Brahmamudi Serial Today Episode: హాస్పిటల్ లో ఉన్న ధాన్యలక్ష్మీ నిజం తెలుసుకుని రాజ్, కావ్యలకు సారీ చెప్తుంది. దీంతో అందరూ ధాన్యలక్ష్మీని తిడుతుంటారు. అందరినీ కావ్య వారిస్తుంది. ఎవ్వరూ తిట్టొద్దని చెప్తుంది.

Continues below advertisement

కావ్య: చిన్నత్తయ్యని ఎవరూ ఏమీ అనొద్దు.. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు. అప్పూ, కళ్యాణ్‌లు కనిపించకపోయేసరికి అలా ప్రవర్తించిందే కానీ, మరొకటి కాదు..

రాజ్: ఆ వీడియో చూడగానే నాకే ఏమీ తోచలేదు.. అలాంటిది పిన్ని ఎలా తట్టుకుంటుంది? తల్లి మనసు కదా? ఆ మాత్రం కంగారు ఉంటుంది.. అందుకే కళ్యాణ్, అప్పూలని ఎలాగైనా తీసుకురావాలని మేమే ఈ నిర్ణయం తీసుకున్నాము

Continues below advertisement

ధాన్యలక్ష్మీ : రాజ్‌ నీకు మళ్లీ సారీ చెప్తున్నాను.. మీరేంటో తెలిసి కూడా నిన్ను, కావ్యని అనరాని మాటలు అన్నాను

కావ్య: ఏంటి చిన్నత్తయ్యా మీరు మరీనూ.. అప్పూ కాసేపట్లో పురుడు పోసుకుంటోంది. నీకు కాసేపట్లో మనవడో, మనవరాలో పుట్టబోతున్నారు.. ఇలాంటి సమయంలో సంతోషంగా ఉండాలి.

అని చెప్తుంగానే డాక్టర్ వచ్చి అప్పూకి ఆడపిల్ల పుట్టిందని చెప్తుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత రాజ్‌ కూడా కళ్యాణ్‌కు సారీ చెప్తాడు.

రాజ్‌: ట్రస్ట్ గురించి మన ఫ్యామిలీ ముందు చెప్పకుండా ఉండాల్సింది.. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. కారణం ఏదైనా ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేసే వరకు వచ్చారంటే ఆలోచించాల్సిన విషయమే

కావ్య: సరైన సమయానికి మేం అక్కడికి వెళ్లాం కాబట్టి అప్పూ, కళ్యాణ్‌లను ఇలా చూడగలుగుతున్నాం

రాజ్‌: అవును కళ్యాణ్‌ మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్లని మీరు చూశారు కదా? వాళ్ల మాటల్లో దీని వెనుక ఎవరున్నారో మీరు గమనించారా?

కళ్యాణ్‌: రౌడీలు చాలాసార్లు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు.. అవతలి వాళ్ల మీద అనుమానం రాకుండా నీ పేరు వాడారు. కానీ దీని వెనుక ఎవరో శత్రువులు ఉన్నారని అనిపిస్తోంది.

అని చెప్పగానే.. అయితే దీని గురించి లోతుగా ఆలోచించాలి అంటాడు రాజ్‌. తర్వాత అందరూ హాస్పిటల్‌ నుంచి ఇంటికి వెళ్లిపోతారు. మనవరాళ్ల బారసాల గురించి అందరూ మాట్లాడుకుంటుండగానే మినిస్టర్‌ ధర్మేంద్ర వస్తాడు. ఆయన్ని చూసిన అందరూ షాక్‌ అవుతారు.

ధర్మేంద్ర: ఏంటి అందరూ అలా షాక్‌ అయ్యారు.. నేను మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. మా పాపకు బారసాల చేస్తున్నాం.. అందుకోసం మిమ్మల్ని ఇన్వైట్‌ చేయడానికి వచ్చాను. అన్ని సమస్యలు తీరిపోయాక.. నా పాపకు నేను చేస్తున్న తొలి పండుగ ఇది. నా భార్య మీరు తప్పకుండా వచ్చి పాపని ఆశీర్వదించాలని పట్టుబడుతోంది. కావ్యగారు మీరే కాదు.. మీ కుటుంబమంతా నా ఆప్తులే, అందుకే మీరందరూ తప్పకుండా బారసాలకు రావాలి

అంటూ అందరినీ ఆహ్వానించి వెళ్లిపోతాడు. మనిస్టర్‌ వెళ్లిపోయాక అందరూ మాట్లాడుకుంటుంటారు.

రాజ్: సంతోషంగా మినిస్టర్ గారింట్లో బారసాలకు మనందరం వెళ్దాం

ఇందిరాదేవి: మేం ఎక్కడికీ రాలేము.

అపర్ణ: తెలిసి చేసినా తెలియక చేసినా నా కోడలి కష్టానికి కన్నీటికీ కారణం అయినవాడు కదా? ఎలా వెళ్తాం..

ఇందిరాదేవి: అవును రాజ్‌ అతని మీద కోపం లేదు.. కానీ అలాంటి వాళ్లకి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది.

అని చెప్పగానే.. సరే రేపటి లోగా ఆలోచిద్దాంలే అంటుంది కావ్య. మరోవైపు రుద్రాణిని కలిసిన రాహుల్, రేఖ తిడుతుంటారు. రుద్రాణి మాత్రం త్వరలోనే తాను దుగ్గిరాల ఇంట్లో అడుగుపెడతానని చెప్తుంది. తర్వాత ట్రస్ట్‌ పెట్టడానికి ధాన్యలక్ష్మీ ఒప్పుకుందని దుగ్గిరాల ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే పోలీసులు అప్పుకు ఫోన్‌ చేసి రౌడీల గురించి మాట్లాడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!