మీనా వంట చేయలేదని, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నా వంట గది వైపు చూడటం లేదని ప్రభావతి మీనాపై విరుచుకుపడింది. రోహిణి కూడా మీనాపై కోప్పడింది.
Gunde Ninda Gudi Gantalu May 22 Episode: బాలు మీనాకి రోహిణి వార్నింగ్, గుణతో డీల్ సెట్ చేసుకున్న పార్లలమ్మ - గుండెనిండా గుడిగంటలు మే 22 ఎపిసోడ్!
Gunde Ninda Gudi Gantalu May 22 Episode: విల్లా విజయ్ ని పట్టుకుని ఇంటికి చేరుకున్న బాలు మీనాకు అవమానం ఎదురవుతుంది. గుణ ఎంట్రీతో సీరియల్ కీలక మలుపు తిరిగింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

- మనోజ్, రోహిణిలపై ప్రభావతి కోపం, మీనా వంట చేయలేదని విమర్శ.
- బాలు, మీనా 30 లక్షల డబ్బుల విషయంలో రోహిణిపై అనుమానం వ్యక్తం చేశారు.
- విద్య గిరిని అపార్థం చేసుకుని కొట్టి, తర్వాత క్షమాపణ కోరింది.
- వీడియో లీక్, 30 లక్షల రికవరీ కోసం గుణ ప్రవేశంతో కథనం మలుపు తిరిగింది.
Gunde Ninda Gudi Gantalu May 22 Episode Telugu Serial - గుండెనిండా గుడిగంటలు మే 22ఎపిసోడ్
గుండెనిండా గుడిగంటలు మే 21 ఎపిసోడ్ లో విల్లా విజయ్ ని పట్టుకుంటారు బాలు, మీనా. ఇంతలో మనోజ్ కాల్ చేసి 30 రూపాయలకోసం గొడవపడడంతో.. 30 లక్షలు మింగేసిన వ్యక్తి తప్పించుకుంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
గుండెనిండా గుడిగంటలు మే 22 ఎపిసోడ్ లో ఇంటికి చేరుకున్న మనోజ్, రోహిణిపై ఫైర్ అవుతుంది ప్రభావతి. మరోవైపు ఇప్పటికీ వంట చేయలేదంటూ ప్రభావతి మీనాపై విరుచుకుపడుతుంది. ఇంతలో బాలు, మీనా ఇంటికి చేరుకుంటారు. వంట చేయకుండా ఎక్కడ తిరుగుతున్నావ్ అని కోప్పడుతుంది. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లున్నారు..కనీసం వంట గదివైపు తొంగిచూడడం లేదన్నమాట..ఇవాళ ఆలస్యం అవుతుందని ముందుగానే వంట చేసి వెళ్లాను..ఇప్పటివరకూ ఆకలితో ఉన్నారు కానీ కనీసం వంట చేసిపెట్టిన విషయం కూడా గమనించలేదన్నమాట అంటుంది. మీరు మాకోసం తిరగాల్సిన అవసరం లేదు, ఆ డబ్బుల సంగతి మేం చూసుకుంటాం అంటుంది రోహిణి. ఏంటి నాన్నా..ఈ 30 లక్షలు కూడా మింగేద్దామని పార్లలమ్మ ప్లాన్ చేస్తున్నట్టుంది అంటాడు బాలు. వాళ్లే చూసుకుంటాం అన్నారుకదా మనకెందుకు అంటుంది మీనా. మనం ఎలా వెతుకుతాం అని మనోజ్ అంటే.. అందుకోసం నేను వేరే మనిషిని పెట్టానులే అంటుంది.
అపార్థం చేసుకుని కొట్టినందుకు బాలు ఫ్రెండ్ సోదరుడు గిరికి క్షమాపణలు చెబుతుంది విద్య. తనని చూసి పారిపోతుండగా వెనుకే వెళ్లిమరీ SOrry చెబుతుంది. వెళ్లిపోతుండగా విద్య చున్నీ బండిలో ఇరుక్కుంటుంది..అది తీసి ఇవ్వబోతాడు..విద్య వెనక్కు తిరిగేసరికి ఆ వ్యక్తిచేతిలో చున్నీ ఉండడంతో నువ్వు ఇలాంటివాడివి అని తెలియక సారీ చెప్పానంటూ మళ్లీ కొడుతుంది. అదేంటి ఈమె కనిపించిన ప్రతిసారీ కొట్టిపోతోంది అనుకుంటాడు.
