Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ కాల్ చేసి జున్నుని తీసుకురమ్మని చెప్పిందని అర్జున్ తల్లితో చెప్తాడు. లక్ష్మీకే కష్టాలు అన్నీ వస్తున్నాయని వసుంధర బాధ పడితే అర్జున్ ఏం కాదు అని చెప్తాడు. లక్ష్మీ ఓ వైపు జున్నుని, మరోవైపు లక్కీని ఎలా మ్యానేజ్ చేస్తుందా అని అనుకుంటాడు. తనకి తోడు ఉంటానని అంటాడు. భూదేవికి ఉన్న ఓర్పు లక్ష్మీకి ఉందని లక్ష్మీకి త్వరలోనే మంచి రోజులు రావాలని కోరుకుంటారు. మరోవైపు మిత్ర వాళ్లు గుడికి చేరుకుంటారు. 


జాను: అక్క నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అల్రెడీ నువ్వు ఇక్కడ సంయుక్తలా ఉన్నావ్ మరి జున్ను అమ్మగా ఎలా కనిపిస్తావు.
సంయుక్త: ఏమో జాను ప్రస్తుతానికి ఇక్కడ లక్కీకి జున్నుఅమ్మ లక్ష్మీ కనిపించాలి. అప్పుడే సంయుక్త జున్ను వాళ్ల అమ్మ ఒకరు కాదు అని అర్థమవుతుంది. లక్కీ దగ్గర నా ఫొటోలు ఉన్నాయి కదా అవి సోషల్ మీడియాలో పెడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే లక్కీని రెచ్చ గొట్టకుండా మ్యానేజ్ చేస్తున్నా. 
జాను: అది సరే అక్క కానీ నువ్వు జున్ను అమ్మలా కనిపిస్తే ఇంకేమైనా ఉందా జున్ను తల్లే లక్ష్మీ అని అందరికీ అనుమానం వచ్చినా క్లారిటీ వచ్చినా ఇంకేమైనా ఉందా.
సంయుక్త: జాను నేను ఏదో ఒకటి చేస్తా పద.


ఇక గుడిలోకి వెళ్లిన తర్వాత పంతులు 108 ప్రదక్షిణలు చేయమంటే పెళ్లి కూతురు ఖుషి మొండి కేస్తుంది. దాంతో ఆవిడ తల్లి కష్టం తెలియకుండా పెరిగింది కాబట్టి చేయడం లేదని అంటుంది. ఇక మిత్ర భార్య లక్ష్మీ మిత్ర కోసం చాలా చేసిందని మిత్రకు వచ్చే ప్రతీ గండం నుంచి తనే కాపాడేదని దేవయాని ఖుషితో చెప్తుంది. మిత్ర గతంలో తనని లక్ష్మీ కాపాడిన పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటాడు. 


లక్ష్మీ గొప్పతనం గురించి చెప్పొద్దని మనీషా అంటుంది. వివేక్ అయితే అన్నయ్య గురించి వదిన ఎన్ని చేసిందో నీకు తెలీదా అని ప్రశ్నిస్తాడు. ఇక ఆవుని చూసి లక్కీ వెళ్లిపోతుంది. మిత్ర లక్ష్మీ టాపిక్ రావడంతో వెళ్లిపోతాడు. ఇక ఖుషి తల్లి అందర్ని ప్రదక్షిణలు చేస్తారా అని అడుగుతుంది. అందరూ చేయలేమని అనేస్తారు. చివరకి ఖుషి తల్లి జానుని చూసి నీకు డబ్బులు ఇస్తాను మా అమ్మాయికి బదులు నువ్వు ప్రదక్షిణలు చేస్తావా అని అడుగుతుంది. ఇక మంచి పని కోసం చేస్తానని డబ్బులు అవసరం లేదని జాను అంటుంది. 


మిత్ర లక్ష్మీ గురించి దేవయాని అన్న మాటలు తలచుకొని బాధ పడుతుంటాడు. మిత్ర దగ్గరకు సంయుక్త వస్తుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నారు. గతం గుర్తొస్తుందా అని అడుగుతుంది. మిమల్ని అంత ప్రేమించే మీ భార్య మోసం చేసిందని అంటే ఎలా నమ్మారని అడుగుతుంది. ఇక మనీషా దేవయానిని బయటకు తీసుకొచ్చి లక్ష్మీ గురించి ప్రస్తావించి నందుకు క్లాస్ ఇస్తుంది. ఫుల్లుగా సీరియస్ అయిపోతుంది. మీ కొడుకు పెళ్లి అయితే సరిపోతుందా నా పెళ్లి అవ్వొద్దా అని అడుగుతుంది. 


మరోవైపు జాను, వివేక్‌లు కలిసి ప్రదక్షిణలు చేస్తారు. నిన్నూ నన్ను కలపడానికే ఆ దేవుడు ఇలా చేస్తున్నాడని వివేక్‌తో జాను చెప్తాడు. సంయుక్త వాళ్ల దగ్గరకు వచ్చి దేవుడ్ని గట్టిగా కోరుకోమని మీ పెళ్లి జరగుతుందని అంటుంది. ఇంతలో జున్ను వాళ్లు వస్తారు. లక్కీ సంయుక్తతో జున్ను వాళ్లు వచ్చారు జున్ను వాళ్ల అమ్మని పరిచయం చేస్తా రండి ఆంటీ అని లక్కీ అంటుంది. జున్ను దగ్గరకు వచ్చి అమ్మ రాలేదా అని అంటుంది. ఆఫీస్ నుంచి వస్తుందని అంటే లక్కీ తన అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇంతలో లక్ష్మీ లక్కీ దగ్గరకు వస్తుంది. లక్కీ మాత్రం ఏదో జరుగుతుందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య మిస్సింగ్, బెనిఫిట్ తమకే అంటోన్న జ్యోత్స్న, విడాకులు కోరిన దీప!