Jagadhatri Serial Today Episode : తన తల్లి మర్డర్‌ గురించి మాజీ సీఎం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ ధనుంజయ్‌గారిని కలిసిన జేడీకి తొలుత నిరాశ ఎదురవుతుంది.ఆ కేసు గురించి నాకు ఏం తెలియదని...నన్ను ఏం అడగొద్దని ఆయన అంటాడు. చనిపోయిన ఇన్‌స్పెక్టర్‌ కూతురుని తానేనని మా అమ్మ ఎంత నిజాయితీపరురాలో మీకు తెలుసని...కానీ ఆమెపై పడిన నిందపోవడానికి 25 ఏళ్లుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నానని జగధాత్రి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Continues below advertisement

నేను పోలీసు ఆఫీసర్ జేడీని అని చెప్పగానే ధనుంజయ్‌ షాక్‌కు గురవుతాడు. రాష్ట్రాన్ని గడగడలాడించిన మీనన్‌ను చంపిన జేడీవి నువ్వేనా అని అడగ్గా...తానేనని చెబుతుంది.అయితే నీకు నిజం చెబుతానని అంటాడు. మాజీ సీఎంను తనతో చేతులు కలపాలని మీనన్ చాలా ప్రయత్నించినా...ఆయన ససేమీరా అనడంతో అతన్ని చంపేందుకు మీనన్‌ ప్లాన్ వేస్తాడు. దీన్ని తెలుసుకున్న మీ అమ్మ అన్ని ఆధారాలు సేకరిస్తుంది. అదే సమయంలో ఓ కుట్ర వల్ల మీ అమ్మతోపాటు సీఎంను కూడా మీనన్ చంపేశాడని చెబుతాడు. 

ఆ తర్వాత ఈ కేసుతో సంబంధం ఉన్న అందరూ చనిపోతుండటంతో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నానని చెబుతాడు.ఇప్పుడు కూడా మీనన్ చనిపోయాడని తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చానని అంటాడు. అన్నీ సరేకానీ మా అమ్మ చావుకు కారణం ఏంటని అడగ్గా....ధనుంజయ్‌ షాకింగ్ విషయం చెబుతాడు.నేను కూడా మీ అమ్మ చావు,సీఎం చావుపై ఎంక్వైయిరీ చేశానని....దీనికి కారణం మీ మేనమామ, జర్నలిస్టు నారాయణ కారణమని చెప్పడంతో జేడీ షాక్‌ తింటుంది. ఇది అసలు నమ్మశక్యంగా లేదని అంటుంది. 

Continues below advertisement

మా మామయ్య అలాంటివాడు కాదని...ఎంతో నిజాయితీపరుడని అంటుంది.మీ అమ్మ కూడా అలాగే నమ్మి వాడి చేతుల్లో మోసపోయిందని చెబుతాడు.మీనన్‌కు ఆధారాలు అమ్మేసింది మీ మామయ్యేనని చెబుతాడు. కానీ ఆ తర్వాత మీనన్‌ చేతుల్లోనే మీమామయ్య కూడా చనిపోయాడని చెబుతాడు. మీమామయ్యకు సంబంధించి వస్తువులు ఏమైనా ఉంటే వెతకండి ఆధారాలు దొరుకుతాయని చెబుతాడు.సరేనని చెప్పి జేడీ, కేడీ అక్కడి నుంచి బయలుదేరతారు.

వదిన ఎక్కడి వరకు వెళ్లిందో ఓసారి ఫోన్ చేయమని ధాత్రి కేదార్‌కు చెబుతుంది. కేదార్‌ కౌషికి ఫోన్ చేయగా...ఇంకా వెళ్లలేదని దారిలో ఉన్నామని చెబుతారు. అప్పుడే మీనన్‌ వారి కారుకు తన కారు అడ్డుపెట్టి ఆపుతాడు. కౌషికి ఫోన్ కట్‌ అవుతుంది దీంతో కంగారుపడిన ధాత్రి...రమ్యకు ఫోన్ చేసి వదిన ఎక్కడ ఉందో నాకు లొకేషన్ పెట్టమని చెబుతుంది. మీనన్‌ను చూసి కౌషికి,సుధాకర్‌ షాక్‌కు గురవుతారు. 

నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడుగుతారు. ఈ మీనన్‌కు చావు రాదని చెప్పి సుధాకర్‌పై దాడి చేసి రూ.10కోట్లు లాక్కుంటాడు. సుధాకర్‌ను, కౌషికిని చంపేందుకు ప్రయత్నిస్తుండగా..జగధాత్రి,  కేదార్‌ అక్కడికి రావడం చూసి డబ్బులు తీసుకుని పరారవుతారు. గాయపడిన సుధాకర్‌ను తీసుకుని ధాత్రి, కేదార్ ఇంటికి వెళతారు. ఏ జరిగిందని నిషిక వాళ్లు అడగ్గా...మీనన్‌ ఎటాక్ చేశాడని సుధాకర్ చెబుతాడు. మీనన్ బతికే ఉన్నాడని కౌషికి చెప్పినా వినలేదని...నేను కళ్లారా చూశానని చెబుతాడు. ఎవరో దొంగలు కొట్టడంతో మీరు షాక్‌లో మీనన్ అనకుంటున్నారని యువరాజు కొట్టిపడేస్తాడు. 

నేను నా కళ్లారా చూశానని చెప్పడంతో...నిషిక భయపడుతుంది.అయితే మీనన్ మన ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తాడని అంటుంది. దీనంతటికీ ఈ కౌషికియే కారణమని మండిపడుతుంది.వాడిని అడిగినప్పుడు పెన్‌డ్రైవ్‌ ఇచ్చేసి ఉంటే ఇదంతా జరిగేది కాదని అంటుంది. ఆవిడ గొప్ప కోసం ఇంట్లో అందరి ప్రాణాల మీదకు తెచ్చిందని మండిపడుతుంది. 

ఇదే సరైన సమయమని నిషిక కౌషికిని సీఈవో పదవి నుంచి దిగిపొమ్మని చెబుతుంది. ఇంతకు ముందులా మీరు ఈ కంపెనీని నడపలేకపోతున్నారని అంటుంది. హోంమినిష్టర్‌తో గొడవ పెట్టుకుని ల్యాండ్‌ విషయం కోర్టుకు తీసుకెళ్లారని ఇప్పుడు 10 కోట్లు పోగొట్టి ఢీల్‌ క్యాన్సిల్  అయ్యేలా చేశారని అంటుంది. మనం కోడ్‌ చేసిన టెండర్‌ లీక్‌ అవుతున్నా మీకు పట్టడం లేదని ....కాబట్టి మీరు సీఈవోగా ఉండే అర్హతలేదని అంటుంది. దీనికి యువరాజు, వైజయంతి కూడా వత్తాసు పలుకుతారు. మీరు దిగిపోయి...మాలో ఒకరిని నియమించమని కోరతారు.

నిషిక మాటలకు మండిపడిన కౌషికి...అసలు మనకు ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా అని అడుగుతుంది. మన షేర్‌ విలువ ఎంతో నీకు తెలుసా,అసలు మనకు ఎన్ని షేర్లు ఉన్నాయో కూడా తెలియని నువ్వు నాకు నీతులు చెప్పేస్థాయికి వచ్చావా అని అంటుంది.నిజంగా సీఈవో పదవికి నేను అర్హురాలు కానని భావించినప్పుడు నేనే రాజీనామా చేస్తానని అంటుంది. ఈ ఢీల్ ఇంకా క్యాన్సిల్ కాలేదని....ఒకవేళ ఈ ఢీల్‌ నేను సెట్‌ చేయకపోతే మీరు అన్నట్లు నేను సీఈవో పదవి నుంచి దిగిపోయి మిమ్మల్ని నియమిస్తానని చెబుతుంది.