Jagadhatri Serial Today Episode: శ్రీవల్లిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకు కోటి రూపాయలు తీసుకుని వెళ్తుండగా....జేడి, కేదార్‌ ముసుుగులు వేసుకుని వచ్చిఅడ్డగిస్తారు. మీ దగ్గర ఉన్న కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తారు. మా దగ్గర అంత డబ్బులు ఉన్నాయని మీకు ఎలా తెలుసని అంటే....వైజయంతిగారే మమ్మల్ని పంపించిందని చెబుతారు. పెళ్లికొడుకుని కొట్టి కోటిరూపాయల బ్యాగ్‌ తీసుకుని వెళ్లిపోతారు. దీంతో వాడు వెంటనే వైజయంతికి ఫోన్ చేసి తిడతాడు. డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ రౌడీలను పంపి తీసుకున్నారు కదా అని అంటాడు. వాటా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నాటకాలు ఆడుతున్నావా అని వైజయంతి తిడుతుంది. ఎంగేజ్‌మెంట్‌లోగా డబ్బులు ఇవ్వకుంటే మీపై చీటింగ్ కేసు పెట్టి పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తుంది.దీంతో వాడు కూడా ఆమెను బెదిరిస్తారు. ఈ పెళ్లి నాటకం ఆడించింది మీరేనని అందరికీ చెబుతానని అంటాడు. మర్యాదగా  ఎంగెజ్‌మెంట్‌లోగా నా డబ్బులు నాకు ఇవ్వాలని హెచ్చరిస్తాడు.                        కమలాకర్‌కు మెలకువ రాగానే అందరూ ఆయన దగ్గరకు వెళ్తారు.ఇంతలో యువరాజు పోలీసులకు ఫోన్‌చేసి చెప్పడంతో వారు వస్తారు.కమలాకర్‌ స్టేట్‌మెంట్ తీసుకుంటామని చెబుతారు.దీంతో కేదార్‌, జగధాత్రి నిజం చెప్పాలని...కోరతారు.అబద్ధం చెప్పి కేదార్‌ను ఇంట్లో నుంచి బయటకు పంపించవద్దని ధాత్రి వేడుకుంటుంది.కానీ కమలాకర్‌ పోలీసులకు అబద్ధం చెబుతాడు. కేదార్‌ నన్ను చంపడానికి ప్రయత్నించాడని చెబుతాడు. దీంతో కౌషికి కల్పించుకుని హాస్పటల్‌లోనిన్ను మీనన్‌ మనుషులుు చంపడానికి ప్రయత్నిస్తుంటే వాళ్లే ప్రాణాలకు తెగించి కాపాడారని...అలాంటి వాళ్లు నిన్ను ఎందుకు చంపుతారని ప్రశ్నిస్తుంది.ఏమో నాకు ఏం గుర్తులేదని చెబుతాడు. ఇంతలో యువరాజు పోలీసులకు చెబుతాడు యువరాజును అరెస్ట్‌ చేయమని. దీనికి ధాత్రి అడ్డుపడుతుంది. అరెస్ట్ వారెంట్‌ గానీ, బెయిల్ రద్దు అయినట్లు తాఖీదులుగానీఉంటేనే అరెస్ట్‌ చేయాలని అప్పటి వరకు కేదార్‌ను అరెస్ట్ చేయడానికి కుదరదని తెగేసి చెబుతుంది. దీంతో పోలీసులు వెళ్లిపోతారు                          కమలాకర్‌ బాబాయిని చంపడానికి ఎవరు ప్రయత్నించారో జేడీ, కేడీలను కనుక్కుని ఆదారాలు తీసుకొస్తామని ధాత్రి,  కేదార్ వెళ్లిపోతారు. ఆఫీసుకు వెళ్లి మళ్లీ కమలాకర్‌ ఫైల్‌ గురించి చర్చిస్తారు. ఈ కేసులో రంగా దొరికితేనే మనకు నిజాలు తెలుస్తాయని ధాత్రి అంటుంది.ఆ రోజు రంగా బస్సులో పారిపోయి ఉంటాడని ఊహిస్తుంది. ఆరోజు ఆటోవాళ్లను ఎంక్వయిరీ చేశాం గానీ, బస్సుల్లో చేయలేదని...ఖచ్చితంగా రంగా బస్సులోనే వెళ్లాడని జగధాత్రి అంటుంది. ఈ సమయంలో మూడు బస్సులు వెళ్లాయని వాటిల్లో ఎదో ఒకటి ఎక్కి రంగా పరిటాల చేరుకున్నాడని చెబుతుంది. కచ్చితంగా పరిటాలలోని కస్తూర్బా పాటశాలలోనే తలదాచుకుని ఉంటాడని అంటుంది. దీంతో అక్కడికి బయలుదేరతారు.ఈ  విషయాన్ని మీనన్‌ మనిషైన కానిస్టేబుల్‌ వారికి చేరవేస్తాడు. కేదార్‌ను శాశ్వతంగా ఇంటినుంచి బయటకు తరిమేసే ఛాన్స్ వచ్చిందని....దీన్ని మనం వదులుకోకూడదని యువరాజు, కమలాకర్ చర్చిస్తుంటారు. ఆ ధాత్రి చివరి నిమిషంలో చెడగొట్టిందని మండిపడతాడు. అయితే కేదార్‌ను మనుషులను పెట్టి బయటే లేపించేద్దామని యువరాజు కమలాకర్‌తో అంటాడు.