మీనా వంటింట్లో పనిచేస్తుంటే వెళ్లిన బాలు.. మనకెందుకు ఇలా జరుగుతోంది అంటాడు. మనం తప్పు చేయలేదు, ఇందులో మనకొచ్చే లాభం లేదు. అయినా రోహిణి వాళ్లను వెతకొద్దు అని గొడవచేసింది అంటుంది మీనా. ఆ కల్పన మింగేసినట్టు ఈ డబ్బులు కూడా దాచేద్దామని ప్లాన్ చేస్తోందేమో అంటాడు బాలు. నాక్కూడా ఇదే నిజం అనిపిస్తోంది అంటుంది మీనా.
గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన గుప్పెడంత మనసు, బ్రహ్మముడి కిరణ్ కాంత్!
ఇంటికి చేరుకున్న విద్య..తన చున్నీకి ఆయిల్ మరకలు అంటుకోవడం గమనిస్తుంది. అంటే మళ్లీ గిరిని అపార్థం చేసుకున్నా అన్నమాట అని బాధపడుతుంది. మళ్లీ ఎలాగైనా కలసి క్షమించమని అడగాలి అనుకుంటుంది. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్లుంటారా అనుకుంటుంది. గిరి గురించి ఆలోచించి విద్య ముసిముసినవ్వులు నవ్వుకుంటుంటే.. రోహిణి ఏంటే పిలిస్తే పలకకుండా రొమాంటిక్ మూడ్ లో ఉన్నావ్ అంటుంది. 30 లక్షల మోసం కేసులో ఓ క్లూ దొరికింది అంటుంది రోహిణి. సీసీ ఫుటేజ్ దొరికితే వాళ్లను పట్టుకోవచ్చు అంటుంది. బాలు మీనా వెతికితే..డబ్బులు మాకు రావు, డీలర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేం అందుకే వాళ్లని వెతకొద్దని వార్నింగ్ ఇచ్చానంటుంది. రోహిణి మాటల్లో స్వార్థం గమనించిన విద్య ఇందులో నేను ఇన్వాల్వ్ అవను అని చెప్పేస్తుంది. విద్య నో చెప్పడంతో గుణ సహాయం తీసుకోవాలి అనుకుంటుంది రోహిణి.
బాలు తన బావమరిది శివను కలిసి నా ఫోన్లో ఉన్న వీడియో ఎలా లీకైందో అర్థంకావడం లేదనే సందేహాన్ని బయటపెడతాడు. మనకు - గుణకు మధ్య ఏదో లింక్ ఉందంటాడు. గుణ స్నేహితులతో కాంటాక్ట్ లోకి వెళితే వారికి వీడియో లీక్ చేసిందెవరో తెలుస్తుందంటాడుయ ఈ ప్లాన్ పై మీనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కానీ బాలు మాత్రం శివ మారిపోయాడు అని సమర్థిస్తాడు.
30 లక్షల మోసం వ్యవహారంలో రోహిణి నేరుగా గుణను కలవడం ట్విస్ట్. విల్లా విషయం చెప్పి ఆ 30 లక్షలు వసూలు చేయమంటుంది. వెంటనే డీల్ సెట్ చేస్తాడు గుణ..నేను అందరి దగ్గరా 4శాతం తీసుకుంటాను నీ దగ్గర 2 శాతం తీసుకుంటా అంటాడు.
కథ కీలక మలుపులు తిరిగేలా ఉంది..ఓ వైపు వీడియో బయటపడడం, మరోవైపు 30 లక్షల రికవరీ కోసం గుణ ఎంట్రీ ఇవన్నీ కలసి రోహిణి బండారం మొత్తం బయటపెట్టేలా ఉన్నాయ్.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Frequently Asked Questions
ఈ ఎపిసోడ్ లో రోహిణి, ప్రభావతి మీనాపై ఎందుకు కోప్పడ్డారు?
30 లక్షల మోసం కేసులో రోహిణి ఎవరిని కలిసింది?
30 లక్షల మోసం వ్యవహారంలో రోహిణి నేరుగా గుణను కలిసింది. విల్లా విషయం చెప్పి ఆ 30 లక్షలు వసూలు చేయమని కోరింది.
బాలు తన బావమరిది శివను ఎందుకు కలిసాడు?
తన ఫోన్ లో ఉన్న వీడియో ఎలా లీకైందో అర్థం కావడం లేదని బాలు తన బావమరిది శివతో తన సందేహాన్ని పంచుకున్నాడు. గుణకు, తనకు మధ్య ఏదో లింక్ ఉందని అనుమానం వ్యక్తం చేసాడు.
గిరికి, విద్యకు మధ్య ఏం జరిగింది?
విద్య అపార్థం చేసుకుని గిరిని కొట్టింది. తన చున్నీ గిరి చేతిలో ఇరుక్కుని, తీసి ఇవ్వబోతుంటే మళ్ళీ అపార్థం చేసుకుని కొట్టింది.
ట్రెండింగ్ వార్తలు






















