Illu Illalu Pillalu Serial Today February 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్, నర్మదల జుట్టు వల్లీ చేతిలో..! ప్రేమ, ధీరజ్లు కారు కొంటున్నారా!
Illu Illalu Pillalu Serial Today Episode February 25th సాగర్ 25 లక్షలు ఇచ్చి ఉద్యోగం కొన్నట్లు శ్రీవల్లి, భాగ్యం తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీబాబాయ్లు ఉద్యోగం పేరుతో బ్రోకర్ దగ్గరకు వెళ్తారు. ఇడ్లీబాబాయ్కి ఉద్యోగం కావాలి అంటే 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తాడు. అతనితో బేరాలు ఆడుతూ ఉంటే ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించానో చూడండి అని అతను ఫైల్ ఇస్తారు. అందులో సాగర్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. అతన్ని మాటల్లో పెట్టి సాగర్ ప్రొఫైల్ వీడియో తీస్తుంది శ్రీవల్లి. సాగర్25 లక్షలు ఇచ్చి మంచి జాబ్ కొట్టేశాడు అని తెలుసుకుంటారు. తర్వాత భాగ్యం, వల్లీ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
వేదవతి రామరాజుకి మందులు ఇస్తుంది. ఇంతలో నర్మదకు సాగర్ పార్టీకి వెళ్దామని బతిమాలుతూ ఉంటాడు. ఇద్దరూ హాల్లోకి వస్తారు. ఏమైందని వేదవతి అడిగితే సాగర్ తల్లీతండ్రులతో ఉద్యోగం వచ్చిందని మా మామయ్య పార్టీ ఏర్పాటు చేశారు.. ఇంట్లో అందర్ని రమ్మని చెప్పారు.. మిమల్ని స్వయంగా పిలుస్తా అన్నారు కానీ నేనే వద్దు అన్నాను.. అని అంటాడు. నర్మద సైలెంట్గా ఉండటంతో నువ్వేం మాట్లాడటం లేదు ఏమైందని వేదవతి అడుగుతుంది. మీరు ఏదో విషయం నా దగ్గర దాస్తున్నారు అది ఏంటి అని వేదవతి అడిగితే ఏం లేదు అత్తయ్య మన ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరు కదా ఈ టైంలో పార్టీ ఇష్టం లేదు.. కానీ మా నాన్న అల్లుడిని అందరికీ పరిచయం చేయాలి అని చేస్తున్నారు అని అంటుంది.
భాగ్యం, వల్లీ, ఇడ్లీబాబాయ్లు సాగర్, నర్మదల అంతు చూస్తానని అనుకుంటూ వస్తారు. సాగర్ తండ్రిని కూడా పిలుస్తాడు. దానికి రామరాజు వద్దులేరా పార్టీకి అందరూ గొప్పవాళ్లు వస్తారు.. మా లాంటి మూటలు మోసే వాళ్లు వస్తే మీకు అవమానంగా ఉంటుంది అని అంటాడు. దానికి నర్మద మీరు వస్తే మాకు గౌరవంగా ఉంటుంది కానీ ఇలా అంటారేంటి మామయ్య అని అంటుంది. ఇంతలో వల్లీ వాళ్లు వచ్చి ఏం గొప్ప ఘనకార్యాలు చేశారని పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటారు అని అడుగుతుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావ్ వల్లీ అని రామరాజు అడిగితే భాగ్యం విషయం చెప్పకుండా అమూల్య లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా ఈ టైంలో ఎందుకు అంటుంది. మొత్తానికి విషయం తెలీకుండా దాచేస్తుంది. తను కూడా పార్టీ పెడితేనే మంచిదిఅని అంటుంది. సాగర్ మళ్లీ తండ్రిని పిలిస్తే నువ్వు ఉద్యోగస్తుడివిరా మీ నాన్న రైస్ మిల్లులో మూటలు మూస్తాడు అంటే నీకు అవమానంగా ఉంటుంది వద్దురా అని వెళ్లిపోతాడు.
నర్మద ఏడుస్తుంటే వేదవతి వెళ్లి నువ్వు ఏడ్వకూడదు.. నీ కంట్లో కన్నీరు రా కూడదు అని చెప్తుంది. భాగ్యం శ్రీవల్లికి విషయం సాయంత్రం ఫంక్షన్లో అందరి ముందు చెప్తాదమని ఆ అవమానంతో నలుగురిలో తలెత్తుకోలేదు అని అంటుంది. ధీరజ్, ప్రేమలు కారు షోరూంకి వస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చాంరా ఈషోరూంలో నీకు డ్రైవర్ జాబ్ వచ్చిందా అని అడుగుతుంది. ధీరజ్ వెళ్లి కొత్త కారు తీసుకోవడానికి చూస్తాడు. ఏంట్రా ఇది అని ప్రేమ కంగారు పడుతుంది.
వేదవతి భర్త దగ్గరకు వెళ్లి సాగర్ ముఖం మీద అలా చెప్పేశారు వాడు బాధ పడుతున్నారు అంటే వాడే కదా నా చేయి వదిలేసి వాళ్ల మామ చేయి పట్టుకున్నాడు అని అంటుంది. వేదవతి భర్తకి సర్ది చెప్తుంది. ఇలా కనిపించి అలా వచ్చేద్దాం అంటుంది. దొంగలా దొంగ చాటుగా వచ్చేయ్ మంటావా అని అంటుంది. పోనీ నేను అయినా వెళ్తానని వేదవతి అంటుంది. రామరాజు సరే అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























