Brahmamudi Serial Today Episode: డీఎన్‌ఏ రిపోర్ట్‌ కోసం దుగ్గిరాల కుటుంబం మొత్తం ఎదురుచూస్తుంటుంది. అందరూ రిపోర్ట్‌ ఎప్పుడు వస్తుందా..? అందులో ఏం రిజల్ట్‌ వస్తుందా అని టెన్షన్‌ పడుతుంటారు. టెన్షన్‌ తట్టుకోలేని ఇందిరాదేవి రాజ్‌కు కాల్‌ చేస్తుంది.

Continues below advertisement

ఇందిరాదేవి: ఓరేయ్‌ రాజ్‌ డీఎన్‌ఏ రిపోర్ట్‌ ఎప్పుడు వస్తుందిరా..?

రాజ్‌: వస్తుందిలే నాన్నమ్మ టెన్షన్‌ ఎందుకు..?

Continues below advertisement

ఇందిరాదేవి: రిపోర్ట్‌ కాస్త త్వరగా ఇవ్వమని చెప్పరా..? రిపోర్ట్‌ కోసం ఎదురుచూసి మాకు పిచ్చెక్కేలా ఉంది

రాజ్‌: నేను కూడా ఆ రిపోర్ట్‌ కోసమే ఎదురుచూస్తున్నాను కదా నాన్నమ్మ

అందరూ అంత టెన్షన్‌ పడుతుంటే కావ్య పాపతో మాట్లాడుతూ హాల్లోకి వస్తుంది. ఇందిరాదేవి: మేము రిపోర్ట్స్ లో ఏమి వస్తుందా అని అంత టెన్షన్ గా ఉంటే నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టు అంత ఉల్లాసంగా సంతోషంగా ఎలా ఉన్నావు కావ్య

అపర్ణ: అవును కావ్య నీకు టెన్షన్‌గా లేదా…?

ధాన్యలక్ష్మీ: కావ్యను చూస్తుంటే అసలు టెన్షన్‌ పడుతున్నటే కనబడటం లేదు.

కావ్య: మీరందరూ టెన్షన్ పడుతున్నారు నేను పడట్లేదు. మీకు నిజం తెలియాలి నాకు ఆల్రెడీ నిజం తెలుసు

రాజ్‌ రిపోర్ట్స్‌ తీసుకుని వస్తాడు.

రాజ్‌: రిపోర్ట్‌ వచ్చింది..?

ఇందిరాదేవి: రిపోర్ట్‌ ఏమొచ్చిందా మనవడా..? చెప్పరా టెన్షన్‌ తట్టుకోలేకపోతున్నాను..

రాజ్‌: ఇంకా ఓపెన్‌ చేయలేదు నాన్నమ్మ..

ఇందిరాదేవి: ఓపెన్‌ చేయకపోవడం ఏంట్రా.. ముందు వెంటనే ఓపెన్‌ చేసి చూసి చెప్పరా..?

అనగానే.. రాజ్‌ రిపోర్ట్‌ చూసి షాక్‌ అవుతాడు. అలాగే ఫ్రీజ్‌ అయిపోతాడు. రిజల్ట్‌ ఏమొచ్చిందిరా చెప్పు అని అందరూ అడుగుతుంటారు. రాజ్‌ అలాగే నిలబడిపోతాడు.

కావ్య: ఏమోచ్చింది. ఈ పాప మన పాప కాదు అని వచ్చి ఉంటుంది అందుకే ఆయన అలా నిలబడిపోయారు. ఏవండి చెప్పండి.. అంతే కదా రిపోర్ట్‌ వచ్చింది.

రాజ్: అంతలేదు.. ఈ పాప మన పాపే అని వచ్చింది. కళావతి ఇకనైనా నీ అనుమానం వీడి పాపను బాగా చూసుకో

రాజ్‌ మాటలకు కావ్య షాక్‌ అవుతుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అక్కడే ఉన్న రాహుల్‌, రేఖ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు.

కావ్య: నో ఆ రిపోర్ట్స్‌ అబద్దం, టెస్టులు అబద్ధం, ఎవరో కావాలని నా మీద నా పాప మీద కుట్ర చేస్తున్నారు

రాజ్‌: ఏంటి కావ్య డాక్టర్లు చేసిన టెస్టులు చూసి కూడా నువ్వు అబద్దం అంటున్నావు

కావ్య: అవును ఇదంతా నిజంగానే అబద్ధం ఎవరో కావాలనే చేస్తున్నారు. ఈ బిడ్డ నా బిడ్డ కాదని ఎంత అరిచి చెప్పినా కూడా ఎందుకు ఎవరూ వినిపించుకోవడం లేదు.  ఈ బిడ్డ నా బిడ్డ కాదు.. ఈ బిడ్డ నా బిడ్డ కాదు.. ఈ బిడ్డ నా బిడ్డ కాదు

రాజ్‌: ఇక ఆపు కళావతి

అంటూ కోప్పడగానే.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇందిరాదేవి కావ్యను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది.

ఇందిరాదేవి: ఇప్పటికైనా మా మాట విను కావ్య ఈ బిడ్డ నీకు దేవుడు ఇచ్చిన వరం నీ బిడ్డగా ఒప్పుకో

అపర్ణ: కావ్య రిపోర్ట్స్‌ వచ్చాక ఈ బిడ్డ నీ బిడ్డే అని ఒప్పుకుంటాను అన్నావు ఇప్పుడు మళ్లీ  మెలిక పెడుతున్నావేంటే

రాజ్‌: కావ్య ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా విన్నాను.. ఇప్పటి నుంచి నేను చెప్పేది వినాలి. ఈ పాపను మన పాపగా ఒప్పుకోవాలి..

కావ్య: ఎప్పటికీ అలా ఒప్పుకోను… నేను ఎప్పటికీ ఈ బిడ్డను నా బిడ్డగా ఒప్పుకోను. నన్ను పిచ్చిదాన్ని అనుకున్న సరే కానీ నేను మాత్రం ఒప్పుకోను

అంటూ కావ్య చెప్పగానే అందరూ షాక్‌ అయిపోతారు. కావ్యను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. కానీ ఒప్పుకోదు.. పాపను తీసుకుని రూంలోకి వెళ్లిపోతుంది. కట్‌ చేస్తే రుద్రాణి మినిస్టర్‌ దర్మేంద్ర దగ్గరకు వెళ్తుంది. దర్మేంద్ర మీ రుణం ఎలా తీర్చుకోవాలని అడుగుతాడు. సమయం వచ్చినప్నుడు అడుగుతాను సాయం చేయండి అంటుంది రుద్రాణి. తర్వాత తులసి, రుద్రాణిని చూసి అనుమానిస్తుంది. దీంతో దర్మేంద్ర పార్టీ వ్యవహారాల గురించి డిస్కష్‌ చేయడానికి వచ్చింది అని చెప్తాడు. మరోవైపు రూంలో కూర్చుని బాదపడుతున్న కావ్యను రాజ్‌ ఓదారుస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!