర్సు పూలు, మెట్టెలు, తాళి, రింగ్ ఇలా అన్నీ తీసి బామ్మకి ఇస్తారు. నా మనవరాలు ఈ కాలం పిల్ల అయినా పాత కాలం పద్ధతులు పాటిస్తుంది. తన నుంచి ఏం దూరం చేసినా ఆ తాళి తీయొద్దమ్మా,, తన నుంచి భర్త దూరం అయినా ఈ తాళి తన గుండెల మీదే ఉంచి తృప్తి పడుతుంది. దయచేసి ఈ తాళి తన మెడలోనే ఉంచండి అని చెప్తుంది. దాంతో డాక్టర్ సరే అంటుంది.
యమున దేవుడి దగ్గరకు వెళ్లి దేవుడా ఉంటి ఈ పరిస్థితి ఒక వైపు మా ఇంటి వారసుడికి గండాలు పెట్టావు.. మరోవైపు నా కొడుకుకి ఈ పరిస్థితి కలిగించావు నా కొడుకుని కాపాడు అని వేడుకుంటుంది. అంబిక విహారిని చూసి అక్కడ తప్పించుకున్నా ఇక్కడ విహారి చస్తాడు.. ఎలా అయితే ఏంటి నాకు విహారి చావు కావాలి అంతే అని అనుకుంటుంది. మరోవైపు బామ్మతోనే డాక్టర్ లక్ష్మీ మెడలో తాళి వేయిస్తుంది. లక్ష్మీ మెడలో తాళి పడగానే విహారిలో చలనం మొదలవుతుంది. డాక్టర్ చూసి యమున వాళ్లతో మీ అబ్బాయి నార్మల్ కండీషన్ లోకి వచ్చారని అంటాడు. ఇక లక్ష్మీని క్రిటికల్ వార్డుకి మార్చుతారు. విహారిని ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకి మార్చుతారు.
ఇద్దరినీ ఒకే టైంలో మార్చడంతో ఒకరి చేయి ఒకరికి తగులుతుంది. మరోవైపు బావకి ఎలా ఉందో అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే పద్మాక్షి వచ్చి ఏం ప్రాబ్లమ్ లేదు అని అంటుంది. సహస్ర తల్లితో అమ్మా ఒక్క సారి ఎవరికీ కనిపించకుండా బావని చూసి వచ్చేస్తా అని అంటే పద్మాక్షి సహస్ర జుట్టు పట్టుకొని లాగి పడేసి ఎక్కడికే వెళ్లేది నోరు మూసుకొని ఉండు అని అంటుంది. ఏంటి అమ్మా ఇంత కోపం అని సహస్ర అంటే నేను పడే టెన్షన్ నీకు ఏం తెలుసే.. ఆ సరోగసీ మదర్ సరిగా డెలివరీ అవ్వాలి,, ఆ బిడ్డని నీ తీసుకొచ్చి ఇవ్వాలి.. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు.. ఎలా ఏం చేయాలో అని నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు బావని చూస్తా బోడి గుండుని చూస్తా అంటే ఎలానే నువ్వేం మాట్లాడకుండా ఇక్కడే ఉండు అని చెప్పి పద్మాక్షి వెళ్లిపోతుంది.
మరోవైపు విహారి జరిగింది అంతా గుర్తు చేసుకొని లక్ష్మీ అని అరిచి లేస్తాడు. నాకు కనకం కనిపించింది అని అనుకొని లేస్తాడు. బయటకు వచ్చే సరికి పండు కుర్చీలో పడుకొని ఉంటాడు. నర్సు విహారిని చూసి సార్ మీరు బయటకు రాకూడదు అని అంటుంది. నేను నా కనకాన్ని చూడాలి అని అంటాడు. కనకం ఎవరు సార్ అని నర్సు అంటే నన్ను కాపాడింది కదా తనే అని అంటాడు. తను క్రిటికల్ వార్డులో ఉందని నర్సు చెప్తుంది. విహారి అటుగా వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















