Brahmamudi Serial Today Episode: గార్డెన్‌లో కూర్చున్న అపర్ణ ఇందు గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది. పక్కనే ఉన్న స్వాతి ఓదారుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నందు ధైర్యం చెప్తుంది. కిడ్నాపర్లకు కావాల్సింది డబ్బు. అది ఇచ్చే వరకు అక్కను ఏమీ చేయరని అపర్ణకు చెప్తుంది. దీంతో అపర్ణ కొంచెం కూల్‌ అవుతుంది. మరోవైపు ఇందు కోసం భోజనం తీసుకెళ్తారు రాజు, లక్కీ.

Continues below advertisement

రాజు: నీ పనే బాగుంది కూర్చున్న దగ్గరకే అన్ని వస్తున్నాయి. భోజనం తీసుకొచ్చాను తిను

ఇందు:  నాకు ఏమీ వద్దు

Continues below advertisement

లక్కీ: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ముందుకు వచ్చిన అన్నాన్ని కాదనకూడదు తిను

ఇందు: మీరు తీసుకొచ్చిన దాన్ని కూడా భోజనం అంటారా..? ఇందాకా తీసుకొచ్చిన అన్నం ఉడకనేలేదు.. నోట్లో పెట్టుకుంటే మెతుకులు గుచ్చుకుంటున్నాయి. పప్పును తుప్పు పట్టించారు. కూరనేమో కకృతిగా వండారు. రసం పేరుతో నీళ్లు పోశారు

లక్కీ: తను చెప్పేది నిజమే మామ నాకు కూడా తినబుద్ది కావడం లేదు

రాజు:  ఏంట్రా బిర్యానీ కోసం సపోర్టు చేస్తున్నావా..?

ఇందు: నాకు బిర్యానీ కూడా ఏమీ వద్దు

రాజు: మరి ఇంకేం కావాలమ్మా

ఇందు: నాకు ఇంటి ఫుడ్డు కావాలి

రాజు:  అత్తారింటి పుడ్డు ఏమీ వద్దా

లక్కీ: సూపర్‌ ఐడియా  మామ మీ అమ్మకు చెప్పి వండించి తీసుకొస్తే

రాజు: చెప్పు తీసుకుని కొడుతుందిరా..? మనకు తిండి పెట్టడమే దండగ అని మా నాన్న ఫీల్ అవుతున్నాడు. మళ్లీ దీనికి కూడానా..?

ఇందు: నీలాంటి కొడుకు ఉంటే అలానే ఫీల్ అవుతాడు. నాకు ఇంటి ఫుడ్డే కావాలి.. అదైతేనే తింటాను

రాజు: అయితే తినకు మానేయ్‌

ఇందు:  హలో నాకు ఏమైనా అయితే మీకు డబ్బులు కాదు కదా చిల్లర కూడా రాదు

లక్కీ: మామ తను చెప్పింది కూడా నిజమే కదరా..? ఒకసారి ఆలోచించు..

రాజు: ఎంత ఆలోచించినా మనకు వండటం రాదు కదరా..?

లక్కీ: తనకు వచ్చు కదా మావ

అని లక్కీ చెప్పగానే.. రాజు, లక్కీ ఇందు చేత వంట చేయిస్తారు. అందరూ తినడానికి రెడీ అయ్యాక ఇందు తాను తర్వాత తింటానని చెప్తుంది. లక్కీ అదుర్దాగా తినబోతుంటే..

రాజు: ఆగరా ఆ భోజనం తినోద్దు..

లక్కీ: ఎందుకు మావ..

రాజు: ఈ భోజనంలో ఏ విషమో మందో కలిసి మనం తిని పడిపోతే మేడం తప్పించుకోవాలని ప్లాన్‌ చేసి ఉండొచ్చు

ఇందు: తినే భోజనంలో విషం కలిపేంత చెడ్డదాన్ని కాదు నేను. అయినా మీరు నమ్మాలంటే నేనేం చేయాలి

రాజు: అయితే ముందు నువ్వు తిను తర్వాత మేము తింటాము

అని చెప్పగానే.. ఇందు అన్నం తీసుకుని తింటుంది. తర్వాత రాజు, లక్కీ భోజనం చేస్తుంటారు. ముగ్గురూ కలిసి భోజనం చేస్తుంటే బయట నుంచి వచ్చిన నందు కిటికీ తెరచి చూస్తుంది. ఇందు భోజనం చేయడం చూసి షాక్‌ అవుతుంది.

నందు: అక్కేంటి వీళ్లతో కలిసి భోజనం చేస్తుంది. బెదిరించి భోజనం చేయిస్తుంటారు. ఎలాగైనా అక్కతో మాట్లాడాలి

అనుకంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో ఉన్న పోలీసులకు వండి పెట్టడం తన వల్ల కాదని భ్రమరాంబ బాధపడుతుంది. ఎవరైనా వంట మనిషిని చూడమని రేఖకు చెప్తుంది. అప్పుడే చక్రి అప్పు కోసం వస్తాడు. రేఖ తన దగ్గర డబ్బులు లేవని చెప్పగానే.. అయితే మీ ఒంటి మీద ఇంట్లో ఉన్న నగలు ఇవ్వండని డిమాండ్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!