వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్న యువ కథానాయకుడు ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar). జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షకుల ముందుకు సినిమాలను తీసుకు వస్తున్నారు. ఈ ఏడాది 'అతిథి దేవో భవ', 'బ్లాక్', 'తీస్ మార్ ఖాన్', 'క్రేజీ ఫెలో' సినిమాలను విడుదల చేశారు. ఇయర్ ఎండ్‌లో మరో సినిమా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
 
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా 'టాప్ గేర్' (Top Gear Telugu Movie). ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ అనుబంధ సంస్థ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించారు. ఇయర్ ఎండ్‌కు ఒక్క రోజు ముందు సినిమాను విడుదల చేయనున్నట్టు నేడు ప్రకటించారు.


డిసెంబర్ 30న 'టాప్ గేర్'
Telugu Movie Top Gear Release Date : పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టాప్ గేర్' సినిమాను డిసెంబర్ 30న విడుదల చేస్తున్నట్టు ఈ రోజు చిత్ర బృందం తెలియజేసింది. ''ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందించాం. ఆయన క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుంది'' అని దర్శకుడు తెలిపారు.
 
''సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత చెప్పారు .



ఆదికి జోడీగా రియా!
'టాప్ గేర్'లో ఆది సాయి కుమార్ జోడీగా రియా సుమన్ (Riya Suman) నటించారు. ఈ సినిమా కంటే ముందు 'పేపర్ బాయ్', నేచురల్ స్టార్ నాని 'మజ్ను' సినిమాల్లో ఆమె నటించారు. ఇంకా ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారని దర్శక - నిర్మాతలు తెలిపారు. 


Also Read : సమంత గ్లిజరిన్ వాడలేదు - జ్వరంలోనూ స్టంట్స్!



'జులాయి', 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి తమ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారని కేవీ శశ్రీధర్ చెప్పారు. శ్రీవిష్ణు 'అల్లూరి', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' తదితర చిత్రాలకు పని చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. 


బ్రహ్మాజీ, 'సత్యం' రాజేష్, మైమ్ గోపి, నర్రా శ్రీనివాస్, శత్రు, బెనర్జీ, 'చమ్మక్' చంద్ర, 'రేడియో మిర్చి' హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : రామాంజనేయులు, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, నిర్మాత : కేవీ శ్రీధర్ రెడ్డి.