Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 12th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి సంచలన ప్రకటన! ప్రళయం మొదలు కానుందా? ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరు?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode February 12th లక్ష్మీ తన భార్య అని చెప్పడానికి విహారి ప్రెస్ మీట్ పెట్టడం.. 25 ఏళ్ల పగ అంటూ ఓ వ్యక్తి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ తన భార్య అని చెప్పడానికే విహారి ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాడని సహస్ర పద్మాక్షితో చెప్తుంది. దానికి పద్మాక్షి నువ్వేం టెన్షన్ పడకు ఒకవేళ నిజం చెప్తే మరుక్షణం ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ బాగా తెలుసు.. అప్పుడు ఊహించని విధంగా లక్ష్మీని చంపి అయినా నిన్ను మీ బావని కలుపుతా.. ముందు ప్రెస్ మీట్లో విహారి ఏం చెప్తాడో చూద్దాం అని పద్మాక్షి అంటుంది.
పోలీస్ స్టేషన్ నుంచి ఓ అజ్ఞాత వ్యక్తి రిలీజ్ అవుతారు. ఖైదీ బట్టలు నుంచి అతని బట్టలు వేసుకొని రిలీజ్ సంతకం పెడతాడు. ఒక తప్పు చేసి జైలుకి వచ్చావ్ ఇక్కడ తప్పుల మీద తప్పులు చేసి డబుల్ శిక్ష అనుభవించావ్ ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని పోలీసులు చెప్తారు. దానికి ఆయన కోపంగా చూసి జైలు శిక్ష పడిన వాడు మారుతాడో లేదో తెలీదు కానీ పాతికేళ్లగా పగ పెంచుకున్నవాడికి వాడి పగే ఎక్కువ. ఇప్పుడు నేను బయట ప్రపంచం చూడాలి అనుకున్నది,, మంచి వాడు అయిపోవడానికి కాదు సార్.. పగ తీర్చుకోవడానికి.. నాకు ఈ గతి పట్టించిన వాళ్లకి సేమ్ గతి పట్టించడానికి.. జైలులో నా బట్టలు గది అలాగే ఉంచండి సార్ త్వరలోనే తిరిగి వస్తా అని చెప్పి వెళ్లిపోతాడు.
ఆ అజ్ఞాత వ్యక్తి బయటకు వెళ్లి వాళ్ల గురించి తెలుసుకున్నావా అంటే తెలుసుకున్నా అని ఆ కుటుంబం మొత్తం చిన్న చిన్న గొడవలో సంతోషంగా ఉన్నారు అని అంటాడు. నాకు ఈ గతి పట్టించి.. నాకు కుటుంబం లేకుండా చేసిన వాళ్ల జీవితంలో ప్రళయం సృష్టిస్తా అని అంటాడు. మరోవైపు అంబిక లక్ష్మీని విహారి సీఈఓ చేయడం ఏంటి.. అప్పుడు అది బిజినెస్లను ఇంకా హైకి తీసుకెళ్లిపోతుంది. దాన్ని వదలకూడదు అని అంటుంది. ఇక అంబికకు సుభాష్ కాల్ చేసి విహారి ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాడు అని అడుగుతాడు. తెలీదు.. అని అంబిక అంటుంది. నా గురించి ఏమైనా చెప్తాడేమో అని సుభాష్ అంటే నీ గురించి అని నీకు అనుమానంగా ఉంది.. నాకు నా గురించి అనిపిస్తుంది అంటుంది. విహారితో మాట్లాడు అని సుభాష్ చెప్తాడు.
టీవీలో విహారి ప్రెస్ మీట్ పెట్టాలి అనుకున్నట్లు న్యూస్ వస్తుంది. అది చూసిన అజ్ఞాత వ్యక్తి వాళ్లని అడ్డుకోవాలి.. వాళ్లు సంతోషంగా ఉండకూడదు.. వాళ్ల జీవితాలను హరిస్తాను.. అని అనుకుంటాడు. లక్ష్మీ వస్తుంటే విహారి హగ్ చేసుకుంటాడు. ఏంటి ఇది విహారి గారు ఎవరైనా చూస్తారు అని లక్ష్మీ అంటుంది. చూడనీ కనకం ఏమవుతుంది కాసేపట్లో మన గురించి ఈ ప్రపంచానికి తెలుస్తుంది. కాలం ఇన్ని రోజులు మనకు అగ్గిపరీక్ష పెట్టి ఇప్పుడు ఆగిపోతుంది. నేను విష్ణువిహారి అయితే నువ్వు విష్ణు విహారి భార్యవి అవుతావు. అందరూ నిన్ను మిసెస్ విష్ణు విహారి అంటారు. నీకు ఈ పేరుని.. ఈ ఇంట్లో కోడలి స్థానాన్ని ఇవ్వాలి అనుకుంటున్నా. ఈ రోజు నా డ్రీమ్ పూర్తి అవుతుంది. ఇక నుంచి మనం సంతోషంగా ఉంటాం.. అని అంటాడు.
అంబిక విహారి దగ్గరకు వెళ్లి ప్రెస్ మీట్లో ఏం చెప్పాలి అనుకుంటున్నావ్ అని అడుగుతుంది. ఆ విషయం ప్రెస్ మీట్లోనే చెప్తా అని అంటాడు. ఇంటికి మీడియా వస్తుంది. యమునతో లక్ష్మీ మీరు మాత్రమే విహారి గారిని ఆపగలరు.. చెప్పి ఆపండి అంటుంది. ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు.. నేను నా కొడుకు చూసుకుంటాం.. ఏం జరిగినా నువ్వు చూస్తూ ఉండు అని అంటుంది. అందరూ మీడియా సమావేశం దగ్గరకు వస్తారు. విహారి వాళ్లతో బిజినెస్ మేటర్ కాదు నా పర్సనల్ విషయం మీతో పంచుకోవాలని వచ్చానని అంటాడు. సహస్ర చాలా టెన్షన్ పడుతుంది. సుభాష్ గన్ తీసుకొని వచ్చి అంబికతో మాట్లాడతాడు. విహారి మాట్లాడగానే విహారి, లక్ష్మీలను కాల్చి చంపేయమని అంటుంది. మరోవైపు ఆ ఆజ్ఞాత వ్యక్తి విహారి కుటుంబంలో అందరి ఫొటోలు చూస్తూ విహారికి కాల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























