Guppedanta Manasu  Serial Today Episode: మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు అని వసుధార రిషిని హెచ్చరిస్తుంది. అయితే అది నిజమే కానీ రిషి అనేవాడికి తెలియదు. వాడు తెలుసుకోలేకపోయాడు. కానీ, రంగాకు అన్ని  తెలుసు అంటాడు రిషి. ఏం వసుధార కన్‌ఫ్యూజన్‌గా ఉందా. రిషిగా చేయలేని పనులు రంగా చేయగలడు. అందుకే ఇంకా ఆ పాత్ర పోషిస్తున్నాను అంటాడు రిషి.


   అయితే ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు. ఎంతకాలం ఈ దోబుచులాటలు అని వసుధార అడుగుతుంది. కథ ముగింపు వచ్చేసరికి క్యారెక్టర్లు బయటపడతాయి. చూస్తూ ఉండు అంటాడు రిషి. మరోవైపు బావ వస్తా అన్నాడు ఇంకా రాలేందేంటని సరోజ అలోచిస్తుంది. బుజ్జితో మాట్లాడి ఒక క్లారిటీకి వస్తుంది సరోజ. శైలేంద్రను కలిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అనుకుంటుంది. తర్వాత బుజ్జి వచ్చి రిషిని కలుస్తాడు.


బుజ్జి: అన్నా నాన్నమ్మ చాలా గొడవ చేస్తుంది. మందులు వేసుకోవడం లేదు. నువ్ ఎప్పుడు వస్తావ్ అన్న. ఇప్పుడు ఆ శైలేంద్రను సరోజ కలవడానికి రెడీ అయింది.


రిషి: అరే బుజ్జి ఆ శైలేంద్రను సరోజ కలిసేలా నువ్వే చేయ్‌.


బుజ్జి: అలా  చేస్తే సరోజ రచ్చ రచ్చ చేస్తుంది కదా అన్న


 వారి మాటలను చాటు నుంచి  వసుధార వింటుంది.


వసుధార: ఎందుకు శైలేంద్రను సరోజ కలిసేలా చేస్తున్నారు. రిషి సర్‌ ఏం ప్లాన్ వేస్తున్నారు.


 (అని వసుధార డౌట్ పడుతుంది.)


బుజ్జి:  అన్నా నిన్ను ఒకటి అడుగుతా చెబుతావా. నువ్వు రంగావి కాదు కదా చెప్పన్న నువ్ మా రంగా అన్నవి కాదు కదా. నాకు బలంగా అనిపిస్తుంది. ముసల్దాని దగ్గరికి నువ్వు వచ్చి సంవత్సరం అవుతుంది. చిన్నప్పుడే రంగా ఊరి వదిలి వెళ్లిపోయాడు. తర్వాత నువ్వు రంగా అని వచ్చావ్. మేడమ్ గారు వచ్చాక ఆ ఉంగరం ఇచ్చాకే నాకు పక్కాగా అర్థమైంది నువ్ రంగావి కాదని.


రిషి: అరేయ్ బుజ్జి నువ్ అనవసరంగా ఆలోచిస్తున్నావ్. ఏదేదో ఊహించుకుంటున్నావ్. అలాంటిదేం లేదురా. నాకు చెప్పిందంతా నానమ్మ దగ్గర చెప్పావా?


బుజ్జి: లేదు నీ దగ్గరే చెప్పాను అన్న.


 అని బుజ్జి చెప్పగానే నేను నీతో తర్వాత మాట్లాడతాను. నాన్నమ్మ జాగ్రత్త అంటూ బుజ్జిని అక్కడి నుంచి పంపించేస్తాడు. వసుధార కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ధన్‌రాజ్‌కు సరోజ ఫోన్‌ చేస్తుంది. శైలేంద్ర, రిషిని తీసుకెళ్లింది. తాను రిషి కోసం వెతుకుతున్న విషయం చెప్తుంది. మీ అన్నయ్య శైలేంద్రకు మన పెళ్లి ఇష్టం లేదేమోనని ధన్‌రాజ్‌ కు అనుమానం రేకెత్తిస్తుంది. మీ అన్నయ్య వచ్చి పెళ్లి ఇష్టమేనని చెప్తేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరోజ చెప్తుంది. ధనరాజ్‌ సరేనని శైలేంద్రకు ఫోన్‌ చేసి కలవాలని చెప్తాడు. మరోవైపు వసుధార, రిషిని బుజ్జి కలిశాడా అని అడుగుతుంది.


రిషి: కలిశాడు. నాన్నమ్మ నా కోసం బాధపడుతుందట


వసుధార: అవునా సర్‌.. మరి ఎన్ని రోజులు ఇలా రంగాలా వారితో ఉంటారు. నిజం వారికి చెప్పొచ్చు కదా?


రిషి: అన్నిసార్లు నిజం మనం బయటపెట్టాల్సిన అవసరం లేదు వసుధార టైం వచ్చినప్పుడు నిజం  దానంతటే అదే బయటపడుతుంది.


వసుధార: రిషి సర్‌ ఇదంతా ఎందుకు చేస్తున్నారో.. నాకు కూడా చెప్పకూడదా? నా దగ్గర ఎందుకు దాస్తున్నారు.


 అని వసుధార అడిగినా రిషి మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు హైదరాబాద్‌ వచ్చిన సరోజ, ధనరాజ్‌తో కలిసి శైలేంద్ర దగ్గరకు వెళ్తుంది. నా బావను ఎందుకు తీసుకొచ్చావని నువ్వు రావడానికి నెల రోజుల ముందే వసుధార వచ్చి మా బాను రిషి సర్‌ అంటూ వేధించేదని తర్వాత నువ్వు వచ్చి మా బావను తీసుకొచ్చి మళ్లీ వసుధారతో తిరిగేలా చేశావని మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా? అంటూ సరోజ నిలదీయడంతో శైలేంద్ర షాక్‌ అవుతాడు. నువ్వు చెప్పేది నిజమా అంటూ వాడు నిజంగా రిషినేనా అని అనుమానిస్తాడు. తర్వాత షాక్‌ నుంచి తేరుకుని మా బావను మీ ఊరికి పంపించే బాధ్యత నాది అంటూ సరోజకు చెప్పి శైలేంద్ర వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.